Trends

ఉక్రెయిన్ మెడికల్ విద్యర్ధులకు శుభవార్త

ఉక్రెయిన్లో మెడిసిన్ చదువుతున్న విద్యార్ధులకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా వేలాదిమంది విద్యార్ధులు తిరిగి మనదేశానికి వచ్చేస్తున్నారు. మనదేశం నుండి ఉక్రెయిన్కు వెళుతున్న విద్యార్ధుల్లో అత్యధికులు మెడిసిన్ చదవటానికే వెళుతున్నారు. ఆదేశంలో మెడిసిన కోర్టు ఆరేళ్ళు. తర్వాత రెండేళ్ళు పీజీ చదవాలి. అంటే ఎనిమిదేళ్ళు చదవాల్సిందే. తర్వాత సదరు విద్యార్ధులు మనదేశంలో డాక్టర్ గా ప్రాక్టీసు చేయాలంటే ఇక్కడ నిర్వహించే స్క్రీనింగ్ టెస్టుకు అప్పియరై పాసవ్వాల్సుంటుంది.

ప్రస్తుతం యుద్ధం కారణంగా చదవులు వదిలేసిన వేలాదిమంది మెడిసిన్ విద్యార్ధులు అర్ధాంతరంగా దేశానికి వచ్చేశారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. యుద్ధం ముగిసినా పూర్వపరిస్ధితి ఎప్పటికి వస్తుందో తెలీదు. ఎందుకంటే రష్యా దాడుల కారణంగా చాలా నగరాలు నేలమట్టమైపోయాయి. ఈ దాడుల్లో కాలేజీలు కూడా ధ్వంసమైపోయుంటాయి. కాబట్టి యుద్ధం ఆగిపోయినా కాలేజీలు తెరిచే అవకాశాలు దాదాపు తక్కువే. మళ్ళీ కాలేజీలు తెరవాలంటే చాలాకాలం పడుతుంది.

సో ఇఫుడిపుడే విద్యార్ధులు ఉక్రెయిన్ కు వెళ్ళి చదువుకునే అవకాశాలు దాదాపు లేదు. అందుకనే వీళ్ళ చదవు దెబ్బతినకుండా కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్, పీజీ చేస్తున్న విద్యార్ధులను దేశంలోని ప్రైవేటు కాలేజీల్లో సర్దుబాటు చేయాలని కేంద్రం డిసైడ్ అయ్యింది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నేషనల్ మెడికల్ కమీషన్, నీతిఅయోగ్, విదేశీ వ్యవహారాలు, వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కమిటి వేసింది.

విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇపుడున్న నిబంధనలను సడలించాలని కూడా కేంద్రం ఆదేశించింది. అయితే ఇక్కడో సమస్య మొదలవుతుంది. ఉక్రెయిన్ బాధితు విద్యార్ధులందరినీ ప్రైవేటుకాలేజీల్లో చేర్పించాలన్నది కేంద్రం ఆలోచన. అదే నిజమైతే కాలేజీ యాజమాన్యాలు డొనేషన్లు లేకుండా వీళ్ళని చేర్చుకుంటాయా ? మరో నాలుగైదు నెలలైపోతే ఎంబీబీఎస్, పీజీ చదవు అయిపోయేదని ఉక్రెయిన్లోని చాలామంది విద్యార్ధులు చెప్పారు. మరిపుడు వీళ్ళని మధ్యలో చేర్చుకుంటే మళ్ళీ వీళ్ళు మొదటినుండి చదవాల్సిందేనా ? అనే విషయంలో క్లారిటిలేదు. చూద్దాం ఉన్నతస్ధాయి కమిటి ఏమి చెబుతుందో ?

This post was last modified on March 5, 2022 3:58 pm

Share

Recent Posts

జగన్ ఎలా అంటే కేటీఆర్ కూడా అలానే

జగన్ ఇటీవ‌ల కాలంలో స‌హ‌నం కోల్పోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌న పార్టీ వారిపై కేసులు పెట్టినా.. త‌మ…

9 minutes ago

అంజికి ఒడిస్సికి కనెక్షన్ ఏంటి

అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…

14 minutes ago

బుట్టబొమ్మకు ఏ ప్రయోజనం లేదు

బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…

1 hour ago

ఏడున్న‌ర గంట‌ల‌పాటు నిల‌బ‌డిన లోకేష్‌

ఒక గంట నిల‌బ‌డేందుకే ఇబ్బంది ప‌డ‌తాం. అలాంటిది ఏకంగా ఏడున్న‌ర‌గంట‌ల పాటు ఏక‌బిగిన నిల‌బ‌డ‌డం అంటే మాట‌లా? ఊహించేందుకే క‌ష్ట‌మైన…

1 hour ago

కనకవర్షం కురవాల్సిందే కనకరాజూ

కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…

2 hours ago

అంబటి నోటి దురుసు తగ్గేలా లేదు

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…

3 hours ago