ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై నెటిజన్లు మండిపోతున్నారు. ఒకవైపు దేశంపై రష్యా బాంబులు కురిపించి నాశనంచేసేస్తోంది. మరోవైపు ఇప్పటికే మామూలుజనాలతో పాటు సైనికులు కూడా వేలాదిమంది చనిపోయిరు. దేశంలో చాలాభాగం సర్వనాశనమైపోయింది. ఇలాంటి సమయంలోనే జెలెన్ స్కీ తన భార్యతో కలిసి ఫొటో షూట్ కి దిగారు. అంతర్జాతీయ మ్యాగజైన్ వోగ్ కు ఇంటర్వ్యూ కోసమని తన భార్యతో కలిసి ఫొటో షూట్ దిగటం ఇపుడు ప్రపంచదేశాల్లో సంచలనంగా మారింది.
ఒకవైపు ఉక్రెయిన్ కు మద్దతుగా చాలాదేశాలు ఆయుధాలను అందిస్తున్నాయి. ఇదే సమయంలో యుద్ధాన్ని విరమింపచేసేందుకు టర్కీ లాంటి దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. మరీ పరిస్థితుల్లో వోగ్ మ్యాగజైన్ కోసం ఫొటో షూట్ అవసరమా ? అని నెటిజన్లు మండిపోతున్నారు. మొన్నటి వరకు దేశంలో జెలెన్ స్కీ అంటు అందరూ మెచ్చుకుంటున్నారు. విదేశీ అధినేతలను ఉక్రెయిన్ కు పిలిపించి యుద్ధ పరిస్థితులను వివరించారు. నాటో దేశాల నుండి అత్యంత ఆధునిక ఆయుధాలను తెప్పించుకున్నారు.
పరిమితమైన సైనికులతోనే విదేశాలిచ్చిన ఆయుధాలతో తెగించి పోరాడటంలో జెలెన్ స్కీ ఇచ్చిన స్పూర్తిని చాలా దేశాలు అభినందించాయి. అయితే అదంతా వోగ్ పత్రిక ఇంటర్వ్యూ సందర్భంగా గాలికి కొట్టుకుపోయింది. అసలు వోగ్ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏముందంటు ప్రపంచదేశాలు అధ్యక్షుడిని నిలదీస్తున్నాయి. యుద్ధం సదర్భంగా ఎప్పుడేమి జరుగుతుందో తెలీని పరిస్ధితుల్లో అధ్యక్షుడి దంపతులకు వోగ్ మ్యాగజైన్లో ఇంటర్వ్యూ కావాల్సొచ్చిందా అంటు నెటిజన్లు కూడా రెచ్చిపోతున్నారు.
ఇదే సమయంలో కొందరు మద్దతుగా కూడా మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ సంఖ్య చాలా పరిమితమనే చెప్పాలి. ఉక్రెయిన్లోని తాజా పరిస్ధితులు ప్రపంచానికి తెలియాలని చెప్పి జెలెన్ స్కీ భార్య ఒలెనా యుద్ధ ట్యాంకులు, సైనికులతో కలిసి ఫొటోలు దిగారు. వాటిని తన ఇన్ స్టాగ్రామ్ లో ఒలేనా పోస్టుచేయటం మరో దుమారాన్ని రేపుతోంది. మరి తాజా వివాదానికి జెలెన్ స్కీ దంపతులు ఏమని సమాధానం చెబుతారో చూడాలి.
This post was last modified on July 28, 2022 2:37 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…