ఎవరైనా అమ్మ నాన్నలను చూసేందుకు విదేశాల నుండి రావాలంటే సాధారణంగా విమానంలో వస్తారు. అయితే ముంబైకి చెందిన మేధా రాయ్ మాత్రం ఏకంగా 24 వేల కిలోమీటర్లు బైక్ పైన ప్రయాణించి జర్మనీ నుండి ముంబైకు చేరుకుంది. దాదాపు 156 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆమె తన తల్లిదండ్రులను చేరుకుంది.
వివరాల్లోకి వెళితే జర్మనీకి చెందిన హాక్ విక్టర్ 2013లో ముంబై కు వచ్చాడు. అక్కడ మేధా తో అతనికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. లాక్ డౌన్ సమయంలో వారు జర్మనీలో గత ఏడాది వివాహం చేసుకున్నార. అయితే ఆంక్షల కారణంగా ఆ పెళ్ళికి మేధా కుటుంబ సభ్యులు హాజరు కాలేకపోయారు.
దీంతో పెళ్లి తర్వాత ఆమె తన తల్లిదండ్రులు కలుసుకోవాలని అనుకుంది. అందుకోసం ద్విచక్ర వాహనంపై ముంబైకి రావాలని నిర్ణయించుకుంది. బైక్ వెనుక కూర్చొని అంత దూరం ప్రయాణిస్తే వెన్ను నొప్పి సమస్యలు వస్తాయి కనుక ఆమె ఇందుకోసమే బైక్ డ్రైవింగ్ నేర్చుకొని తన భర్తతో కలిసి చెరొక బైక్ లో ముంబై కు వచ్చేసారు. ఏదో గిన్నిస్ రికార్డు కోసమో సాహస యాత్ర కోసమో కాకుండా కేవలం తన తల్లిదండ్రులు పై ఉన్న ప్రేమతో ఆమె ఇంతటి సాహసం చేయడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయమే..!
This post was last modified on December 11, 2022 1:00 pm
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…
సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…
నందమూరి అభిమానుల ఎదురు చూపులను రెన్యూవల్ చేయడమే తప్ప ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా దోబూచులాడుతున్న మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకి…