Trends

మద్యం మారింత తాగేలా ఐడియాలు ఇస్తే ప్రైజ్

అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రధాన ఆదాయ వనరుగా నిలిచేది లిక్కర్ అమ్మకాలతో వచ్చే ఆదాయమే. మన దేశంలోని చాలా రాష్ట్రాల్ని చూసినప్పుడు.. ప్రధాన ఆదాయ వనరుగా లిక్కర్ మీద వచ్చే పన్ను ఆదాయం నిలుస్తుంది. అలాంటిది డెవలప్ మెంట్ లో తిరుగులేని రీతిలో దూసుకెళ్లిన దేశాల్లోనూ మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. అందరిని ఆకర్షిస్తున్నాయి. డెవలప్ మెంట్ లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ సంపన్న దేశాల్లో ఒకటిగా నిలిచే జపాన్ ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది.

తమ దేశంలో యూత్ మద్యాన్ని మరింత తాగేందుకు వీలుగా ఐడియాలు ఇవ్వాలని కోరుతోంది. ఇందుకోసం జాతీయ స్థాయిలో పోటీల్ని నిర్వహిస్తోంది. గడిచిన 31 ఏళ్లలో ఎప్పుడూ లేని రీతిలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగేలా ఐడియాలు ఇవ్వాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి.. ‘సేక్ వైవల్’ పేరుతో ప్రచారాన్నిషురూ చేశారు. దేశంలోని 20 -38 ఏళ్ల మధ్యలో ఉన్న యూత్ ను మద్యం వైపు ఆకర్షించేందుకు వీలుగా తగిన ఆలోచనలతో రావాలని కోరుతోంది నేషనల్ ట్యాక్స్ ఏజెన్సీ (ఎన్ టీఏ).

ఇంట్లోనూ మద్యాన్ని సేవించేందుకు వీలుగా ఐడియాలు ఇవ్వాలని కోరుతోంది. దీనికి సంబంధించిన ఎంట్రీ ఫీజు లేదని.. తమకు వచ్చిన ఐడియాల్లో అత్యుత్తమమైన వాటికి ఫ్రైజులు ఇస్తామని చెబుతున్నారు. దీనికి సంబంధించిన విజేతను నవంబరు 10న టోక్యోలో ప్రకటిస్తామని చెప్పారు. ఎందుకిలా? అంటే.. ప్రభుత్వానికి వచ్చే మద్యం ఆదాయం భారీగా పడిపోవటమేనని చెబుతున్నారు.

ఉదాహరణకు 1995లో జపాన్ లో సగటున ఒక వ్యక్తి ఏడాదికి 100 లీటర్ల మద్యాన్ని తీసుకుంటే.. 2020 నాటికి అది కాస్తా 75 లీటర్లకు తగ్గింది.ఈ కారణంగా ప్రభుత్వం ఆదాయం 1980 నాటికి 5 శాతం ఉంటే.. 2011 నాటికి మూడు శాతానికి పడిపోయింది. 2020 నాటికి ఇది కాస్తా 1.7 శాతానికి తగ్గిపోయింది. దీంతో.. మద్యం అమ్మకాల మీద జపాన్ ప్రభుత్వం ఫోకస్ చేసింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. జపాన్ యువత.. తమ తల్లిదండ్రుల కంటే తక్కువ మద్యాన్ని సేవించటం కూడా ఆదాయం పడిపోవటానికి కారణంగా చెబుతున్నారు. అయితే.. మద్యం వినియోగం విషయంలో యూత్ ఎందుకలా తయారైంది? అన్న విషయాన్ని చూస్తే..అందరూ కరోనాగా చెప్పినా.. అందులోకొంత మేర మాత్రమే నిజం ఉందంటున్నారు.

ఒకవేళ కరోనానే కారణమైతే.. అంతకు ముందు సంవత్సరాల్లోనూ అమ్మకాలు ఎందుకు తగ్గినట్లు? అన్నది ప్రశ్న. ఇదే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే.. జపాన్ యూత్ కు ఆరోగ్యంమీద శ్రద్ద పెరగటం.. తమ ఆరోగ్యాన్ని దెబ్బ తీసే వాటికి దూరంగా ఉండటం ఎప్పుడో మొదలైతే.. కరోనా కారణంగా ఆ అవగాహన మరింత పెరిగింది. అదే ఇప్పటి పరిస్థితి కారణమైందంటున్నారు. ఏమైనా.. జపాన్ యూత్ ఆలోచనలు మన దేశంలోని యూత్ కు ఎప్పుడు వస్తాయో?

This post was last modified on August 21, 2022 9:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదుగా బాబూ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. పెట్టుబడుల‌కు ఎక్క‌డ అవ‌కాశం ఉంటే..…

1 hour ago

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

7 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

9 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

9 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

11 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

11 hours ago