అత్యంత వివాదాస్పద రచయిగా.. భారత సంతతికిచెందిన ప్రముఖ బ్రిటిష్ నవలా రచయిత.. బుక్ ప్రైజ్ విజేతగా సుపరిచితుడు సల్మాన్ రష్దీపై హత్యాయత్నం జరిగింది. న్యూయార్కులోని ఒక సంస్థలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆయన ప్రసంగించాల్సి ఉంది. వేదిక మీద సల్మాన్ రష్దీ ఉన్న వేళలో స్టేజ్ మీదకు దూసుకు వచ్చిన ఆగంతకుడు.. 75 ఏళ్ల సల్మాన్ రష్దీ మెడపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
కత్తి పోట్లకు గురైన సల్మాన్ రష్దీ వేదిక మీదనే కుప్పకూలిపోయారు. ఆ వెంటనే ఆయన్ను హెలికాఫ్టర్ లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న దానిపై మాత్రం పోలీసులు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. న్యూయార్క్ లోని చౌతాక్వా ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో ఈ దారుణ ఉదంతం చోటు చేసుకుంది.
ఇదిలా ఉండగా.. సల్మాన్ రష్దీపై దాడికి పాల్పడిన ఆగంతకుడ్ని నూయార్క్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ దాడి వెనుక అసలేం జరిగిందన్న వివరాల్నిసేకరించే ప్రయత్నంలో వారు ఉన్నారు. ఇక సల్మాన్ రస్దీ విషయానికి వస్తే.. 1947లో ముంబయిలో జన్మించిన ఆయన.. స్వల్ప వ్యవధిలోనే ఆయన బ్రిటన్ కు వలస వెళ్లిపోయారు. ఇదిలాఉంటే సల్మాన్ రచించిన శటానిక్ వర్సెస్.. మిడ్ నైట్ చిల్డ్రన్ నవలకు 1981లో ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజు బహుమతిని సొంతం చేసుకుంది.
ఆయనకు ఎప్పుడైతే బుక్ ప్రైజ్ వచ్చిందో దాంతో ఆయన మంచి పాపులర్ అయ్యారు. అయితే.. ఈ పుస్తకానికి ముందు ఆయన రచించిన ది సాతానిక్ వరెస్సె నవల వివాదాకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఆయనపై ఫత్వా జారీ అయ్యింది. ఇదిలా ఉండే ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో ఆ పుస్తకం మీద పలు దేశాలు నిషేధాన్ని విదించాయి. అయినప్పటికీ ఆయన తాను రాసిన పుస్తకాన్ని బ్యాన్ చేయటంపై పోరాడుతున్నారు. పలు దేశాల్లో ఈ పుస్తకంపై పెద్ద ఎత్తున నిసననలు రేగటంతో పాటు నిషేధాన్ని విధించారు.
This post was last modified on August 13, 2022 10:34 am
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…