ఈమధ్య వచ్చే సినిమాల్లో తరచూ వాడికి చిప్పు దొబ్బిందని, వీడికి చిప్పు దొబ్బిందనే డైలాగులు వింటునే ఉంటాము. ఇపుడు వాడికీ వీడికి కాదు మొత్తం ప్రపంచానికే చిప్పు దొబ్బే రోజులు దగ్గరలోనే ఉన్నాయట. ప్రపంచానికి చిప్పు దొబ్బటం ఏమిటా ? అని అనుకుంటున్నారు. పొరుగునే ఉన్న తైవాన్ పైన డ్రాగన్ కన్నేసిన విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడు తైవాన్ దేశాన్ని కబళించేద్దామా ? అని చైనా చాలా ఆతృతగా ఉంది.
ఇదే విషయమై అమెరికా పర్యటనలో తైవాన్ ఆర్ధికమంత్రి వాంగ్ మెయి-హువా మాట్లాడుతు చైనా గనుక తైవాన్ మీద దాడిచేస్తే యావత్ ప్రపంచం ఒక్కసారిగా సమస్యల్లో ఇరుక్కోవటం ఖాయమని హెచ్చరించారు. తమ దేశంమీద చైనా దాడిచేసి ఆక్రమించుకోవాలని చూస్తే అది తమకు మాత్రమే నష్టంకాదని మొత్తం ప్రపంచమే కష్టాల్లో ఇరుక్కుంటుందన్నారు. తైవాన్ పైన చైనా దాడిచేస్తే ప్రపంచానికి వచ్చే సమస్యేమిటి ?
ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల కోట్ల కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాపులతో పాటు అనేక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వాడుతున్న విషయం తెలిసిందే. ఇవన్నీ సక్రమంగా పనిచేయాలంటే సెమీ కండక్టర్లు, మదర్ బోర్డులు చాలా కీలకమైనవి. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా తయారుచేసిన చిప్పుల ఆధారంగా మాత్రమే పనిచేస్తాయి. అలాంటి చిప్పుల ఉత్పత్తిలో తైవాన్ వాట 90 శాతముంది. చిప్పులే కాకుండా సెమీకండక్టర్లు, మదర్ బోర్డులను కూడా తైవాన్ ఉత్పత్తిచేస్తోంది.
గడచిన 40 ఏళ్ళుగా తైవాన్ వాటి ఉత్పత్తిలో ఆరితేరిపోయింది. వీటి ఉత్పత్తిలో మరేదేశం కూడా తైవాన్ కు సమీపంలో కూడా లేదు. చైనా గనుక తన సైనికశక్తితో తైవాన్ పై దాడిచేస్తే వెంటనే సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్షరింగ్ కంపెనీ వెంటనే షట్టడౌన్ అయిపోతుందని మంత్రి చెప్పారు. ఒకసారి అది మూతపడితే సెమీకండక్టర్లు, మదర్ బోర్డులు, చిప్పులు ఉత్పత్తి ఆగిపోతాయి. ఇదే జరిగితే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపైన ప్రభావం పడుతుంది. రిపేర్లకు వచ్చిన గ్యాడ్జెట్లను మరమ్మతులు చేయటం సాధ్యంకాదు. అప్పుడు యావత్ ప్రపంచం మొత్తానికి చిప్పుదొబ్బటం ఖాయం.
This post was last modified on October 13, 2022 11:02 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…