Trends

ప్రేయసితో, పెద్దలు చూసిన అమ్మాయితో ఒకే సమయంలో పెళ్లి

ఓ అమ్మాయిని ప్రేమించడం.. తనతో పెళ్లి కుదరక పెద్దలు చూసిన అమ్మాయిని వివాహం చేసుకోవడం.. తర్వాత ప్రేయసితో బంధాన్ని కొనసాగిచంచడం.. ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకుని వ్యవహారం నడిపించడం.. ఇవన్నీ ఎప్పుడూ వినే కథలే.

కానీ తాను ప్రేమించిన అమ్మాయిని.. అలాగే తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని ఒకే సమయంలో పెళ్లాడటం.. ఇందుకు ఇద్దరమ్మాయిలూ అంగీకరించడం.. అలాగే ఆ అబ్బాయి, ఇద్దరు అమ్మాయిల కుటుంబాలు కూడా దీనికి అంగీకారం తెలపడం.. అందరి సమక్షంలో ఇద్దరినీ ఒకే సమయంలో పెళ్లాడటం మాత్రం ఇప్పటిదాకా విని ఉండరు. కని ఉండదు. ఊహకందని ఈ పరిణామం మధ్యప్రదేశ్‌లోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. దీని గురించి జాతీయ మీడియాలోనూ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.

మూడు రోజుల కిందట జరిగిన ఆ అనూహ్య పరిణామం కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామానికి చెందిన కుర్రాడు కొంత కాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఐతే అతడికి ఇటీవల పెద్దలు వేరే పెళ్లి నిశ్చయించారు. దీంతో అతను ప్రేమించిన అమ్మాయి, తన కుటుంబ సభ్యులు గ్రామంలో పంచాయితీకి వెళ్లారు. ఆ పంచాయితీకి ఆ అబ్బాయి కుటుంబంతో పాటు తనకు పెళ్లి నిశ్చయించిన అమ్మాయి కుటుంబ సభ్యులూ హాజరయ్యారు.

ఇద్దరమ్మాయిలూ ఆ అబ్బాయి తమకే కావాలని మాట్లాడారు. అలాంటపుడు ఇద్దరూ అతణ్ని పెళ్లి చేసుకుంటారా అని అడిగితే అందుకు సరే అన్నారు. వారి కుటుంబ సభ్యులూ సరే అన్నారు. అబ్బాయి కుటుంబ సభ్యులకూ అభ్యంతరం లేకపోయింది. పెళ్లి తర్వాత అతను ఒకే ఇంట్లో ఇద్దరు భార్యలతో సంసారం సాగించబోతున్నాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

This post was last modified on July 12, 2020 9:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

45 minutes ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

2 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

3 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

5 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

5 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

8 hours ago