Trends

రైలుకు-ప్లాట్ ఫామ్‌కు మ‌ధ్య‌ న‌ర‌కం చూసిన అమ్మాయి ఇక లేదు

రైలుకు-ప్లాట్ ఫామ్‌కు మ‌ధ్య చిక్కుకుని..జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య ఎదుర్కొన్న వైద్య విద్యార్థిని ఇక‌లేదు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత‌.. ఆమెను ర‌క్షించే ప్ర‌య‌త్నాలు చేసినా.. ఘ‌ట‌న‌తో భీతిల్లిన ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. అనంతరం.. ఆసుప‌త్రిలోనే తుదిశ్వాస విడిచింది. దీంతో ఈ ఘ‌ట‌న అంద‌రినీ క‌లిచి వేసింది.

విశాఖపట్నం సమీపంలోని దువ్వాడ రైల్వేస్టేషన్లో బుధవారం ఉదయం రైలు దిగబోతూ ఓ విద్యార్థిని కాలు జారడంతో ప్లాట్ ఫారానికి, రైలుకు మధ్య ఇరుక్కుపోయిన ఘ‌ట‌న తెలిసిందే. సుమారుగా రెండు గంట‌ల పాటు న‌ర‌కం అనుభవించింది. అనంత‌రం ఆసుప‌త్రికి చేరుకుని కోమాలోకి వెళ్లిపోయి.. కొద్ది సేప‌టి కింద‌ట తుదిశ్వాస విడిచింది.

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సమీపంలోని గోపాలపట్నానికి చెందిన మెరపాల శశికళ (20) దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ చదువుతోంది. రోజూ అన్నవరం నుంచి రైలులో వచ్చి వెళుతున్నారు. ఆ విధంగానే బుధవారం కూడా అన్నవరంలో గుంటూరు-రాయగడ పాసింజర్ ఎక్కారు.

బుధ‌వారం ఉదయం రైలు దువ్వాడ చేరుకుంది. శశికళ రైలు నుంచి దిగుతుండగా కాలు జారి ప్లాట్ఫారానికి, రైలుకు మధ్య ఇరుక్కుపోయింది. దీనిని గమనించి తోటి ప్రయాణికులు కేకలు వేయడంతో పాటు వెంట‌నే ట్రైన్‌కు ఉన్న చైన్ లాగారు. దీంతో రైలు ఆగిపోయింది. వెంట‌నే స్పందించిన‌ రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుని ఆమెను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్లాట్ఫారంలోని రెండు బ్లాకులను విరగ్గొట్టి, గంటన్నర తరువాత ఆమెను పైకి తీశారు.

వెంటనే అంబులెన్స్‌లో కిమ్స్, ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. ఆమె భయంతో బాగా ఆందోళన చెందిందని, వెంటిలేటర్‌పై చికిత్స చేస్తున్నామని, ప్రస్తుతం పరిస్థితి విషమం గానే వుందని వైద్య వర్గాలు తెలిపాయి. దీంతో అంద‌రూ ఆమె కోలుకోవాల‌ని.. ఆరోగ్యంతో తిరిగి కాలేజీ బాట‌ప‌ట్టాల‌ని కోరుకున్నారు. కానీ ఘ‌ట‌న త‌ర్వాత కోమాలోకి వెళ్లిపోయిన శ‌శిక‌ళ ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచింది.

This post was last modified on December 8, 2022 3:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago