ఉక్రెయిన్ నేపథ్యంలో తొందరలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై తిరుగుబాటు తప్పదా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గడిచిన 30 రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తోంది. ఉక్రెయిన్ లెక్కల ప్రకారం 15 వేల మంది సైనికులు చనిపోయారు. రష్యా సైన్యం దెబ్బకు ఉక్రెయిన్ దాదాపు సర్వ నాశనమైపోయింది. దేశంలోని ఆరు కీలక నగరాల్లో దాదాపు నేల మట్టమైపోయాయి.
ఇంకా ఎన్ని రోజులు ఈ యుద్ధం జరుగుతుందో ఎవరికీ తెలీదు. అందుకనే రష్యాలోనే పుతిన్ పై వ్యతిరేకత పెరిగిపోతోంది. అనాలోచితంగా ఉక్రెయిన్ పై యుద్ధం మొదలు పెట్టిన కారణంగానే రష్యా కూడా దారుణంగా నష్టపోతోంది. దీన్నే రష్యన్లు సహించలేకపోతున్నారు. పైగా రష్యా సైన్యంలోని ఉన్నతాధికారులకు+ సైన్యానికి కూడా ఉక్రెయిన్ పై యుద్ధం చేయటం ఏమాత్రం ఇష్టం లేదు. అయినా పుతిన్ నిర్ణయాన్ని వ్యతిరేకించలేక యుద్ధానికి దిగారు.
విచిత్రమేమిటంటే ఈ యుద్ధంలో చిట్టెలుక లాంటి ఉక్రెయిన్ నష్టపోవటం చాలా సహజం. కానీ రష్యా తరఫున ఇద్దరు మేజర్ జనరళ్ళతో పాటు ఐదుగురు జనరల్ స్ధాయి సైనిక అత్యున్నత అధికారులు మరణించారు. ఈ కారణంగానే అత్యున్నత సైనికాధికారులు పుతిన్ పై మండిపోతున్నారట. యుద్ధం ఇలాగే మరికొద్ది రోజులు కంటిన్యూ అయితే ప్రజలే తిరుగుబాటు లేవదీసినా ఆశ్చర్యంలేదని పాశ్యాత్య మీడియా కథనాలిచ్చింది.
అసలు అంతంత మాత్రంగా ఉన్న రష్యా ఆర్థిక పరిస్థితి యుద్ధం కారణంగా పాతాళానికి దిగజారిపోయింది. దీని ప్రభావం పుతిన్ ప్రతిష్టను బాగా దెబ్బతీసింది. ప్రపంచదేశాలన్నీ రష్యా నుండి తమ వ్యాపారాలను తరలించుకుపోవటం, పరిశ్రమలను మూసేశాయి. అలాగే ప్రపంచ దేశాలు రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలు దేశాన్ని దారుణంగా దెబ్బతీశాయి. రష్యాను ప్రపంచ దేశాలు దాదాపుగా వెలేసినట్లయ్యింది. దీన్ని రష్యన్లు ఏ మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఇదంతా చూసిన తర్వాత రష్యాలోని వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, సైన్యంలోని ఉన్నతాధికారులు, మామూలు జనాలు ఏకమైతే పుతిన్ పై తిరుగుబాటు తప్పదనే సంకేతాలు కనబడుతున్నాయి. మరి చివరకు ఏమవుతుందో ?
This post was last modified on March 27, 2022 2:45 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…