Trends

పుతిన్ కు మోదీ ఫోన్… గుడ్ న్యూస్

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించడంతో అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, పౌరుల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. ఇప్పటికే, రష్యా సేనల దాడిలో కర్ణాటక విద్యార్థి నవీన్ మరణించగా…ఇతర కారణాలతో మరో విద్యార్థి మృతి చెందాడు. ‘ఆపరేషన్ గంగ’ ద్వారా వీలైనంత ఎక్కువమందిని వీలైనంత తక్కువ సమయంలో స్వదేశానికి చేరవేసేందుకు మోడీ సర్కార్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భారత ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడారు.

ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నగరంలో పరిస్థితిని ఇద్దరు నాయకులు సమీక్షించారని, అక్కడ చిక్కున్న భారతీయుల విషయంలో తాము సహకారం అందిస్తున్నామని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ వెల్లడించారు. యుద్ధ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి భారతీయ పౌరులను రష్యన్ భూభాగానికి తరలించే ఏర్పాటు చేస్తున్నామన్నారు.

అందుకోసం, ‘‘హ్యుమానిటేరియన్ కారిడార్’’ను రూపొందించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ  కారిడార్ ద్వారా ఖార్కివ్ నుంచి భారతీయుల బృందాన్ని అత్యవసరంగా తరలించాలని చూస్తున్నామన్నారు. అయితే, అలా తరలిస్తున్న విద్యార్థులను ఉక్రేనియన్ భద్రతా దళాలు బందీలుగా పట్టుకున్నాయని రష్యా మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ, భారత విద్యార్థులను ఉక్రెయిన్ ఆర్మీ బందీలుగా మార్చుకుందన్న వార్తలను ఇండియన్ ఎంబసీ తోసిపుచ్చింది.

మరోవైపు, ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడుల‌ను తీవ్ర‌త‌రం చేసింది. ప్ర‌భుత్వ ఆస్తులు, కార్యాల‌యాల‌తోపాటు జ‌నావాసాల‌పై కూడా దాడులు జరుపుతోంది. ఆసుప‌త్రులు, పాఠ‌శాల‌లు, భ‌వ‌నాలతోపాటు కీవ్లోని మెట్రో స్టేషన్ స‌మీపంలో నేడు భారీ పేలుళ్లు సంభ‌వించాయి. డ్రుబీ నరోదివ్ మెట్రో స్టేషన్ వద్ద పేలుళ్లు సంభ‌వించాయి. కీవ్ న‌గ‌రంపై ర‌ష్యా సేనలు బాంబుల వ‌ర్షం కురిపిస్తున్నాయి. ఖేర్సన్ నగరాన్ని రష్యా నేడు త‌మ అధీనంలోకి తెచ్చుకుంది.

This post was last modified on March 3, 2022 5:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago