Trends

ఉక్రెయిన్ మెడికల్ విద్యర్ధులకు శుభవార్త

ఉక్రెయిన్లో మెడిసిన్ చదువుతున్న విద్యార్ధులకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా వేలాదిమంది విద్యార్ధులు తిరిగి మనదేశానికి వచ్చేస్తున్నారు. మనదేశం నుండి ఉక్రెయిన్కు వెళుతున్న విద్యార్ధుల్లో అత్యధికులు మెడిసిన్ చదవటానికే వెళుతున్నారు. ఆదేశంలో మెడిసిన కోర్టు ఆరేళ్ళు. తర్వాత రెండేళ్ళు పీజీ చదవాలి. అంటే ఎనిమిదేళ్ళు చదవాల్సిందే. తర్వాత సదరు విద్యార్ధులు మనదేశంలో డాక్టర్ గా ప్రాక్టీసు చేయాలంటే ఇక్కడ నిర్వహించే స్క్రీనింగ్ టెస్టుకు అప్పియరై పాసవ్వాల్సుంటుంది.

ప్రస్తుతం యుద్ధం కారణంగా చదవులు వదిలేసిన వేలాదిమంది మెడిసిన్ విద్యార్ధులు అర్ధాంతరంగా దేశానికి వచ్చేశారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. యుద్ధం ముగిసినా పూర్వపరిస్ధితి ఎప్పటికి వస్తుందో తెలీదు. ఎందుకంటే రష్యా దాడుల కారణంగా చాలా నగరాలు నేలమట్టమైపోయాయి. ఈ దాడుల్లో కాలేజీలు కూడా ధ్వంసమైపోయుంటాయి. కాబట్టి యుద్ధం ఆగిపోయినా కాలేజీలు తెరిచే అవకాశాలు దాదాపు తక్కువే. మళ్ళీ కాలేజీలు తెరవాలంటే చాలాకాలం పడుతుంది.

సో ఇఫుడిపుడే విద్యార్ధులు ఉక్రెయిన్ కు వెళ్ళి చదువుకునే అవకాశాలు దాదాపు లేదు. అందుకనే వీళ్ళ చదవు దెబ్బతినకుండా కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్, పీజీ చేస్తున్న విద్యార్ధులను దేశంలోని ప్రైవేటు కాలేజీల్లో సర్దుబాటు చేయాలని కేంద్రం డిసైడ్ అయ్యింది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నేషనల్ మెడికల్ కమీషన్, నీతిఅయోగ్, విదేశీ వ్యవహారాలు, వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కమిటి వేసింది.

విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇపుడున్న నిబంధనలను సడలించాలని కూడా కేంద్రం ఆదేశించింది. అయితే ఇక్కడో సమస్య మొదలవుతుంది. ఉక్రెయిన్ బాధితు విద్యార్ధులందరినీ ప్రైవేటుకాలేజీల్లో చేర్పించాలన్నది కేంద్రం ఆలోచన. అదే నిజమైతే కాలేజీ యాజమాన్యాలు డొనేషన్లు లేకుండా వీళ్ళని చేర్చుకుంటాయా ? మరో నాలుగైదు నెలలైపోతే ఎంబీబీఎస్, పీజీ చదవు అయిపోయేదని ఉక్రెయిన్లోని చాలామంది విద్యార్ధులు చెప్పారు. మరిపుడు వీళ్ళని మధ్యలో చేర్చుకుంటే మళ్ళీ వీళ్ళు మొదటినుండి చదవాల్సిందేనా ? అనే విషయంలో క్లారిటిలేదు. చూద్దాం ఉన్నతస్ధాయి కమిటి ఏమి చెబుతుందో ?

This post was last modified on March 5, 2022 3:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

1 hour ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

5 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

6 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

7 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

7 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

9 hours ago