ఇండియన్ క్రికెట్ ఆల్ టైం గ్రేట్స్లో ఒకడైన మహేంద్రసింగ్ ధోని.. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పేసి రెండేళ్లు కావస్తోంది. ఐపీఎల్లో కూడా అతను ఒకట్రెండేళ్లకు మించి కొనసాగకపోవచ్చని అప్పుడే అనుకున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్కు టాటా చెప్పాక ధోని రెండు ఐపీఎల్ సీజన్లలో ఆడాడు. 2020లో ఐపీఎల్ ఆలస్యంగా, యూఏఈలో జరగగా.. గత ఏడాది సగం సీజన్ ఇక్కడ, సగం యూఏఈలో నిర్వహించారు. మళ్లీ ఏ ఏడాది ఐపీఎల్ స్వదేశానికి తిరిగొచ్చింది.
ధోనీకి ఇంకో రెండు నెలల్లో 41 ఏళ్లు పూర్తవుతాయి. అతడి ఫిట్నెస్ తగ్గింది. బ్యాటింగ్లో మునుపటి వేగం లేదు. ఈ నేపథ్యంలో ఈ సీజన్లోనే ఐపీఎల్కు కూడా టాటా చెప్పేస్తాడేమో అన్న సందేహాలు కలిగాయి. కానీ అభిమానుల్లో మాత్రం ఇంకో సీజన్ ఆడితే బాగుండనే ఆశలున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ సీజన్లో చివరి లీగ్ మ్యాచ్కు కెప్టెన్గా టాస్కు వచ్చాడు ధోని. దీంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
ఐతే వచ్చే సీజన్లోనూ తాను కొనసాగబోతున్నట్లు క్లారిటీ ఇచ్చి అభిమానులను సంతోషంలో ముంచెత్తాడు మహి. కొవిడ్ భయాలతో ఈ ఐపీఎల్ను ముంబయి, పుణె నగరాలకు పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ఐతే తననెంతగానో అభిమానించే చెన్నై ఫ్యాన్స్ ముందు వీడ్కోలు మ్యాచ్ ఆడాలన్నది ధోని కోరిక. ఈ విషయమై ఇంతకుముందే సంకేతాలు ఇచ్చాడు.
ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి.. చెన్నైలో మళ్లీ ఐపీఎల్ ఆడతానని స్పష్టం చేశాడు. చెన్నైలో తాను మళ్లీ ఐపీఎల్ మ్యాచ్ ఆడకపోతే అక్కడి అభిమానులకు అన్యాయం చేసినట్లే అవుతుందని అతనన్నాడు. అలాగే వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు తిరిగి అక్కడి అభిమానుల ప్రేమనూ పొందాలనుకుంటున్నట్లు కూడా ధోని చెప్పాడు. ఈ మాటల్ని బట్టి చూస్తే ధోని వచ్చే ఏడాది కూడా ఆడి రిటైరయ్యే అవకాశాలున్నాయన్నది స్పష్టం. రిటైర్మెంట్ సంగతి అడిగితే మాత్రం ఏం జరుగుతుందో చెప్పలేనని ధోని పేర్కొనడం గమనార్హం.
This post was last modified on May 21, 2022 6:45 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…