Trends

తైవాన్ పై దాడిచేస్తే ప్రపంచానికే చిప్పు దొబ్బుతుందా ?

ఈమధ్య వచ్చే సినిమాల్లో తరచూ వాడికి చిప్పు దొబ్బిందని, వీడికి చిప్పు దొబ్బిందనే డైలాగులు వింటునే ఉంటాము. ఇపుడు వాడికీ వీడికి కాదు మొత్తం ప్రపంచానికే చిప్పు దొబ్బే రోజులు దగ్గరలోనే ఉన్నాయట. ప్రపంచానికి చిప్పు దొబ్బటం ఏమిటా ? అని అనుకుంటున్నారు. పొరుగునే ఉన్న తైవాన్ పైన డ్రాగన్ కన్నేసిన విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడు తైవాన్ దేశాన్ని కబళించేద్దామా ? అని చైనా చాలా ఆతృతగా ఉంది.

ఇదే విషయమై అమెరికా పర్యటనలో తైవాన్ ఆర్ధికమంత్రి వాంగ్ మెయి-హువా మాట్లాడుతు చైనా గనుక తైవాన్ మీద దాడిచేస్తే యావత్ ప్రపంచం ఒక్కసారిగా సమస్యల్లో ఇరుక్కోవటం ఖాయమని హెచ్చరించారు. తమ దేశంమీద చైనా దాడిచేసి ఆక్రమించుకోవాలని చూస్తే అది తమకు మాత్రమే నష్టంకాదని మొత్తం ప్రపంచమే కష్టాల్లో ఇరుక్కుంటుందన్నారు. తైవాన్ పైన చైనా దాడిచేస్తే ప్రపంచానికి వచ్చే సమస్యేమిటి ?

ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల కోట్ల కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాపులతో పాటు అనేక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వాడుతున్న విషయం తెలిసిందే. ఇవన్నీ సక్రమంగా పనిచేయాలంటే సెమీ కండక్టర్లు, మదర్ బోర్డులు చాలా కీలకమైనవి. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా తయారుచేసిన చిప్పుల ఆధారంగా మాత్రమే పనిచేస్తాయి. అలాంటి చిప్పుల ఉత్పత్తిలో తైవాన్ వాట 90 శాతముంది. చిప్పులే కాకుండా సెమీకండక్టర్లు, మదర్ బోర్డులను కూడా తైవాన్ ఉత్పత్తిచేస్తోంది.

గడచిన 40 ఏళ్ళుగా తైవాన్ వాటి ఉత్పత్తిలో ఆరితేరిపోయింది. వీటి ఉత్పత్తిలో మరేదేశం కూడా తైవాన్ కు సమీపంలో కూడా లేదు. చైనా గనుక తన సైనికశక్తితో తైవాన్ పై దాడిచేస్తే వెంటనే సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్షరింగ్ కంపెనీ వెంటనే షట్టడౌన్ అయిపోతుందని మంత్రి చెప్పారు. ఒకసారి అది మూతపడితే సెమీకండక్టర్లు, మదర్ బోర్డులు, చిప్పులు ఉత్పత్తి ఆగిపోతాయి. ఇదే జరిగితే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపైన ప్రభావం పడుతుంది. రిపేర్లకు వచ్చిన గ్యాడ్జెట్లను మరమ్మతులు చేయటం సాధ్యంకాదు. అప్పుడు యావత్ ప్రపంచం మొత్తానికి చిప్పుదొబ్బటం ఖాయం.

This post was last modified on October 13, 2022 11:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

7 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

10 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

10 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

11 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

11 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

13 hours ago