ఇండియన్ క్రికెట్ ఆల్ టైం గ్రేట్స్లో ఒకడైన మహేంద్రసింగ్ ధోని.. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పేసి రెండేళ్లు కావస్తోంది. ఐపీఎల్లో కూడా అతను ఒకట్రెండేళ్లకు మించి కొనసాగకపోవచ్చని అప్పుడే అనుకున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్కు టాటా చెప్పాక ధోని రెండు ఐపీఎల్ సీజన్లలో ఆడాడు. 2020లో ఐపీఎల్ ఆలస్యంగా, యూఏఈలో జరగగా.. గత ఏడాది సగం సీజన్ ఇక్కడ, సగం యూఏఈలో నిర్వహించారు. మళ్లీ ఏ ఏడాది ఐపీఎల్ స్వదేశానికి తిరిగొచ్చింది.
ధోనీకి ఇంకో రెండు నెలల్లో 41 ఏళ్లు పూర్తవుతాయి. అతడి ఫిట్నెస్ తగ్గింది. బ్యాటింగ్లో మునుపటి వేగం లేదు. ఈ నేపథ్యంలో ఈ సీజన్లోనే ఐపీఎల్కు కూడా టాటా చెప్పేస్తాడేమో అన్న సందేహాలు కలిగాయి. కానీ అభిమానుల్లో మాత్రం ఇంకో సీజన్ ఆడితే బాగుండనే ఆశలున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ సీజన్లో చివరి లీగ్ మ్యాచ్కు కెప్టెన్గా టాస్కు వచ్చాడు ధోని. దీంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
ఐతే వచ్చే సీజన్లోనూ తాను కొనసాగబోతున్నట్లు క్లారిటీ ఇచ్చి అభిమానులను సంతోషంలో ముంచెత్తాడు మహి. కొవిడ్ భయాలతో ఈ ఐపీఎల్ను ముంబయి, పుణె నగరాలకు పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ఐతే తననెంతగానో అభిమానించే చెన్నై ఫ్యాన్స్ ముందు వీడ్కోలు మ్యాచ్ ఆడాలన్నది ధోని కోరిక. ఈ విషయమై ఇంతకుముందే సంకేతాలు ఇచ్చాడు.
ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి.. చెన్నైలో మళ్లీ ఐపీఎల్ ఆడతానని స్పష్టం చేశాడు. చెన్నైలో తాను మళ్లీ ఐపీఎల్ మ్యాచ్ ఆడకపోతే అక్కడి అభిమానులకు అన్యాయం చేసినట్లే అవుతుందని అతనన్నాడు. అలాగే వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు తిరిగి అక్కడి అభిమానుల ప్రేమనూ పొందాలనుకుంటున్నట్లు కూడా ధోని చెప్పాడు. ఈ మాటల్ని బట్టి చూస్తే ధోని వచ్చే ఏడాది కూడా ఆడి రిటైరయ్యే అవకాశాలున్నాయన్నది స్పష్టం. రిటైర్మెంట్ సంగతి అడిగితే మాత్రం ఏం జరుగుతుందో చెప్పలేనని ధోని పేర్కొనడం గమనార్హం.
This post was last modified on May 21, 2022 6:45 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…