ఎవరైనా అమ్మ నాన్నలను చూసేందుకు విదేశాల నుండి రావాలంటే సాధారణంగా విమానంలో వస్తారు. అయితే ముంబైకి చెందిన మేధా రాయ్ మాత్రం ఏకంగా 24 వేల కిలోమీటర్లు బైక్ పైన ప్రయాణించి జర్మనీ నుండి ముంబైకు చేరుకుంది. దాదాపు 156 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆమె తన తల్లిదండ్రులను చేరుకుంది.
వివరాల్లోకి వెళితే జర్మనీకి చెందిన హాక్ విక్టర్ 2013లో ముంబై కు వచ్చాడు. అక్కడ మేధా తో అతనికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. లాక్ డౌన్ సమయంలో వారు జర్మనీలో గత ఏడాది వివాహం చేసుకున్నార. అయితే ఆంక్షల కారణంగా ఆ పెళ్ళికి మేధా కుటుంబ సభ్యులు హాజరు కాలేకపోయారు.
దీంతో పెళ్లి తర్వాత ఆమె తన తల్లిదండ్రులు కలుసుకోవాలని అనుకుంది. అందుకోసం ద్విచక్ర వాహనంపై ముంబైకి రావాలని నిర్ణయించుకుంది. బైక్ వెనుక కూర్చొని అంత దూరం ప్రయాణిస్తే వెన్ను నొప్పి సమస్యలు వస్తాయి కనుక ఆమె ఇందుకోసమే బైక్ డ్రైవింగ్ నేర్చుకొని తన భర్తతో కలిసి చెరొక బైక్ లో ముంబై కు వచ్చేసారు. ఏదో గిన్నిస్ రికార్డు కోసమో సాహస యాత్ర కోసమో కాకుండా కేవలం తన తల్లిదండ్రులు పై ఉన్న ప్రేమతో ఆమె ఇంతటి సాహసం చేయడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయమే..!
This post was last modified on December 11, 2022 1:00 pm
మార్చి నుంచి ఆగస్టుకి విడుదల తేదీ వాయిదా వేసుకున్న నాని ది ప్యారడైజ్ ఖచ్చితంగా చెప్పిన డేట్ కి విడుదలవుతుందా…
జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…
అదేంటో కానీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పలు కీలక విషయాలు సాధారణ రోజుల్లో ఎక్కడా గుర్తుకు ఉండవు... రావు. ఎన్నికల…
సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…