Steve Jobs Chappals
ప్రపంచవ్యాప్తంగా కొంతమందికి పురాతన వస్తువులు, యాంటిక్ పీసులు సేకరించడం అలవాటు. చారిత్రాత్మక వస్తువులను కొనేందుకు కొంతమంది వ్యక్తులు కోట్లు కుమ్మరించడానికి సైతం వెనుకాడరు. ఇక, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొందరు వ్యక్తులు వాడిన వస్తువులకైతే గిరాకీ చాలా ఎక్కువ. అటువంటి వస్తువులు మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి.
ఇటువంటి వారి ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకే కొన్ని ఈ ఆక్షన్ కంపెనీలు కూడా వెలిశాయి. ఇటువంటి వస్తువులను కలెక్ట్ చేసి వాటిని ఎక్కువ ధరకు రీసేల్ చేయడం ఈ కంపెనీల బిజినెస్. ఈ క్రమంలోనే తాజాగా యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ వేసుకున్న చెప్పుల వేలంపాట వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికాలో జులియెన్స్ అనే ఆక్షన్ కంపెనీ ఆ చెప్పులను వేలం పాటలో కోటి 75 లక్షల రూపాయలకు అమ్మిన వైనం సంచలనం రేపుతోంది.
ఓ అజ్ఞాత వ్యక్తి ఆ చెప్పులను కొనుగోలు చేయడం విశేషం. 1970 నుంచి 80 మధ్యకాలంలో స్టీవ్ జాబ్స్ బ్రౌన్ లెదర్ శాండిల్స్ ను వాడారు. దీంతో, ఆ చెప్పులను జులియెన్స్ కంపెనీ సొంతం చేసుకొని తాజాగా వాటిని అమ్మేందుకు వేలం పాట పెట్టింది. దీంతో, అది భారీ ధరకు అమ్ముడుపోయింది. కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి ఒక కోటి 77 లక్షల రూపాయలకు ఆ చెప్పులను కొనుగోలు చేయడం సంచలనం రేపింది.
యాపిల్ కంపెనీ మొదలుపెట్టిన కొత్తలో స్టీవ్ జాబ్స్ ఈ చెప్పులు వేసుకున్నాడట. అంతేకాదు, యాపిల్ కంప్యూటర్ లాంచ్ చేసే సమయంలో, కొన్ని కీలకమైన సమావేశాలకు హాజరయ్యేందుకు ఈ చెప్పులే వేసుకున్నాడని జులియెన్స్ సంస్థ తెలిపింది. అయితే, ఈ చెప్పులు కొన్న వ్యక్తి ఎవరు అన్న వివరాలను మాత్రం జులియెన్స్ కంపెనీ గోప్యంగా ఉంచింది.
This post was last modified on November 16, 2022 6:08 pm
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…