ఒక దేశపు ఆర్థిక స్తోమతను రెండు రకాలుగా కొలుస్తారు. మొదటిదేమో ఆ దేశం దగ్గరున్న విదేశీ మారకపు నిల్వలు. ఇక రెండోదేమో ఆ దేశం దగ్గరున్న బంగారం నిల్వలు. విదేశీ మారకద్రవ్య నిల్వలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. అలాగే బంగారం నిల్వలు కూడా అటు ఇటు అవుతుంటాయి. కానీ ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశపు ఆర్థిక స్తోమత అంతగా ఉన్నట్లు ఆర్ధిక నిపుణులు చెబుతుంటారు.
ఇపుడిదంతా ఎందుకంటే మనదేశంలోని బంగారం నిల్వలు సుమారుగా 760 టన్నులున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా రిజర్వ్ బ్యాంకే ప్రకటించింది. విదేశీ మారకద్రవ్య నిల్వలను అయినా బంగారం నిల్వలను అయినా మన దేశంలో రిజర్వ్ బ్యాంకే నియంత్రిస్తుందన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణం సమస్యలను అధిగమించేందుకు మన ప్రభుత్వం బంగారం నిల్వలనే నమ్ముకుంది. 2020 జూన్-2021 మార్చి మధ్య ఆర్బీఐ 33.9 టన్నుల బంగారాన్ని కొన్నది.
అలాగే 2022 మార్చి నెలాఖరులోగా మరో 65 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. 2022 మార్చి నెలాఖరుకు తన దగ్గర 760. 42 టన్నుల బంగారం ఉన్నట్లు ప్రకటించింది. ఈ బంగారం నిల్వల ప్రస్తుత మార్కెట్ ధర రూ. 3.22 లక్షల కోట్లుగా లెక్క తేలింది. అమెరికా కరెన్సీ డాలర్ విలువను తట్టుకోవాలంటే బంగారం నిల్వలను పెంచుకోవడం ఒకటే మార్గమని ఆర్బీఐ గట్టిగా నమ్మింది. అందుకనే ఎప్పటికప్పుడు బంగారం నిల్వలను కొనుగోలు చేస్తోంది.
తన దగ్గరున్న నిల్వల్లో 453 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర డిపాజిట్ చేసింది. 296 టన్నుల బంగారం నిల్వలను బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ దగ్గరుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో బంగారం విలువ 2021 లెక్కల ప్రకారం 5.88 శాతం ఉంటే 2022 మార్చి చివరకు 7.01 శాతంకు చేరుకుంది. ఇపుడు శ్రీలంకలో ఇలాంటి పరిస్ధితులు తల్లకిందులైపోయిన కారణంగానే దేశం దివాలా తీసింది. దేశం దివాలా తీసిన విషయాన్ని స్వయంగా శ్రీలంక రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నందకుమారే ప్రకటించటం ప్రపంచదేశాల్లో సంచలనంగా మారింది.
This post was last modified on May 28, 2022 11:00 am
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందించిన పెద్ది మీద అంచనాలు ఏ…
ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని.. ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనిని సుమారు 5 వేల ఎకరాల్లో…
ప్రస్తుతం పొదుపు మంత్రం పఠిస్తున్న కేంద్ర ప్రభుత్వం చమురు సహా బంగారం వంటివాటిపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ పరిధిలో…
ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీజేపీకి కేటాయించనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. మొత్తం నాలుగు స్థానాల్లో…
ఇంకో రెండు రోజుల్లో రాబోతున్న పెద్ది ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూపులు మాములుగా లేవు. మూడు నిమిషాల…
వచ్చే ఎన్నికలకు సంబంధించి సీఎం చంద్రబాబు వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించారా? ప్రస్తుతం ఇస్తున్న పథకాలను మరింత పెంచనున్నారా? అంటే…