Trends

అణు యుద్ధం.. ఎంతమంది చనిపోతారో తెలుసా?

ప్రపంచం వినాశపు అంచుల్లో ఉందని ఇప్పటికే హాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి. రెండు దేశాల మధ్య అణు యుద్ధం జరిగితే దాని పర్యవసానం ఎలాగుంటుందో చాలా సినిమాల్లో చూపించారు. ఇదే విషయమై అమెరికాలోని వ్యవసాయరంగంలోని శాస్త్రజ్ఞులు కూడా అంచనా వేశారు. అమెరికా-రష్యా మధ్య గనుక అణు యుద్ధం జరిగితే ప్రపంచంలోని సుమారు 500 కోట్ల మంది జనాలు చనిపోతారంటు తమ నివేదికలో స్పష్టంగా ప్రకటించారు.

ఒక అంచనా ప్రకారం ప్రస్తుత ప్రపంచ జనాభా 750 కోట్లు. అణుయుద్ధం జరిగితే ఇందులో సుమారు 500 కోట్లమంది చనిపోతారంటే అణ్వాయుధాల తీవ్రత ఏ స్ధాయిలో ఉంటుందో అందరికీ అర్ధమవుతోంది. ఇంతకీ ఇన్నివందల కోట్ల మంది జనాలు ఎలా చనిపోతారు ? అణ్వాయుధాల తీవ్రత వల్లనా లేకపోతే ఇంకేదైనా కారణమా ? అంటే రెండూ అని శాస్త్రజ్ఞులు చెప్పారు.

మొదటి కారణం ఏమిటంటే అణ్వాయుధాల ప్రయోగం వల్ల ముఖ్యంగా వాతావరణంలో ఎవరు ఊహించని పరిణామాలు జరుగుతాయట. దీనివల్ల పంటలు పూర్తగా నాశనమైపోతాయట. అంటే భూసారం దెబ్బతినేస్తుంది. నీళ్ళంతా కాలుష్యమైపోయి విషపూరితమైపోతుంది. అలాగే వాతావరణంలో కార్బన్ ఉద్గారాలు బాగా పెరిగిపోతాయట. దీనివల్ల జనాలకు అనేక రకాల శ్వాస సంబంధిత రోగాలు ఒక్కసారిగా పెరిగిపోతాయట. అంటే ఇటు అనారోగ్యాలు పెరిగిపోయి అటు పంటలూ పండకపోతే జనాలంతా ఏమై పోతారు ? దీనికి ఉదాహరణగా భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఐదేళ్లలోపు పంటలన్నీ దెబ్బ తినేస్తాయని అంచనా వేశారు. దీనివల్ల 7 శాతం వ్యవసాయోత్పత్తులు తగ్గిపోతాయట.

అంటే మామూలు పద్దతుల్లో జరిగే యుద్ధం వల్లే 7 శాతం పంటలు దెబ్బతినేస్తే ఇక అణ్వాయుధాల కారణంగా ఇంకెత నష్టం జరగుతుంది ? అమెరికా-రష్యా మధ్య అణ్వాయుధాలతో యుద్ధం జరిగితే ప్రపంచంలో 90 శాతం పంటలు దెబ్బతినేస్తాయట. అప్పుడు ఆహారాన్ని వృధా చేయడం తగ్గించేస్తే, జంతువుల నుండి లభించే ఆహారంమాత్రమే తాత్కాలికంగా ఆహార ఉత్పత్తి కొరతను తీరుస్తుందట. కొంతకాలమైన తర్వాత ఇవికూడా దొరకవన్నది వాస్తవం.

This post was last modified on August 17, 2022 5:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోనాలిసా పెళ్లి… లవ్ జిహాద్ కాదట

గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన…

1 hour ago

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

3 hours ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

3 hours ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

6 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

7 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

8 hours ago