Trends

జర్మనీ నుండి ముంబైకు బైక్ పై ప్రయాణించిన యువతి..!

ఎవరైనా అమ్మ నాన్నలను చూసేందుకు విదేశాల నుండి రావాలంటే సాధారణంగా విమానంలో వస్తారు. అయితే ముంబైకి చెందిన మేధా రాయ్ మాత్రం ఏకంగా 24 వేల కిలోమీటర్లు బైక్ పైన ప్రయాణించి జర్మనీ నుండి ముంబైకు చేరుకుంది. దాదాపు 156 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆమె తన తల్లిదండ్రులను చేరుకుంది.

వివరాల్లోకి వెళితే జర్మనీకి చెందిన హాక్ విక్టర్ 2013లో ముంబై కు వచ్చాడు. అక్కడ మేధా తో అతనికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. లాక్ డౌన్ సమయంలో వారు జర్మనీలో గత ఏడాది వివాహం చేసుకున్నార. అయితే ఆంక్షల కారణంగా ఆ పెళ్ళికి మేధా కుటుంబ సభ్యులు హాజరు కాలేకపోయారు.

దీంతో పెళ్లి తర్వాత ఆమె తన తల్లిదండ్రులు కలుసుకోవాలని అనుకుంది. అందుకోసం ద్విచక్ర వాహనంపై ముంబైకి రావాలని నిర్ణయించుకుంది. బైక్ వెనుక కూర్చొని అంత దూరం ప్రయాణిస్తే వెన్ను నొప్పి సమస్యలు వస్తాయి కనుక ఆమె ఇందుకోసమే బైక్ డ్రైవింగ్ నేర్చుకొని తన భర్తతో కలిసి చెరొక బైక్ లో ముంబై కు వచ్చేసారు. ఏదో గిన్నిస్ రికార్డు కోసమో సాహస యాత్ర కోసమో కాకుండా కేవలం తన తల్లిదండ్రులు పై ఉన్న ప్రేమతో ఆమె ఇంతటి సాహసం చేయడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయమే..!

This post was last modified on December 11, 2022 1:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐకాన్ స్టార్ ముద్దు – కండల వీరుడు వద్దు

జవాన్ తో బాలీవుడ్ లో పెద్ద జెండా పాతేసిన దర్శకుడు అట్లీ నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే సస్పెన్స్ ఇప్పటిదాకా కొనసాగుతూనే…

31 minutes ago

లైలాకు ‘A’ సర్టిఫికెట్….ఇది పెద్ద పరీక్షే

సెన్సార్ బోర్డు ఏదైనా సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చిందంటే అది కేవలం పెద్దలకు ఉద్దేశించినది మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే.…

1 hour ago

అక్కినేని విజయాలకు ముహూర్తం కుదిరింది

నిన్న జరిగిన తండేల్ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ విజయాలకు…

1 hour ago

ఒక్క మాటతో 400 సినిమాల్లో అవకాశాలు

ఎంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో ఒక్కోసారి అవకాశాలు అంత వేగంగా రావు. హిట్టు పడినా సరే కొన్నిసార్లు దురదృష్టం పలకరించి…

3 hours ago

నిత్య ఆరోగ్యానికి సంజీవని… సోంపు

సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…

7 hours ago

బాబును చూసి బిత్తరపోయిన మంత్రులు, అధికారులు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…

8 hours ago