Trends

ఇది క‌దా నాన్నపై ప్రేమంటే!

నాన్న‌కు ప్రేమ‌తో అంటూ.. త‌ర‌చుగా సోష‌ల్ మీడియాలో అనేక కామెంట్లు ప‌డుతుంటాయి.అ యితే, వీరిలో ఎంత మంది నిజంగా నాన్న‌పై ప్రేమ‌ను కురిపిస్తున్నారో చెప్ప‌డం క‌ష్ట‌మే(?). అయితే.. త‌మిళ‌నాడుకు చెందిన ఓ త‌న‌యుడు మాత్రం నిజంగానే త‌న నాన్న‌పై ప్రేమ‌ను కురిపించారు. తాను త‌ల్లి క‌డుపు నుంచి బ‌య‌ట ప‌డ‌డానికి ముందే క‌న్ను మూసిన తండ్రి స‌మాధినైనా చూద్దామ‌నే ఆశ‌తో ఆయ‌న దేశాలు ప‌ట్టుకుని తిరిగారు. చివ‌ర‌కు గుర్తించి, నివాళుల‌ర్పించి, క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.

ఎవ‌రు.. ఎందుకు?

తాను అమ్మ కడుపులో ఉండగానే నాన్న చనిపోయారు. నాన్నను ఎలాగూ చూడలేదు.. కనీసం ఆయన సమాధినైనా చూడాలనేది ఆ కుమారుడి ఆరాటం. అందుకోసం తపించారు. గూగుల్‌ సాయంతో అన్వేషించి, మలేషియాలో ఉన్న సమాధిని గుర్తించారు. తమిళనాడు నుంచి అక్కడకు వెళ్లి సమాధిని చూసి సాంత్వన పొందారు.

తమిళనాడుకు చెందిన రామసుందరం అలియాస్‌ పూంగుండ్రన్‌ తన భార్య రాధాబాయితో కలిసి చాలా ఏళ్ల కిందట మలేషియా వెళ్లారు. అక్కడ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ 1967లో మరణించారు. అప్పటికే రాధాబాయి గర్భిణి. పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని, భర్తకు అంత్యక్రియలు చేయించి, అక్కడే సమాధిని కట్టించారామె. పదేపదే భర్త జ్ఞాపకాలు చుట్టుముడుతుంటే బాధను తట్టుకోలేక తమిళనాడు వచ్చేశారు. 6 నెలల తర్వాత ఆమెకు తిరుమారన్‌ జన్మించారు. 35 ఏళ్ల క్రితం రాధాబాయి మరణించారు.

తిరుమారన్‌కు ఇప్పుడు 56 ఏళ్లు. ప్రస్తుతం త‌మిళ‌నాడులోని తెన్కాశి జిల్లా వేంకటాంపట్టిలో ఉంటూ సమాజ సేవ చేస్తున్నారు. తండ్రిని చూడకున్నా.. కనీసం ఆయన సమాధినైనా దర్శించుకోవాలనే కోరిక ఆయనలో బలంగా నాటుకుంది. బతికున్నప్పుడు తల్లి చెప్పిన వివరాల ఆధారంగా మలేషియాలో తండ్రి నివసించిన ప్రాంతం, పని చేసిన పాఠశాలను గూగుల్‌ ద్వారా అన్వేషించారు.

పాఠశాల ఇ-మెయిల్‌ చిరునామా తెలియడంతో తన తండ్రి వివరాలు తెలుపుతూ… ఆయన సమాధిని కనుగొనేందుకు సాయపడాలని సందేశం పంపారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్పందించారు. రామసుందరం గురించి వివరాలు తెలిసిన మోహనరావు, పూనాట్చి అలియాస్‌ నాగప్పన్‌లను గుర్తించారు. వారంతా కలిసి రామసుందరం సమాధి ఉన్న చోటును కనుగొన్నారు. ఈ నెలలో తిరుమారన్‌ మలేషియా వెళ్లారు. ఇప్పటికీ పదిలంగా ఉన్న తండ్రి సమాధిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. నివాళిగా ఆయ‌న‌కు కొవ్వొత్తి వెలిగించి మౌనం పాటించారు.

This post was last modified on November 24, 2022 4:04 pm

Share
Show comments
Published by
Satya
Tags: Tamil Nadu

Recent Posts

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

60 minutes ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

1 hour ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

2 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

3 hours ago

పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?

సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…

3 hours ago

అమరావతిపై 48 గంటల్లో టోన్ మార్చిన వైసీపీ!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…

3 hours ago