Trends

ఉక్రెయిన్ మెడికల్ విద్యర్ధులకు శుభవార్త

ఉక్రెయిన్లో మెడిసిన్ చదువుతున్న విద్యార్ధులకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా వేలాదిమంది విద్యార్ధులు తిరిగి మనదేశానికి వచ్చేస్తున్నారు. మనదేశం నుండి ఉక్రెయిన్కు వెళుతున్న విద్యార్ధుల్లో అత్యధికులు మెడిసిన్ చదవటానికే వెళుతున్నారు. ఆదేశంలో మెడిసిన కోర్టు ఆరేళ్ళు. తర్వాత రెండేళ్ళు పీజీ చదవాలి. అంటే ఎనిమిదేళ్ళు చదవాల్సిందే. తర్వాత సదరు విద్యార్ధులు మనదేశంలో డాక్టర్ గా ప్రాక్టీసు చేయాలంటే ఇక్కడ నిర్వహించే స్క్రీనింగ్ టెస్టుకు అప్పియరై పాసవ్వాల్సుంటుంది.

ప్రస్తుతం యుద్ధం కారణంగా చదవులు వదిలేసిన వేలాదిమంది మెడిసిన్ విద్యార్ధులు అర్ధాంతరంగా దేశానికి వచ్చేశారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. యుద్ధం ముగిసినా పూర్వపరిస్ధితి ఎప్పటికి వస్తుందో తెలీదు. ఎందుకంటే రష్యా దాడుల కారణంగా చాలా నగరాలు నేలమట్టమైపోయాయి. ఈ దాడుల్లో కాలేజీలు కూడా ధ్వంసమైపోయుంటాయి. కాబట్టి యుద్ధం ఆగిపోయినా కాలేజీలు తెరిచే అవకాశాలు దాదాపు తక్కువే. మళ్ళీ కాలేజీలు తెరవాలంటే చాలాకాలం పడుతుంది.

సో ఇఫుడిపుడే విద్యార్ధులు ఉక్రెయిన్ కు వెళ్ళి చదువుకునే అవకాశాలు దాదాపు లేదు. అందుకనే వీళ్ళ చదవు దెబ్బతినకుండా కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్, పీజీ చేస్తున్న విద్యార్ధులను దేశంలోని ప్రైవేటు కాలేజీల్లో సర్దుబాటు చేయాలని కేంద్రం డిసైడ్ అయ్యింది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నేషనల్ మెడికల్ కమీషన్, నీతిఅయోగ్, విదేశీ వ్యవహారాలు, వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కమిటి వేసింది.

విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇపుడున్న నిబంధనలను సడలించాలని కూడా కేంద్రం ఆదేశించింది. అయితే ఇక్కడో సమస్య మొదలవుతుంది. ఉక్రెయిన్ బాధితు విద్యార్ధులందరినీ ప్రైవేటుకాలేజీల్లో చేర్పించాలన్నది కేంద్రం ఆలోచన. అదే నిజమైతే కాలేజీ యాజమాన్యాలు డొనేషన్లు లేకుండా వీళ్ళని చేర్చుకుంటాయా ? మరో నాలుగైదు నెలలైపోతే ఎంబీబీఎస్, పీజీ చదవు అయిపోయేదని ఉక్రెయిన్లోని చాలామంది విద్యార్ధులు చెప్పారు. మరిపుడు వీళ్ళని మధ్యలో చేర్చుకుంటే మళ్ళీ వీళ్ళు మొదటినుండి చదవాల్సిందేనా ? అనే విషయంలో క్లారిటిలేదు. చూద్దాం ఉన్నతస్ధాయి కమిటి ఏమి చెబుతుందో ?

This post was last modified on March 5, 2022 3:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

37 minutes ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

3 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago