Steve Jobs Chappals
ప్రపంచవ్యాప్తంగా కొంతమందికి పురాతన వస్తువులు, యాంటిక్ పీసులు సేకరించడం అలవాటు. చారిత్రాత్మక వస్తువులను కొనేందుకు కొంతమంది వ్యక్తులు కోట్లు కుమ్మరించడానికి సైతం వెనుకాడరు. ఇక, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొందరు వ్యక్తులు వాడిన వస్తువులకైతే గిరాకీ చాలా ఎక్కువ. అటువంటి వస్తువులు మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి.
ఇటువంటి వారి ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకే కొన్ని ఈ ఆక్షన్ కంపెనీలు కూడా వెలిశాయి. ఇటువంటి వస్తువులను కలెక్ట్ చేసి వాటిని ఎక్కువ ధరకు రీసేల్ చేయడం ఈ కంపెనీల బిజినెస్. ఈ క్రమంలోనే తాజాగా యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ వేసుకున్న చెప్పుల వేలంపాట వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికాలో జులియెన్స్ అనే ఆక్షన్ కంపెనీ ఆ చెప్పులను వేలం పాటలో కోటి 75 లక్షల రూపాయలకు అమ్మిన వైనం సంచలనం రేపుతోంది.
ఓ అజ్ఞాత వ్యక్తి ఆ చెప్పులను కొనుగోలు చేయడం విశేషం. 1970 నుంచి 80 మధ్యకాలంలో స్టీవ్ జాబ్స్ బ్రౌన్ లెదర్ శాండిల్స్ ను వాడారు. దీంతో, ఆ చెప్పులను జులియెన్స్ కంపెనీ సొంతం చేసుకొని తాజాగా వాటిని అమ్మేందుకు వేలం పాట పెట్టింది. దీంతో, అది భారీ ధరకు అమ్ముడుపోయింది. కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి ఒక కోటి 77 లక్షల రూపాయలకు ఆ చెప్పులను కొనుగోలు చేయడం సంచలనం రేపింది.
యాపిల్ కంపెనీ మొదలుపెట్టిన కొత్తలో స్టీవ్ జాబ్స్ ఈ చెప్పులు వేసుకున్నాడట. అంతేకాదు, యాపిల్ కంప్యూటర్ లాంచ్ చేసే సమయంలో, కొన్ని కీలకమైన సమావేశాలకు హాజరయ్యేందుకు ఈ చెప్పులే వేసుకున్నాడని జులియెన్స్ సంస్థ తెలిపింది. అయితే, ఈ చెప్పులు కొన్న వ్యక్తి ఎవరు అన్న వివరాలను మాత్రం జులియెన్స్ కంపెనీ గోప్యంగా ఉంచింది.
ఏపీలో టీడీపీ-వైసీపీల మధ్య మాటల తూటాలు.. మరింత భారీ రేంజ్లో పేలుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ చేసిన వ్యాఖ్యలపై…
వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి రానివ్వను. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ.. 2024 ఎన్నికలకు ముందు భీషణ ప్రతిజ్ఞ చేసిన…
ఏపీ ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ సోషల్ మీడియాలో దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. యూట్యూబ్, ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్..…
గత ఏడాది తమిళ, తెలుగు భాషల్లో పెద్ద హిట్ అయిన సినిమాల్లో ‘డ్యూడ్’ ఒకటి. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో…
బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్న హాలీవుడ్ మూవీ అబ్సెషన్ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. రెండు గంటల లోపే నిడివితో థ్రిల్లర్…
ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేన.. దేశ రాజధాని ఢిల్లీలో రేపు ఓ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది.…