అత్యాచారానికి మించిన దారుణమైన నేరం మరొకటి ఉండదు. కొందరైతే హత్య కంటే తీవ్రమైన నేరంగా అభివర్ణిస్తారు. నిజమే.. ఒకరి అనుమతి లేకుండా.. ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా కేవలం కామవాంఛతో.. పశుబలంగాఇష్టారాజ్యంగా శారీరక హింసకు గురి చేయటానికి మించిన ఆరాచకం మరొకటి ఉంది. అందుకే.. అత్యాచార కేసుల విషయంలో చాలావరకూ బాధితురాలి పట్ల అందరూ సానుభూతిని ప్రదర్శిస్తుంటారు.అలాంటిది తాజాగా ఒక బాధితురాలిగా చెప్పే మహిళ చెప్పిన మాటల్ని విన్న కర్ణాటక హైకోర్టు అవాక్కు అయ్యింది.
ఆమె మాటలు ఇప్పుడు షాకింగ్ గానే కాదు.. ఇలా కూడా ఉంటుందా?అన్నట్లు మారింది. ఇంతకీ జరిగిందేమంటే.. కర్ణాటకకు చెందిన ఒక మహిళ.. తన సహోద్యోగి తనపై అత్యాచారానికి పాల్పడినట్లుగా కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో అరెస్టు కాకుండా ఉండేందుకు వీలుగా నిందితుడు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. దీని విచారణ సందర్భంగా ఊహించని వ్యాఖ్య బాధితురాలి నోటి నుంచి రావటం షాకింగ్ గా మారింది.
తనపై అత్యాచారం జరిగిన తర్వాత అలిసిపోయి నిద్రపోయినట్లుగా సదరు బాధితురాలు పేర్కొన్నారు. ఈ తీరును కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇది భారత మహిళ స్వభావం కాదన్న కోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. రాత్రి పదకొండు గంటల వేళలో ఆఫీసుకు వెళ్లటం.. నిందితుడితో కలిసి మద్యాన్ని సేవించటంతో పాటు.. రాత్రంతా అక్కడే గడపటం లాంటి వాటిని కోర్టుప్రస్తావించింది.
ఈ సందర్భంగా సదరు బాధితురాలిగా చెప్పుకుంటున్న మహిళ.. రేప్ జరిగిన తర్వాత ఆలసటతో తాను నిద్రపోయినట్లు పేర్కొన్నారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. సదరు మహిళ తీరును తప్పు పట్టింది. ఆమె చెప్పిన సమాధానాలు సరిగా లేవన్న భావనను వ్యక్తం చేసింది. ఇలాంటి వారి కారణంగా అమాయకులు పలువురు కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటారని న్యాయవర్గానికి చెందిన కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on June 26, 2020 10:14 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…