ఎవరైనా అమ్మ నాన్నలను చూసేందుకు విదేశాల నుండి రావాలంటే సాధారణంగా విమానంలో వస్తారు. అయితే ముంబైకి చెందిన మేధా రాయ్ మాత్రం ఏకంగా 24 వేల కిలోమీటర్లు బైక్ పైన ప్రయాణించి జర్మనీ నుండి ముంబైకు చేరుకుంది. దాదాపు 156 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆమె తన తల్లిదండ్రులను చేరుకుంది.
వివరాల్లోకి వెళితే జర్మనీకి చెందిన హాక్ విక్టర్ 2013లో ముంబై కు వచ్చాడు. అక్కడ మేధా తో అతనికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. లాక్ డౌన్ సమయంలో వారు జర్మనీలో గత ఏడాది వివాహం చేసుకున్నార. అయితే ఆంక్షల కారణంగా ఆ పెళ్ళికి మేధా కుటుంబ సభ్యులు హాజరు కాలేకపోయారు.
దీంతో పెళ్లి తర్వాత ఆమె తన తల్లిదండ్రులు కలుసుకోవాలని అనుకుంది. అందుకోసం ద్విచక్ర వాహనంపై ముంబైకి రావాలని నిర్ణయించుకుంది. బైక్ వెనుక కూర్చొని అంత దూరం ప్రయాణిస్తే వెన్ను నొప్పి సమస్యలు వస్తాయి కనుక ఆమె ఇందుకోసమే బైక్ డ్రైవింగ్ నేర్చుకొని తన భర్తతో కలిసి చెరొక బైక్ లో ముంబై కు వచ్చేసారు. ఏదో గిన్నిస్ రికార్డు కోసమో సాహస యాత్ర కోసమో కాకుండా కేవలం తన తల్లిదండ్రులు పై ఉన్న ప్రేమతో ఆమె ఇంతటి సాహసం చేయడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయమే..!
This post was last modified on December 11, 2022 1:00 pm
ఇవాళ ఎవడే సుబ్రహ్మణ్యంని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మొన్నీమధ్యే ఈవెంట్ చేసి అభిమానులను…
అత్యంత వివాదాస్పద జ్యోతిష్కుడిగా పేరు తెచ్చుకున్న వేణు స్వామి వివిధ సందర్భాల్లో ఎంత అతి చేశాడో చూస్తూనే వచ్చాం. నాగచైతన్య,…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి శుక్రవారం మరో భారీ ఊరట లభించింది. ఇప్పటిదాకా…
జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయోగాలు.. జనసేన నాయకులకు ఇబ్బందిగా మారుతున్నాయి. సాధారణంగా పార్టీని…
ఏపీ సీఎం చంద్రబాబుకు మరో కీలకమైన వ్యవహారం కత్తిమీద సాముగా మారనుంది. ఇప్పటి వరకు పాలన వేరు.. ఆమోదించిన బిల్లులు..…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరికి అత్యంత సమీపంలో ఓ ప్రైవేట్ హోటల్ వెలిసేందుకు అనుమతులు జారీ…