ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా మన దేశానికి బంపరాఫర్ అందింది. రష్యా నుండి చమురు, సహజవాయువు కొనుగోలు చేస్తున్న చాలా దేశాలు చమురు కొనుగోలును నిలిపేశాయి. రష్యా నుండి చమురు, సహజ వాయువును దాదాపు 20 దేశాలు కొంటున్నాయి. యుద్ధం కారణంగా ఎందుకు నిలిపేశాయంటే చమురు, సహజవాయువు ద్వారా వచ్చిన నిధులను రష్యా యుద్ధంలో ఖర్చు చేస్తోందట. యుద్ధంలో అన్ని దేశాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచాయి.
అందుకనే రష్యాకు నిధులు అందకుండా చేయాలన్న ఉద్దేశ్యంతోనే హఠాత్తుగా చమురు, సహజవాయువు కొనుగోలును ఆపేశాయి. దాంతో రష్యాకు రెండు రకాల సమస్యలు వచ్చేశాయి. మొదటిది నిధుల సమస్య, రెండోది ఉత్పత్తుల ఎగుమతులు ఆగిపోవటం. ఈ రెండు సమస్యల నుండి వెంటనే బయటపడేందుకు రష్యా వెంటనే భారత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అప్పటివరకు ఇస్తున్న ధర కన్నా సగం ధరకే ఎక్కువ చమురును అమ్ముతానని ఆఫర్ ఇచ్చింది.
ప్రస్తుతం కడుతున్న డబ్బులకే రెట్టింపు సరఫరా చేస్తానని రష్యా అంటే భారత్ ఎందుకు వద్దంటుంది. అందుకనే ఓకే చెప్పేసింది. మే నెలలో రోజుకు రష్యా నుంచి 7.40 లక్షల బ్యారెళ్ళ చమురు ఇండియాకు చేరుకుంది. అంతకుముందు ఏప్రిల్ నెలలో అందిన చమురు రోజుకు 2.84 లక్షల బ్యారెళ్ళు మాత్రమే. అంటే ఏప్రిల్ కన్నా మే నెలలో రెట్టింపు చమురు మనకు అందింది. జూన్ చివరిలో కానీ రష్యా నుండి ఎంత చమురు దిగుమతయ్యిందో తెలీదు.
ఇక్కడో ఇంకో విషయం ఏమిటంటే రష్యాకు మనదేశం చేసే చెల్లింపులన్నింటినీ రూపాయల్లోనే చెల్లిస్తుండటం. గతంలో రష్యా మనకు ఇలాంటి వెసులుబాటు ఇవ్వలేదు. కానీ ఇపుడు తన అవసరాల కోసమని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు ఒప్పుకుంది. దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో రూపాయి మారకం విలువ పెరిగే అవకాశం వచ్చింది. ఫిబ్రవరి-మే నెలలో 40 మిలియన్ బ్యారెళ్ళ చమురు వచ్చింది. మామూలుగా అయితే రష్యా నుండి మనకు అందే చమురు సుమారు 3 శాతం మాత్రమే. కానీ ఇపుడు ప్రతి నెల 15 శాతం సరఫరా పెరిగిపోయింది. మొత్తానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల మనకు తక్కువ ధరకే, కావాల్సినంత చమురు దొరుకుతోంది.
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…