ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై నెటిజన్లు మండిపోతున్నారు. ఒకవైపు దేశంపై రష్యా బాంబులు కురిపించి నాశనంచేసేస్తోంది. మరోవైపు ఇప్పటికే మామూలుజనాలతో పాటు సైనికులు కూడా వేలాదిమంది చనిపోయిరు. దేశంలో చాలాభాగం సర్వనాశనమైపోయింది. ఇలాంటి సమయంలోనే జెలెన్ స్కీ తన భార్యతో కలిసి ఫొటో షూట్ కి దిగారు. అంతర్జాతీయ మ్యాగజైన్ వోగ్ కు ఇంటర్వ్యూ కోసమని తన భార్యతో కలిసి ఫొటో షూట్ దిగటం ఇపుడు ప్రపంచదేశాల్లో సంచలనంగా మారింది.
ఒకవైపు ఉక్రెయిన్ కు మద్దతుగా చాలాదేశాలు ఆయుధాలను అందిస్తున్నాయి. ఇదే సమయంలో యుద్ధాన్ని విరమింపచేసేందుకు టర్కీ లాంటి దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. మరీ పరిస్థితుల్లో వోగ్ మ్యాగజైన్ కోసం ఫొటో షూట్ అవసరమా ? అని నెటిజన్లు మండిపోతున్నారు. మొన్నటి వరకు దేశంలో జెలెన్ స్కీ అంటు అందరూ మెచ్చుకుంటున్నారు. విదేశీ అధినేతలను ఉక్రెయిన్ కు పిలిపించి యుద్ధ పరిస్థితులను వివరించారు. నాటో దేశాల నుండి అత్యంత ఆధునిక ఆయుధాలను తెప్పించుకున్నారు.
పరిమితమైన సైనికులతోనే విదేశాలిచ్చిన ఆయుధాలతో తెగించి పోరాడటంలో జెలెన్ స్కీ ఇచ్చిన స్పూర్తిని చాలా దేశాలు అభినందించాయి. అయితే అదంతా వోగ్ పత్రిక ఇంటర్వ్యూ సందర్భంగా గాలికి కొట్టుకుపోయింది. అసలు వోగ్ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏముందంటు ప్రపంచదేశాలు అధ్యక్షుడిని నిలదీస్తున్నాయి. యుద్ధం సదర్భంగా ఎప్పుడేమి జరుగుతుందో తెలీని పరిస్ధితుల్లో అధ్యక్షుడి దంపతులకు వోగ్ మ్యాగజైన్లో ఇంటర్వ్యూ కావాల్సొచ్చిందా అంటు నెటిజన్లు కూడా రెచ్చిపోతున్నారు.
ఇదే సమయంలో కొందరు మద్దతుగా కూడా మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ సంఖ్య చాలా పరిమితమనే చెప్పాలి. ఉక్రెయిన్లోని తాజా పరిస్ధితులు ప్రపంచానికి తెలియాలని చెప్పి జెలెన్ స్కీ భార్య ఒలెనా యుద్ధ ట్యాంకులు, సైనికులతో కలిసి ఫొటోలు దిగారు. వాటిని తన ఇన్ స్టాగ్రామ్ లో ఒలేనా పోస్టుచేయటం మరో దుమారాన్ని రేపుతోంది. మరి తాజా వివాదానికి జెలెన్ స్కీ దంపతులు ఏమని సమాధానం చెబుతారో చూడాలి.
This post was last modified on July 28, 2022 2:37 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…