చోరీలు మామూలే. విలువైన వస్తువుల కోసం దొంగతనాలు చేస్తుంటారు. బంగారం.. వెండి.. డబ్బులు.. ఇలా ఖరీదైన వాటి కోసం దొంగతనాలు జరగటం.. వాటికి సంబంధించిన వార్తల్ని నిత్యం చూస్తుంటాం కానీ.. తాజాగా వెలుగు చూసిన దొంగతనం అందరిని ఆకర్షిస్తోంది. అనూహ్యంగా చోటుచేసుకున్న ఈ ఉదంతం అవాక్కుఅయ్యేలా చేస్తోంది. ఒక చాక్లెట్ల గోదాంను దొంగలు ఊడ్చేసిన వైనం పోలీసులకు సవాలుగా మారింది.
పవర్ ఫుల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏలుబడిలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. తాజాగా ఒక గోదాంలోని చాక్లెట్లను భారీగా దోచేశారు. రాత్రివేళలో జరిగిన ఈ చోరీని.. తెల్లవారుజామున గుర్తించారు. షాకింగ్ అంశం ఏమంటే.. చాక్లెట్ల గోదాంలో లక్షలాది రూపాయిల విలువైన చాక్లెట్లను మాత్రమే కాదు.. వాటితో పాటు.. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల్ని సైతం దొంగలించటం మరింత షాకింగ్ గా మారింది.
లక్నోలోని చిన్హాత్ ప్రాంతానికి చెందిన రాజేంద్ర సింగ్ ప్రముఖ చాక్లెట్ల కంపెనీ అయిన క్యాడ్బరీ బ్రాండ్ కు డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు.
ఆయనకు చెందిన గోదాంలో చోరీ జరిగిందని.. రూ.17 లక్షల విలువైన చాక్లెట్లు దొంగలు దోచుకెళ్లినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోదాం తలుపులు తెరిచి ఉన్నట్లుగా కొందరు రాజేంద్రకు సమాచారం ఇవ్వటంతో అక్కడకు వెళ్లిన ఆయనకు.. గోదాం మొత్తాన్ని ఊడ్చేసిన సీన్ కు షాక్ తిన్నాడు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల్ని కూడా దోచుకెళ్లిన వైనం చూస్తే.. పక్కా ప్లానింగ్ తోనే ఇదంతా జరిగిందన్న మాట వినిపిస్తోంది. ఈ చోరీని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. మరింత లోతుగా విచారణను చేపట్టారు. చాక్లెట్ల దొంగల్ని పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు.
This post was last modified on August 18, 2022 2:42 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…