Trends

అమెరికా ఆంక్షలను లెక్కే చేయటం లేదా?

ప్రత్యక్షంగా, పరోక్షంగా అమెరికా చేస్తున్న వార్నింగులను మన పాలకులు అసలు ఏమాత్రం లెక్కే చేయడం లేదు. రష్యా నుండి చమురు కొనుగోలు చేయకూడదని, ఆయుధాల కొనుగోళ్ళు ఆపేయాలని అగ్రరాజ్యం మన పాలకులపై ఆంక్షలను పెడుతోంది. ఉక్రెయిన్  పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం మూడో నెలకు చేరుకుంది. ఈ నేపధ్యంలోనే భారత్ పై అమెరికా ఆంక్షలను బాగా పెంచుతోంది. అయితే మనదేశం ఏ మాత్రం లెక్కచేయటం లేదు.

అమెరికా ఆంక్షలను పెంచే కొద్దీ రష్యా నుంచి కొనుగోళ్ళను మనపాలకులు మరింతగా పెంచుతున్నారు. దాంతో ఏమి చేయాలో అర్ధంకాక అమెరికా దిక్కులు చూస్తోంది. రష్యా నుండి మనకు దిగుమతయ్యే చమురు సుమారు 1 శాతముంటుంది. మనకు ఎక్కువుగా ఆయల్ గల్ఫ్ దేశాల నుండే దిగుమతవుతుంది. అయితే ఒపెక్ దేశాలు చెప్పిన ధరే వేదం తప్ప బేరమాటడానికి వేరే దారిలేదు.

అయితే తాజా యుద్ధం కారణంగా రష్యాకు భారీ ఎత్తున నిధులు కావాల్సొచ్చింది. అందుకనే చమురును తక్కువ ధరలకే అమ్ముతామని మనకు చెప్పింది. ధర తక్కువ, పైగా కావాల్సినంత చమురును ఒకే ధరకు అందులోను రూపాయిల్లో చెల్లించేందుకు రష్యా అంగీకరించింది. దాంతో వెంటనే చమురును అవసరమైనంత కొనుగోలు చేయటానికి మన దేశం రెడీ అయిపోయింది. ఈ విషయంలో అమెరికా ఎన్ని ఆంక్షలను విధించినా మన పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు.

అలాగే ఆయుధాలను కూడా రష్యా నుండి కొనుగోలు చేయటానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలోకన్నా తక్కువ ధరలకే ఆయుధాలను అందిస్తామని రష్యా ఇచ్చిన ఆఫర్ మన పాలకులను చాలా టెంప్ట్ చేస్తోంది. యుద్ధ సమయంలో రష్యాకు నిధులు అవసరమైంది కాబట్టి ఆయిల్, ఆయుధాలను తక్కువ ధరలకే అమ్ముతామని రష్యా చెప్పటంతో మన పాలకులు కూడా హ్యాపీగా ఉన్నారు. అందుకనే అమెరికా, నాటో దేశాలు ఎంత గోల చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటంలేదు. అందుకనే రష్యా-భారత్ మధ్య జరుగుతున్న లావాదేవీలను అమెరికా చూస్తు కూర్చోవటం తప్ప చేయగలిగిందేమీ లేదు.

This post was last modified on April 21, 2022 11:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

35 seconds ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

48 minutes ago

‘పవన్ పదవి వదిలి గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చు’

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ డిమాండ్…

52 minutes ago

ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు.…

2 hours ago

మళ్ళీ పాద‌యాత్ర చేసి సాధించేది ఏమన్నా ఉందా జగన్?

అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న ప‌రిస్థితిలో చెప్పడం కష్టంగా…

3 hours ago

వారికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం: చంద్రబాబు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…

3 hours ago