నాన్నకు ప్రేమతో అంటూ.. తరచుగా సోషల్ మీడియాలో అనేక కామెంట్లు పడుతుంటాయి.అ యితే, వీరిలో ఎంత మంది నిజంగా నాన్నపై ప్రేమను కురిపిస్తున్నారో చెప్పడం కష్టమే(?). అయితే.. తమిళనాడుకు చెందిన ఓ తనయుడు మాత్రం నిజంగానే తన నాన్నపై ప్రేమను కురిపించారు. తాను తల్లి కడుపు నుంచి బయట పడడానికి ముందే కన్ను మూసిన తండ్రి సమాధినైనా చూద్దామనే ఆశతో ఆయన దేశాలు పట్టుకుని తిరిగారు. చివరకు గుర్తించి, నివాళులర్పించి, కన్నీటి పర్యంతమయ్యారు.
ఎవరు.. ఎందుకు?
తాను అమ్మ కడుపులో ఉండగానే నాన్న చనిపోయారు. నాన్నను ఎలాగూ చూడలేదు.. కనీసం ఆయన సమాధినైనా చూడాలనేది ఆ కుమారుడి ఆరాటం. అందుకోసం తపించారు. గూగుల్ సాయంతో అన్వేషించి, మలేషియాలో ఉన్న సమాధిని గుర్తించారు. తమిళనాడు నుంచి అక్కడకు వెళ్లి సమాధిని చూసి సాంత్వన పొందారు.
తమిళనాడుకు చెందిన రామసుందరం అలియాస్ పూంగుండ్రన్ తన భార్య రాధాబాయితో కలిసి చాలా ఏళ్ల కిందట మలేషియా వెళ్లారు. అక్కడ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ 1967లో మరణించారు. అప్పటికే రాధాబాయి గర్భిణి. పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని, భర్తకు అంత్యక్రియలు చేయించి, అక్కడే సమాధిని కట్టించారామె. పదేపదే భర్త జ్ఞాపకాలు చుట్టుముడుతుంటే బాధను తట్టుకోలేక తమిళనాడు వచ్చేశారు. 6 నెలల తర్వాత ఆమెకు తిరుమారన్ జన్మించారు. 35 ఏళ్ల క్రితం రాధాబాయి మరణించారు.
తిరుమారన్కు ఇప్పుడు 56 ఏళ్లు. ప్రస్తుతం తమిళనాడులోని తెన్కాశి జిల్లా వేంకటాంపట్టిలో ఉంటూ సమాజ సేవ చేస్తున్నారు. తండ్రిని చూడకున్నా.. కనీసం ఆయన సమాధినైనా దర్శించుకోవాలనే కోరిక ఆయనలో బలంగా నాటుకుంది. బతికున్నప్పుడు తల్లి చెప్పిన వివరాల ఆధారంగా మలేషియాలో తండ్రి నివసించిన ప్రాంతం, పని చేసిన పాఠశాలను గూగుల్ ద్వారా అన్వేషించారు.
పాఠశాల ఇ-మెయిల్ చిరునామా తెలియడంతో తన తండ్రి వివరాలు తెలుపుతూ… ఆయన సమాధిని కనుగొనేందుకు సాయపడాలని సందేశం పంపారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్పందించారు. రామసుందరం గురించి వివరాలు తెలిసిన మోహనరావు, పూనాట్చి అలియాస్ నాగప్పన్లను గుర్తించారు. వారంతా కలిసి రామసుందరం సమాధి ఉన్న చోటును కనుగొన్నారు. ఈ నెలలో తిరుమారన్ మలేషియా వెళ్లారు. ఇప్పటికీ పదిలంగా ఉన్న తండ్రి సమాధిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. నివాళిగా ఆయనకు కొవ్వొత్తి వెలిగించి మౌనం పాటించారు.
This post was last modified on November 24, 2022 4:04 pm
నితిన్ కెరీర్ లోనే అతి పెద్ద బడ్జెట్ సినిమాగా చెప్పుకుంటున్న రాబిన్ హుడ్ విడుదలకు ఇంకో పది రోజులు మాత్రమే…
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్స్ లో ఒకటి కల్కి 2898 ఏడి. వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిన బ్లాక్ బస్టర్…
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. కేవలం 10 నెలల కాలంలోనే ఏపీకి ఏకంగా రూ.7 లక్షల…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత కొంతకాలంగా తన తల్లి వైఎస్ విజయమ్మతో విభేదాలతో సాగుతున్న సంగతి…
పైన ఫొటోలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కలిసి కనిపిస్తున్న బుడ్డోడి పేరు నంద్యాల సిద్ధార్థ్. వయసు 14 ఏళ్లే.…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. తనకు…