అత్యాచారానికి మించిన దారుణమైన నేరం మరొకటి ఉండదు. కొందరైతే హత్య కంటే తీవ్రమైన నేరంగా అభివర్ణిస్తారు. నిజమే.. ఒకరి అనుమతి లేకుండా.. ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా కేవలం కామవాంఛతో.. పశుబలంగాఇష్టారాజ్యంగా శారీరక హింసకు గురి చేయటానికి మించిన ఆరాచకం మరొకటి ఉంది. అందుకే.. అత్యాచార కేసుల విషయంలో చాలావరకూ బాధితురాలి పట్ల అందరూ సానుభూతిని ప్రదర్శిస్తుంటారు.అలాంటిది తాజాగా ఒక బాధితురాలిగా చెప్పే మహిళ చెప్పిన మాటల్ని విన్న కర్ణాటక హైకోర్టు అవాక్కు అయ్యింది.
ఆమె మాటలు ఇప్పుడు షాకింగ్ గానే కాదు.. ఇలా కూడా ఉంటుందా?అన్నట్లు మారింది. ఇంతకీ జరిగిందేమంటే.. కర్ణాటకకు చెందిన ఒక మహిళ.. తన సహోద్యోగి తనపై అత్యాచారానికి పాల్పడినట్లుగా కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో అరెస్టు కాకుండా ఉండేందుకు వీలుగా నిందితుడు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. దీని విచారణ సందర్భంగా ఊహించని వ్యాఖ్య బాధితురాలి నోటి నుంచి రావటం షాకింగ్ గా మారింది.
తనపై అత్యాచారం జరిగిన తర్వాత అలిసిపోయి నిద్రపోయినట్లుగా సదరు బాధితురాలు పేర్కొన్నారు. ఈ తీరును కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇది భారత మహిళ స్వభావం కాదన్న కోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. రాత్రి పదకొండు గంటల వేళలో ఆఫీసుకు వెళ్లటం.. నిందితుడితో కలిసి మద్యాన్ని సేవించటంతో పాటు.. రాత్రంతా అక్కడే గడపటం లాంటి వాటిని కోర్టుప్రస్తావించింది.
ఈ సందర్భంగా సదరు బాధితురాలిగా చెప్పుకుంటున్న మహిళ.. రేప్ జరిగిన తర్వాత ఆలసటతో తాను నిద్రపోయినట్లు పేర్కొన్నారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. సదరు మహిళ తీరును తప్పు పట్టింది. ఆమె చెప్పిన సమాధానాలు సరిగా లేవన్న భావనను వ్యక్తం చేసింది. ఇలాంటి వారి కారణంగా అమాయకులు పలువురు కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటారని న్యాయవర్గానికి చెందిన కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on June 26, 2020 10:14 am
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…