Trends

పిల్లల్ని కనండి లేదా రూ.5 కోట్లు ఇవ్వండి

ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జిల్లా కోర్టులో అరుదైన పిటిషన్ దాఖలైంది. హరిద్వార్ కు చెందిన వృద్ధ దంపతులు.. తమ కుమారుడు, కోడలు ఏడాదిలోపు బిడ్డకు జన్మనివ్వాలని డిమాండ్ చేశారు. అది నెరవేర్చ కపోతే.. వారిపై తాము ఖర్చు చేసిన రూ.5 కోట్లను పరిహారంగా చెల్లించాలని పిటిషన్లో పేర్కొన్నారు.

హరిద్వార్కు చెందిన సంజీవ్ రంజన్ ప్రసాద్ బీహెచ్ఈఎల్లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం తన భార్య సాధనతో కలిసి హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్నారు. ఆ దంపతుల ఏకైక కుమారుడు శ్రేయ్ సాగర్‌కు నోయిడా నివాసి శుభాంగి సిన్హాతో 2016లో వివాహం చేశారు. శ్రేయ్సాగర్ పైలట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, వివాహం జరిగి ఆరేళ్లు గడుస్తున్నా పిల్లలు లేకపోవటం, ఆ దిశగా కొడుకు, కోడలు ఎలాంటి ప్రయత్నం చేయకపోవటంపై విసిగిపోయిన రంజన్ దంపతులు కోర్టు మెట్లు ఎక్కారు.

సంజీవ్ రంజన్ ప్రసాద్ తన డబ్బుంతా కుమారుడు చదువు కోసమే వెచ్చించానని, అమెరికాలో శిక్షణ ఇప్పించానని తెలిపారు. ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకులో అప్పు తీసుకున్నానని, చాలా ఆర్థిక ఇబ్బందల్లో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈ వృద్ధ దంపతులు హరిద్వార్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ, అతడి కుమారుడికి పెళ్లి అయ్యి ఆరేళ్లు గడిచినా సంతానం కలగలేదని చెప్పారు. కుమారుడు, కోడలు బిడ్డ కోసం ఎలాంటి ప్లానింగ్ చేయడం లేదని తెలిపారు.

అలాగే, తమ కుమారుడిని పెంచి, సమర్థుడిని చేసేందుకు తమ డిపాజిట్లన్నింటినీ పెట్టుబడిగా పెట్టామని వృద్ధ దంపతులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వయసులో తాము ఒంటరిగా జీవించవలసి వస్తోందని, ఇది చాలా బాధాకరమైనదని అన్నారు. తమ కుమారుడు, కోడలు మనవళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. మగపిల్లా, ఆడపిల్లా అన్నది తమకు పట్టింపు లేదని, అలా చేయకుంటే తాము ఖర్చు చేసిన రూ.5 కోట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఈ పిటిషన్ మే 17న విచారణకు రానుంది.

This post was last modified on May 12, 2022 5:58 pm

Share

Recent Posts

ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మద్దతు

రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…

1 hour ago

అతిగా ఫోన్ వాడిన షకీలా ఇప్పుడు ఎలా ఉందంటే…

ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌తో…

1 hour ago

ఫ్యాన్స్ వద్దా జాన్వీ మేడమ్?

ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…

2 hours ago

అమరావతికి మహర్దశ… బాబు ప్రయత్నం ఫలిస్తుంది!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క ప్రాధ‌మిక ప్రాజెక్టులుగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిల‌ను సీఎం చంద్ర‌బాబు తాజాగా…

2 hours ago

ఫ్లాప్ సినిమా సీక్వెల్… అయినా క్రేజ్ ఉంది

ఓజిలో విలన్ గా పరిచయమైన ఇమ్రాన్ హష్మీ ఒకప్పుడు బాలీవుడ్ సోలో హీరోగా మంచి మార్కెట్ ఎంజాయ్ చేసిన వైనం…

2 hours ago

నాగవంశీకి ఈసారి అలాంటి ఇబ్బంది లేదు

కొందరు నిర్మాతలకు కాకతాళీయంగా జరిగేవే అయినా కొన్ని సంఘటనల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. నాగవంశీకి ఇది బాగా అనుభవం. లక్కీ…

3 hours ago