ఉక్రెయిన్ నేపథ్యంలో తొందరలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై తిరుగుబాటు తప్పదా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గడిచిన 30 రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తోంది. ఉక్రెయిన్ లెక్కల ప్రకారం 15 వేల మంది సైనికులు చనిపోయారు. రష్యా సైన్యం దెబ్బకు ఉక్రెయిన్ దాదాపు సర్వ నాశనమైపోయింది. దేశంలోని ఆరు కీలక నగరాల్లో దాదాపు నేల మట్టమైపోయాయి.
ఇంకా ఎన్ని రోజులు ఈ యుద్ధం జరుగుతుందో ఎవరికీ తెలీదు. అందుకనే రష్యాలోనే పుతిన్ పై వ్యతిరేకత పెరిగిపోతోంది. అనాలోచితంగా ఉక్రెయిన్ పై యుద్ధం మొదలు పెట్టిన కారణంగానే రష్యా కూడా దారుణంగా నష్టపోతోంది. దీన్నే రష్యన్లు సహించలేకపోతున్నారు. పైగా రష్యా సైన్యంలోని ఉన్నతాధికారులకు+ సైన్యానికి కూడా ఉక్రెయిన్ పై యుద్ధం చేయటం ఏమాత్రం ఇష్టం లేదు. అయినా పుతిన్ నిర్ణయాన్ని వ్యతిరేకించలేక యుద్ధానికి దిగారు.
విచిత్రమేమిటంటే ఈ యుద్ధంలో చిట్టెలుక లాంటి ఉక్రెయిన్ నష్టపోవటం చాలా సహజం. కానీ రష్యా తరఫున ఇద్దరు మేజర్ జనరళ్ళతో పాటు ఐదుగురు జనరల్ స్ధాయి సైనిక అత్యున్నత అధికారులు మరణించారు. ఈ కారణంగానే అత్యున్నత సైనికాధికారులు పుతిన్ పై మండిపోతున్నారట. యుద్ధం ఇలాగే మరికొద్ది రోజులు కంటిన్యూ అయితే ప్రజలే తిరుగుబాటు లేవదీసినా ఆశ్చర్యంలేదని పాశ్యాత్య మీడియా కథనాలిచ్చింది.
అసలు అంతంత మాత్రంగా ఉన్న రష్యా ఆర్థిక పరిస్థితి యుద్ధం కారణంగా పాతాళానికి దిగజారిపోయింది. దీని ప్రభావం పుతిన్ ప్రతిష్టను బాగా దెబ్బతీసింది. ప్రపంచదేశాలన్నీ రష్యా నుండి తమ వ్యాపారాలను తరలించుకుపోవటం, పరిశ్రమలను మూసేశాయి. అలాగే ప్రపంచ దేశాలు రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలు దేశాన్ని దారుణంగా దెబ్బతీశాయి. రష్యాను ప్రపంచ దేశాలు దాదాపుగా వెలేసినట్లయ్యింది. దీన్ని రష్యన్లు ఏ మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఇదంతా చూసిన తర్వాత రష్యాలోని వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, సైన్యంలోని ఉన్నతాధికారులు, మామూలు జనాలు ఏకమైతే పుతిన్ పై తిరుగుబాటు తప్పదనే సంకేతాలు కనబడుతున్నాయి. మరి చివరకు ఏమవుతుందో ?
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…