Trends

కన్నకొడుకునే కడతేర్చిన కసాయి తల్లిదండ్రులు

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ ప్రజా కవి గోరేటి వెంకన్న పాడిన పాట ఈ కలికాలంలో అక్షర సత్యంగా మారింది. మానవ సంబంధాలు, విలువలు, రక్త సంబంధాలు నానాటికీ దిగజారిపోతున్నాయి అనేందుకు సమాజంలో జరుగుతున్న ఎన్నో ఘటనలు నిదర్శనం. మద్యానికి బానిసై తమను వేధిస్తున్న కన్న కొడుకును తల్లిదండ్రులు హత్య చేయించిన వైనం తెలంగాణలో సంచలనం రేపింది.

మద్యం తాగేందుకు డబ్బుల కోసం తమను వేధింపులకు గురి చేస్తున్న కొడుకును సుపారీ ఇచ్చి మరీ తల్లిదండ్రులు హత్య చేయించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూర్యాపేటలో జరిగిన ఈ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

సూర్యపేటలో నివసించే రాంసింగ్, రాణీబాయి దంపతులకు సాయినాథ్ అనే కొడుకు ఉన్నాడు. అయితే, సాయినాథ్ మద్యానికి బానిసై నిత్యం తాగుతూ ఉండేవాడు. అంతేకాదు, ప్రతిరోజు కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో గొడవపడేవాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని వారిని వేధింపులకు గురి చేసేవాడు. అయితే, కొడుకు ప్రవర్తనతో విసిగి వేసారిపోయిన రామ్ సింగ్ దంపతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తమ కొడుకులో మార్పు వస్తుందని, ఆ తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. దీంతో, కన్న కొడుకునే చంపుకునేందుకు ఆ తల్లిదండ్రులు కసాయిలుగా మారారు. కిరాయి హంతకులకు ఎనిమిది లక్షల రూపాయల సుపారీ ఇచ్చి కొడుకును హత్య చేయించారు. ఈ క్రమంలోనే వారి దగ్గర నుంచి సుపారీ తీసుకున్న కిరాయి హంతకులు అక్టోబర్ 18న మిర్యాలగూడ మండలం కల్లేపల్లి మైసమ్మ ఆలయం వద్ద సాయినాథ్ తో కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత అతడి మెడకు ఉరి బిగించి హతమార్చారు. ఇక, శవాన్ని పాలకీడు మండలం శూన్యపహాడ్ వద్ద మూసీ నదిలో పడేశారు. నవంబర్ 19వ తేదీన మృతదేహం బయటపడటంతో పోలీసులు గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలోనే పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో చివరికి తల్లిదండ్రులు సుపారీ ఇచ్చి కొడుకును చంపించారని విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. సాయినాథ్ తల్లిదండ్రులు రామ్ సింగ్, రాణి బాయ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో కలిపి మొత్తం ఏడుగురు ఈ కేసులో అరెస్టు అయ్యారు. ఇక, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సాయినాథ్ హత్యకు వినియోగించిన నాలుగు కార్లు, బైక్, ప్లాస్టిక్ తాడు, రూ.23,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏది ఏమైనా, తమను వేధిస్తున్న కన్నకొడుకును కసాయిలుగా మారిన తల్లిదండ్రులు కడ తేర్చిన వైనం ఇప్పుడు తీవ్ర చర్చ నీయాంశమైంది.

This post was last modified on November 2, 2022 6:04 pm

Share
Show comments
Published by
Satya
Tags: Trends

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

1 hour ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago