ఒక దేశపు ఆర్థిక స్తోమతను రెండు రకాలుగా కొలుస్తారు. మొదటిదేమో ఆ దేశం దగ్గరున్న విదేశీ మారకపు నిల్వలు. ఇక రెండోదేమో ఆ దేశం దగ్గరున్న బంగారం నిల్వలు. విదేశీ మారకద్రవ్య నిల్వలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. అలాగే బంగారం నిల్వలు కూడా అటు ఇటు అవుతుంటాయి. కానీ ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశపు ఆర్థిక స్తోమత అంతగా ఉన్నట్లు ఆర్ధిక నిపుణులు చెబుతుంటారు.
ఇపుడిదంతా ఎందుకంటే మనదేశంలోని బంగారం నిల్వలు సుమారుగా 760 టన్నులున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా రిజర్వ్ బ్యాంకే ప్రకటించింది. విదేశీ మారకద్రవ్య నిల్వలను అయినా బంగారం నిల్వలను అయినా మన దేశంలో రిజర్వ్ బ్యాంకే నియంత్రిస్తుందన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణం సమస్యలను అధిగమించేందుకు మన ప్రభుత్వం బంగారం నిల్వలనే నమ్ముకుంది. 2020 జూన్-2021 మార్చి మధ్య ఆర్బీఐ 33.9 టన్నుల బంగారాన్ని కొన్నది.
అలాగే 2022 మార్చి నెలాఖరులోగా మరో 65 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. 2022 మార్చి నెలాఖరుకు తన దగ్గర 760. 42 టన్నుల బంగారం ఉన్నట్లు ప్రకటించింది. ఈ బంగారం నిల్వల ప్రస్తుత మార్కెట్ ధర రూ. 3.22 లక్షల కోట్లుగా లెక్క తేలింది. అమెరికా కరెన్సీ డాలర్ విలువను తట్టుకోవాలంటే బంగారం నిల్వలను పెంచుకోవడం ఒకటే మార్గమని ఆర్బీఐ గట్టిగా నమ్మింది. అందుకనే ఎప్పటికప్పుడు బంగారం నిల్వలను కొనుగోలు చేస్తోంది.
తన దగ్గరున్న నిల్వల్లో 453 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర డిపాజిట్ చేసింది. 296 టన్నుల బంగారం నిల్వలను బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ దగ్గరుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో బంగారం విలువ 2021 లెక్కల ప్రకారం 5.88 శాతం ఉంటే 2022 మార్చి చివరకు 7.01 శాతంకు చేరుకుంది. ఇపుడు శ్రీలంకలో ఇలాంటి పరిస్ధితులు తల్లకిందులైపోయిన కారణంగానే దేశం దివాలా తీసింది. దేశం దివాలా తీసిన విషయాన్ని స్వయంగా శ్రీలంక రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నందకుమారే ప్రకటించటం ప్రపంచదేశాల్లో సంచలనంగా మారింది.
This post was last modified on May 28, 2022 11:00 am
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…