Trends

మొబైల్ వాడకంపై మధురై ధర్మాసనం సంచలన తీర్పు

మొబైల్ ఫోన్ వినియోగంపై తమిళనాడు హైకోర్టులోని మధురై ధర్మాసనం ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. పని వేళ్ళల్లో  ఉద్యోగులు ఎవరు మొబైల్ ఫోన్లను వాడేందుకు లేదని తీర్పు చెప్పింది. పని వేళ్ళల్లో కూడా ఉద్యోగులు మొబైల్ ఫోన్లను ఉపయోగించటం, వీడియోలు తీయటం, వీడియోలు చూస్తు టైంపాస్ చేయడం ఎక్కువైపోతోందని ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి వాటిని కచ్చితంగా కంట్రోల్  చేయాల్సిందే అని చెప్పింది.

ఉద్యోగులు యధేచ్చగా మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తుండటం వల్ల అవసరాల కోసం ఆఫీసులకు వచ్చే జనాలను  ఉద్యోగులు పట్టించుకోవటం లేదన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే తిరుచ్చి ఆరోగ్య మండల కార్యాలయంలో పనిచేస్తున్న ఒక మహిళా సూపర్ వైజర్ పని వేళ్ళల్లో  మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుండటం, వీడియోలు తీసుకుంటోందనే ఆరోపణలొచ్చాయి. దాంతో విచారణ జరిపిన ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది. దాంతో ఆమె ప్రభుత్వ నిర్ణయాన్ని చాలెంజ్ చేస్తు కోర్టులో కేసు వేశారు.

ఆ కేసును విచారించిన మధురై దర్మాసనం మొబైల్ వినియోగం విషయంలో పై ఆదేశాలను జారీ చేసింది.  అవసరార్ధం ఉద్యోగులందరు మొబైల్ ఫోన్లను ఉపయోగించేందుకు ప్రతి కార్యాలయంలోను ఒక మొబైల్ ఫోన్ అందుబాటులో ఉంచాలని చెప్పింది. అలాగే ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్లను స్విచ్చాఫ్ చేయటం, వైబ్రేషన్, సైలెంట్ మోడ్ లో పెట్టాలని ధర్మాసనం తీర్పిచ్చింది. వివిధ అవసరాల కోసం ఆఫీసులకు వచ్చే జనాలకు పనులు చేసిపెట్టడమే ఉద్యోగుల బాధ్యతగా కోర్టు స్పష్టంగా చెప్పింది.

ప్రతి ఆఫీసులోను క్లోక్ రూమ్ ఏర్పాటుచేసి ఉద్యోగుల ఫోన్లను అక్కడ ఉంచే ఏర్పాటు చేయాలన్నారు. కార్యాలయాల అధికారుల ఫోన్లను ఇతర ఉద్యోగులు కూడా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించాలని కోర్టు చెప్పింది. వీలైనంతలో సెల్ వాడకాన్ని పనివేళ్ళల్లో తగ్గించేందుకు ప్రభుత్వం వెంటనే చర్చలు తీసుకోవాలని ఆదేశించింది. తమ ఆదేశాలను నాలుగు వారాల్లో అమల్లోకి తీసుకురావటానికి ప్రభుత్వం అవసరమైన కార్యాచరణను రెడీ చేయాలని చెప్పింది. సస్పెన్షన్ కేసును విచారిస్తామని కూడా చెప్పింది. మొత్తం మీద మధురై ధర్మాసనం ఇచ్చిన తీర్పు అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో అయితే బాగుంటుంది.

Satya

Recent Posts

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

2 hours ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

3 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

4 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

5 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

6 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

7 hours ago