అత్యంత వివాదాస్పద రచయిగా.. భారత సంతతికిచెందిన ప్రముఖ బ్రిటిష్ నవలా రచయిత.. బుక్ ప్రైజ్ విజేతగా సుపరిచితుడు సల్మాన్ రష్దీపై హత్యాయత్నం జరిగింది. న్యూయార్కులోని ఒక సంస్థలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆయన ప్రసంగించాల్సి ఉంది. వేదిక మీద సల్మాన్ రష్దీ ఉన్న వేళలో స్టేజ్ మీదకు దూసుకు వచ్చిన ఆగంతకుడు.. 75 ఏళ్ల సల్మాన్ రష్దీ మెడపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
కత్తి పోట్లకు గురైన సల్మాన్ రష్దీ వేదిక మీదనే కుప్పకూలిపోయారు. ఆ వెంటనే ఆయన్ను హెలికాఫ్టర్ లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న దానిపై మాత్రం పోలీసులు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. న్యూయార్క్ లోని చౌతాక్వా ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో ఈ దారుణ ఉదంతం చోటు చేసుకుంది.
ఇదిలా ఉండగా.. సల్మాన్ రష్దీపై దాడికి పాల్పడిన ఆగంతకుడ్ని నూయార్క్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ దాడి వెనుక అసలేం జరిగిందన్న వివరాల్నిసేకరించే ప్రయత్నంలో వారు ఉన్నారు. ఇక సల్మాన్ రస్దీ విషయానికి వస్తే.. 1947లో ముంబయిలో జన్మించిన ఆయన.. స్వల్ప వ్యవధిలోనే ఆయన బ్రిటన్ కు వలస వెళ్లిపోయారు. ఇదిలాఉంటే సల్మాన్ రచించిన శటానిక్ వర్సెస్.. మిడ్ నైట్ చిల్డ్రన్ నవలకు 1981లో ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజు బహుమతిని సొంతం చేసుకుంది.
ఆయనకు ఎప్పుడైతే బుక్ ప్రైజ్ వచ్చిందో దాంతో ఆయన మంచి పాపులర్ అయ్యారు. అయితే.. ఈ పుస్తకానికి ముందు ఆయన రచించిన ది సాతానిక్ వరెస్సె నవల వివాదాకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఆయనపై ఫత్వా జారీ అయ్యింది. ఇదిలా ఉండే ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో ఆ పుస్తకం మీద పలు దేశాలు నిషేధాన్ని విదించాయి. అయినప్పటికీ ఆయన తాను రాసిన పుస్తకాన్ని బ్యాన్ చేయటంపై పోరాడుతున్నారు. పలు దేశాల్లో ఈ పుస్తకంపై పెద్ద ఎత్తున నిసననలు రేగటంతో పాటు నిషేధాన్ని విధించారు.
This post was last modified on August 13, 2022 10:34 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…