కరోనాకు వ్యాక్సిన్, మందు కనుగొనే దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి. ఇండియాలో భారత్ బయోటెక్ సంస్థ కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసి మనుషుల మీద ప్రయోగించే దశలో ఉంది.
కుదిరితే ఇంకో నెలలోపు ఈ ప్రక్రియను పూర్తి చేసి ఆగస్టు 15 కల్లా వ్యాక్సిన్ను మార్కెట్లోకి తేవాలన్న లక్ష్యంతో ఆ సంస్థ పని చేస్తోంది. ఈలోపు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు కరోనా వ్యాక్సిన్ మీద ముమ్మర పరిశోధనలు జరుపుతూ.. వివిధ దశల్ని దాటే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా రష్యా వ్యాక్సిన్ను మార్కెట్లోకి తెచ్చే దిశగా కీలక ముందడుగు వేసింది.
రష్యాలోని సెచెనోవా యూనివర్సిటీ ఆధ్వర్యంలో తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయని ప్రకటించారు. సెచెనోవ్ ఫస్ట్ మాస్కో స్టేట్ మెడికల్ యూనివర్శిటీలో.. వాలంటీర్లపై తొలి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైందని.. ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్ అండ్ బయోటెక్నాలజీ డైరెక్టర్ వాడిమ్ తారాసోవ్ ఓ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీస్తో తెలిపారు.
క్లినికల్ ట్రయల్స్లో పాల్గొన్న తొలి బృందం.. బుధవారం నాడు డిశ్చార్జ్ కానుందని.. ఇక రెండో బృందం జూలై 20 వ తేదీన డిశ్చార్జ్ అవుతుందని తెలిపారు. రష్యాలోనే మాస్కోకు చెందిన గమలీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ తయారు చేసిన వ్యాక్సిన్ కూడా క్లినికల్ ట్రయల్స్ను గత నెల జూన్ 18న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐతే ఆయా దేశాల్లో వ్యాక్సిన్లు ఆమోదం పొంది మార్కెట్లోకి వచ్చినా.. అవి అంతర్జాతీయంగా, ఇతర దేశాల్లో ఆమోదం పొంది.. అక్కడి మార్కెట్లలోకి వెళ్లడానికి చాలా సమయం పడుతుంది.
This post was last modified on July 12, 2020 8:47 pm
కీలకమైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల తరబడి సాగుతున్న ప్రాజెక్టులనే…
దేశవ్యాప్తంగా 288 మంది నేపాల్ వరదల్లో గల్లంతయ్యారని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 532 మంది ఆచూకీ కనిపించకుండా…
నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో…
దేశంలో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రైవేటు వైద్యుల దోపిడీ వెరసి సామాన్య ప్రజల ప్రాణాలకు గ్యారంటీ…
కన్నడ అనువాద చిత్రమైన ‘టాక్సిక్’ ఇక్కడి టాప్ స్టార్ల సినిమాల లెవెల్లో భారీగా రిలీజైందంటే అందుకు ప్రధాన కారణం.. దిల్…
అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతి రూపం రాఖీ. అలాంటి పవిత్రమైన రాఖీ పండుగ కూడా నేడు రాజకీయ చట్రంలో చిక్కుకుంది.…