అత్యాచారానికి మించిన దారుణమైన నేరం మరొకటి ఉండదు. కొందరైతే హత్య కంటే తీవ్రమైన నేరంగా అభివర్ణిస్తారు. నిజమే.. ఒకరి అనుమతి లేకుండా.. ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా కేవలం కామవాంఛతో.. పశుబలంగాఇష్టారాజ్యంగా శారీరక హింసకు గురి చేయటానికి మించిన ఆరాచకం మరొకటి ఉంది. అందుకే.. అత్యాచార కేసుల విషయంలో చాలావరకూ బాధితురాలి పట్ల అందరూ సానుభూతిని ప్రదర్శిస్తుంటారు.అలాంటిది తాజాగా ఒక బాధితురాలిగా చెప్పే మహిళ చెప్పిన మాటల్ని విన్న కర్ణాటక హైకోర్టు అవాక్కు అయ్యింది.
ఆమె మాటలు ఇప్పుడు షాకింగ్ గానే కాదు.. ఇలా కూడా ఉంటుందా?అన్నట్లు మారింది. ఇంతకీ జరిగిందేమంటే.. కర్ణాటకకు చెందిన ఒక మహిళ.. తన సహోద్యోగి తనపై అత్యాచారానికి పాల్పడినట్లుగా కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో అరెస్టు కాకుండా ఉండేందుకు వీలుగా నిందితుడు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. దీని విచారణ సందర్భంగా ఊహించని వ్యాఖ్య బాధితురాలి నోటి నుంచి రావటం షాకింగ్ గా మారింది.
తనపై అత్యాచారం జరిగిన తర్వాత అలిసిపోయి నిద్రపోయినట్లుగా సదరు బాధితురాలు పేర్కొన్నారు. ఈ తీరును కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇది భారత మహిళ స్వభావం కాదన్న కోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. రాత్రి పదకొండు గంటల వేళలో ఆఫీసుకు వెళ్లటం.. నిందితుడితో కలిసి మద్యాన్ని సేవించటంతో పాటు.. రాత్రంతా అక్కడే గడపటం లాంటి వాటిని కోర్టుప్రస్తావించింది.
ఈ సందర్భంగా సదరు బాధితురాలిగా చెప్పుకుంటున్న మహిళ.. రేప్ జరిగిన తర్వాత ఆలసటతో తాను నిద్రపోయినట్లు పేర్కొన్నారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. సదరు మహిళ తీరును తప్పు పట్టింది. ఆమె చెప్పిన సమాధానాలు సరిగా లేవన్న భావనను వ్యక్తం చేసింది. ఇలాంటి వారి కారణంగా అమాయకులు పలువురు కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటారని న్యాయవర్గానికి చెందిన కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on June 26, 2020 10:14 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…