కరోనా మరణాలపై నెలకొన్న వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగిలిన దేశాన్ని పక్కన పెడితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కరోనా కారణంగా చనిపోయిన వారికి.. ప్రభుత్వం చెప్పే దానికి ఏ మాత్రం పొంతన లేదన్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. ఎవరేం చెప్పినా.. ప్రభుత్వాలు మాత్రం కరోనాతో చోటు చేసుకున్న మరణాల్ని చాలా తక్కువ చేసి చూపించినట్లుగా చెప్పే సందేహాలకు సమాధానాలు చెప్పింది లేదు. ఇదిలా ఉండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) తాజాగా ఒక షాకింగ్ రిపోర్టును వెల్లడించింది.
2020 జనవరి నుంచి 2021 డిసెంబరు మధ్య కాలంలో భారతదేశంలో మొత్తంగా 47 లక్షల మంది కరోనా కారణంగా మరణించినట్లుగా చెబుతున్నారు. ఇది భారత దేశ ప్రభుత్వం ప్రకటించిన అధికారిక లెక్కలకు పది రెట్లు ఎక్కువగా చెబుతున్నారు. ప్రపంచం మొత్తంలో నమోదైన కరోనా మరణాల్లో మూడో వంతు భారత్ లోనే నమోదైనట్లు పేర్కొన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన రిపోర్టును భారత ప్రభుత్వం తీవ్రంగా తప్పు పడుతోంది. మీడియా రిపోర్టులు.. ఏవో వెబ్ సైట్లు ఇచ్చిన డేటాను తీసుకొని ఇలాంటివి చెప్పటం సరికాదని స్పష్టం చేసింది. కోవిడ్ మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చూపిస్తున్న లెక్కలు సత్యదూరమని చెబుతోంది. జనన.. మరణాల రిజిస్ట్రేషన్ కు భారత్ లో పటిష్టమైన విధానాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా 1.5 కోట్ల మంది మరణించినట్లుగా డబ్ల్యూహెచ్ వో రిపోర్టు వెల్లడించింది.
This post was last modified on May 6, 2022 9:26 am
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…