అత్యాచారానికి మించిన దారుణమైన నేరం మరొకటి ఉండదు. కొందరైతే హత్య కంటే తీవ్రమైన నేరంగా అభివర్ణిస్తారు. నిజమే.. ఒకరి అనుమతి లేకుండా.. ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా కేవలం కామవాంఛతో.. పశుబలంగాఇష్టారాజ్యంగా శారీరక హింసకు గురి చేయటానికి మించిన ఆరాచకం మరొకటి ఉంది. అందుకే.. అత్యాచార కేసుల విషయంలో చాలావరకూ బాధితురాలి పట్ల అందరూ సానుభూతిని ప్రదర్శిస్తుంటారు.అలాంటిది తాజాగా ఒక బాధితురాలిగా చెప్పే మహిళ చెప్పిన మాటల్ని విన్న కర్ణాటక హైకోర్టు అవాక్కు అయ్యింది.
ఆమె మాటలు ఇప్పుడు షాకింగ్ గానే కాదు.. ఇలా కూడా ఉంటుందా?అన్నట్లు మారింది. ఇంతకీ జరిగిందేమంటే.. కర్ణాటకకు చెందిన ఒక మహిళ.. తన సహోద్యోగి తనపై అత్యాచారానికి పాల్పడినట్లుగా కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో అరెస్టు కాకుండా ఉండేందుకు వీలుగా నిందితుడు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. దీని విచారణ సందర్భంగా ఊహించని వ్యాఖ్య బాధితురాలి నోటి నుంచి రావటం షాకింగ్ గా మారింది.
తనపై అత్యాచారం జరిగిన తర్వాత అలిసిపోయి నిద్రపోయినట్లుగా సదరు బాధితురాలు పేర్కొన్నారు. ఈ తీరును కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇది భారత మహిళ స్వభావం కాదన్న కోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. రాత్రి పదకొండు గంటల వేళలో ఆఫీసుకు వెళ్లటం.. నిందితుడితో కలిసి మద్యాన్ని సేవించటంతో పాటు.. రాత్రంతా అక్కడే గడపటం లాంటి వాటిని కోర్టుప్రస్తావించింది.
ఈ సందర్భంగా సదరు బాధితురాలిగా చెప్పుకుంటున్న మహిళ.. రేప్ జరిగిన తర్వాత ఆలసటతో తాను నిద్రపోయినట్లు పేర్కొన్నారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. సదరు మహిళ తీరును తప్పు పట్టింది. ఆమె చెప్పిన సమాధానాలు సరిగా లేవన్న భావనను వ్యక్తం చేసింది. ఇలాంటి వారి కారణంగా అమాయకులు పలువురు కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటారని న్యాయవర్గానికి చెందిన కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on June 26, 2020 10:14 am
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…