Trends

తైవాన్ పై దాడిచేస్తే ప్రపంచానికే చిప్పు దొబ్బుతుందా ?

ఈమధ్య వచ్చే సినిమాల్లో తరచూ వాడికి చిప్పు దొబ్బిందని, వీడికి చిప్పు దొబ్బిందనే డైలాగులు వింటునే ఉంటాము. ఇపుడు వాడికీ వీడికి కాదు మొత్తం ప్రపంచానికే చిప్పు దొబ్బే రోజులు దగ్గరలోనే ఉన్నాయట. ప్రపంచానికి చిప్పు దొబ్బటం ఏమిటా ? అని అనుకుంటున్నారు. పొరుగునే ఉన్న తైవాన్ పైన డ్రాగన్ కన్నేసిన విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడు తైవాన్ దేశాన్ని కబళించేద్దామా ? అని చైనా చాలా ఆతృతగా ఉంది.

ఇదే విషయమై అమెరికా పర్యటనలో తైవాన్ ఆర్ధికమంత్రి వాంగ్ మెయి-హువా మాట్లాడుతు చైనా గనుక తైవాన్ మీద దాడిచేస్తే యావత్ ప్రపంచం ఒక్కసారిగా సమస్యల్లో ఇరుక్కోవటం ఖాయమని హెచ్చరించారు. తమ దేశంమీద చైనా దాడిచేసి ఆక్రమించుకోవాలని చూస్తే అది తమకు మాత్రమే నష్టంకాదని మొత్తం ప్రపంచమే కష్టాల్లో ఇరుక్కుంటుందన్నారు. తైవాన్ పైన చైనా దాడిచేస్తే ప్రపంచానికి వచ్చే సమస్యేమిటి ?

ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల కోట్ల కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాపులతో పాటు అనేక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వాడుతున్న విషయం తెలిసిందే. ఇవన్నీ సక్రమంగా పనిచేయాలంటే సెమీ కండక్టర్లు, మదర్ బోర్డులు చాలా కీలకమైనవి. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా తయారుచేసిన చిప్పుల ఆధారంగా మాత్రమే పనిచేస్తాయి. అలాంటి చిప్పుల ఉత్పత్తిలో తైవాన్ వాట 90 శాతముంది. చిప్పులే కాకుండా సెమీకండక్టర్లు, మదర్ బోర్డులను కూడా తైవాన్ ఉత్పత్తిచేస్తోంది.

గడచిన 40 ఏళ్ళుగా తైవాన్ వాటి ఉత్పత్తిలో ఆరితేరిపోయింది. వీటి ఉత్పత్తిలో మరేదేశం కూడా తైవాన్ కు సమీపంలో కూడా లేదు. చైనా గనుక తన సైనికశక్తితో తైవాన్ పై దాడిచేస్తే వెంటనే సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్షరింగ్ కంపెనీ వెంటనే షట్టడౌన్ అయిపోతుందని మంత్రి చెప్పారు. ఒకసారి అది మూతపడితే సెమీకండక్టర్లు, మదర్ బోర్డులు, చిప్పులు ఉత్పత్తి ఆగిపోతాయి. ఇదే జరిగితే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపైన ప్రభావం పడుతుంది. రిపేర్లకు వచ్చిన గ్యాడ్జెట్లను మరమ్మతులు చేయటం సాధ్యంకాదు. అప్పుడు యావత్ ప్రపంచం మొత్తానికి చిప్పుదొబ్బటం ఖాయం.

This post was last modified on October 13, 2022 11:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

2 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

3 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

5 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

7 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

7 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

8 hours ago