Trends

ప్రేయసితో, పెద్దలు చూసిన అమ్మాయితో ఒకే సమయంలో పెళ్లి

ఓ అమ్మాయిని ప్రేమించడం.. తనతో పెళ్లి కుదరక పెద్దలు చూసిన అమ్మాయిని వివాహం చేసుకోవడం.. తర్వాత ప్రేయసితో బంధాన్ని కొనసాగిచంచడం.. ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకుని వ్యవహారం నడిపించడం.. ఇవన్నీ ఎప్పుడూ వినే కథలే.

కానీ తాను ప్రేమించిన అమ్మాయిని.. అలాగే తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని ఒకే సమయంలో పెళ్లాడటం.. ఇందుకు ఇద్దరమ్మాయిలూ అంగీకరించడం.. అలాగే ఆ అబ్బాయి, ఇద్దరు అమ్మాయిల కుటుంబాలు కూడా దీనికి అంగీకారం తెలపడం.. అందరి సమక్షంలో ఇద్దరినీ ఒకే సమయంలో పెళ్లాడటం మాత్రం ఇప్పటిదాకా విని ఉండరు. కని ఉండదు. ఊహకందని ఈ పరిణామం మధ్యప్రదేశ్‌లోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. దీని గురించి జాతీయ మీడియాలోనూ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.

మూడు రోజుల కిందట జరిగిన ఆ అనూహ్య పరిణామం కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామానికి చెందిన కుర్రాడు కొంత కాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఐతే అతడికి ఇటీవల పెద్దలు వేరే పెళ్లి నిశ్చయించారు. దీంతో అతను ప్రేమించిన అమ్మాయి, తన కుటుంబ సభ్యులు గ్రామంలో పంచాయితీకి వెళ్లారు. ఆ పంచాయితీకి ఆ అబ్బాయి కుటుంబంతో పాటు తనకు పెళ్లి నిశ్చయించిన అమ్మాయి కుటుంబ సభ్యులూ హాజరయ్యారు.

ఇద్దరమ్మాయిలూ ఆ అబ్బాయి తమకే కావాలని మాట్లాడారు. అలాంటపుడు ఇద్దరూ అతణ్ని పెళ్లి చేసుకుంటారా అని అడిగితే అందుకు సరే అన్నారు. వారి కుటుంబ సభ్యులూ సరే అన్నారు. అబ్బాయి కుటుంబ సభ్యులకూ అభ్యంతరం లేకపోయింది. పెళ్లి తర్వాత అతను ఒకే ఇంట్లో ఇద్దరు భార్యలతో సంసారం సాగించబోతున్నాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

Satya

Recent Posts

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

1 hour ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

1 hour ago

బంగారం బుకింగ్స్ ఎందుకు బాగున్నాయి

మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…

2 hours ago

‘రాజురామను టార్చర్ చేసిన వాళ్లకు, ఉగ్రవాదులకు తేడా లేదు’

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత ఉండి శాస‌న‌స‌భ్యుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజును క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో హైకోర్టు సంచ‌ల‌న…

2 hours ago

‘పవన్ కల్యాణ్ పై దేశద్రోహం కేసు పెట్టాలి’

ఏపీ డిప్యూటీ సీఎం.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై కేసు పెట్టాల‌ని.. ఆయ‌న వ‌ల్ల తెలంగాణ ప్ర‌జ‌లు మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నార‌ని…

3 hours ago

జాబ్ కేలండర్ కాస్తా… సంక్షేమ కేలండర్ అయ్యిందే

2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది.…

3 hours ago