Trends

ముంబయిలో ఇలాంటి దృశ్యం ఊహించగలమా?

ముంబయిలో జనజీవనం అత్యధికంగా ఆధారపడేది లోకల్ రైళ్ల మీదే. అక్కడ బస్సు సర్వీసులు పరిమితంగానే ఉంటాయి. జనాలు ఎక్కువగా రైళ్లనే ప్రిఫర్ చేస్తారు. నగరంలో ఏ మూల నుంచి ఇంకే మూలకైనా రైల్లోనే వెళ్లిపోవచ్చు. ఉదయం, సాయంత్రం అక్కడి రైళ్లలో జనాలు ప్రయాణించే తీరు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

మన దగ్గర ఓ మోస్తరు వేగంతో నడిచే సిటీ బస్సుల్లో వేలాడుతూ వెళ్లే కుర్రాళ్లను చూసి భయపడుతుంటాం. కానీ ముంబయిలో చిన్నా పెద్ద అని తేడా లేకుండా రైళ్లలో ఇలాగే వేలాడుతూ వెళ్తుంటారు. ఒక్కో రైలు పెట్టె వందల మందితో కిక్కిరిసి ఉంటుంది. పుట్ పాత్ మీది నుంచి వేలాడుతూ పదుల మంది అత్యంత ప్రమాదకర రీతిలో ప్రయాణం సాగిస్తుంటారు.

ఇక ఒక స్టేషన్లో రైలు వచ్చి ఆగినపుడు రెండు మూడు నిమిషాల వ్యవధిలో వందల మంది ఎక్కడం, దిగడం చూస్తే కళ్లు తిరుగుతాయి. ఐతే మనకు అవి చిత్రంగా అనిపించినా.. ముంబయి వాసులకు అది అలవాటైన వ్యవహారం.

ఐతే కరోనా పుణ్యమా అని చాలా మారినట్లే ముంబయి రైలు ప్రయాణాల తీరు కూడా మారిపోయింది. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా కరోనా ప్రభావం ఎదుర్కొంటున్న నగరం ముంబయే. అక్కడ రోజూ వేల కేసులు నమోదవుతున్నాయి. వందల మంది చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో భౌతిక దూరం, మాస్కులు, శానిటైజేషన్ సహా అన్ని షరతులనూ పకడ్బందీగా పాటించాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లో వందలు వేలమంది గుమికూడి ఒకరిపై ఒకరు పడి తోసుకుంటూ రైళ్లు ఎక్కే పరిస్థితి ఎంతమాత్రం లేదు. కనీసం ఆరడుగుల దూరం పాటిస్తూ గీసిన బాక్సుల్లోనే నిలబడాలి. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి. ఒకరినొకరు తాకడం కాదు కదా.. సమీపంలో వెళ్లడానికి కూడా వీల్లేదు. ఈ షరతులన్నీ పాటిస్తూ ప్రయాణికులు రైల్వే స్టేషన్లో ఎదురు చూడటం, రైళ్లు ఎక్కడం చాలా కొత్తగా కనిపిస్తోంది. ఒకప్పటి దృశ్యాలతో పోల్చుకుని ముంబయి ఎంత మారిపోయిందో అని అందరూ షాకవుతున్నారు. సంబంధిత వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

This post was last modified on June 20, 2020 12:14 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

2 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

3 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

4 hours ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

4 hours ago

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

6 hours ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

7 hours ago