ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్ కతేంటో చూడాలని అనుకున్న రష్యా సైనిక చర్యకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అనుమతించారు. దీనికి ప్రతిచర్యగా ఉక్రెయిన్ కూడా దాడికి సిద్ధమైపోయింది. తమ ఎయిర్ స్పేస్ ను ఉక్రెయిన్ మూసేసింది. ఒకవైపు ఉక్రెయిన్ కు మూడు వైపులా తన సైన్యాలను, యుద్ధ ట్యాంకులను, క్షిపణులను రష్యా అధ్యక్షుడు పుతిన్ మోహరిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 2 లక్షల సైన్యం ఉక్రెయిన్ను మూడువైపులా చుట్టుముట్టేశాయి. దీంతో ఉక్రెయిన్ పై రష్యా మిలిటరీ ఆపరేషన్ మొదలైందని స్వయంగా పుతినే ప్రకటించారు.
ఇదే సమయంలో ఉక్రెయిన్ కూడా తెగిస్తే తప్ప లాభం లేదని అనుకున్నట్లుంది. అందుకనే తనకున్న సైన్యాలకు ఎదురు దాడులు చేయమని ఆదేశించింది. నిజానికి సైనికపరంగా రష్యా ముందు ఏ విధంగా తీసుకున్నా ఉక్రెయిన్ సరిపడదని అందరికీ తెలుసు. కాకపోతే ఉక్రెయిన్ కు ధైర్యం ఏమిటంటే తనకు మద్దతుగా దిగిన నాటో దళాలే. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోలండ్ లాంటి దేశాల సైన్యాలు ఉక్రెయిన్ కు మద్దతుగా ఇప్పటికే ఉక్రెయిన్లోకి దిగేశాయి.
ఒక్క ఉక్రెయిన్లోనే కాకుండా రష్యా చుట్టుపక్కల దేశాల్లో కూడా నాటో దేశాల సైన్యం సర్వసిద్ధంగా దిగేశాయి. ఇదే సమయంలో దేశంలో నెల రోజుల పాటు ఉక్రెయిన్ ఎమర్జెన్సీ విధించింది. రష్యా సరిహద్దుల్లోని తన పౌరులను ఉక్రెయిన్ సురక్షిత ప్రాంతాలకు తీసుకెళిపోతోంది. దేశంలోని కీలక ప్రాంతాలన్నింటినీ సైన్యం తన చేతుల్లోకి తీసుకుంటోంది. సమస్యలను దౌత్యపరంగా పరిష్కరించుకోవటం ప్లాన్ ఏ అయితే తప్పనిసరిగా యుద్ధానికి దిగటం ప్లాన్ బీ. చివరకు ప్లాన్ బీ కే రష్యా మొగ్గుచూపింది.
ఉక్రెయిన్ సైన్యం సుమారుగా 2.5 లక్షలుంటుంది. రిజర్వ్ సైన్యం మరో 1.5 లక్షలుంది. ఇదే సమయంలో రష్యా సైన్యం సుమారు 16 లక్షలుంది. వైమానిక దళం, క్షిపణి వ్యవస్ధ, యుద్ధట్యాంకులు, ఇతరత్రా మిసైల్ గైడెడ్ క్షిపణి వ్యవస్ధ కూడా ఉక్రెయిన్ కు అందనంత ఎత్తులో రష్యా ఉంది. అయినా సరే రష్యాను చాలెంజ్ చేస్తోందంటే తనవెనకున్న నాటో దళాలను చూసుకునే అని అర్ధమవుతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
యద్ధం నేపథ్యంలో కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లు పతనంలో ఉన్నాయి. తాజాగా యుద్ధ ప్రకటన నేపథ్యంలో మరింత దారుణంగా కుప్పకూలాయి. ఈరోజు ఇండియన్ మార్కెట్లు అత్యంత ఎక్కువ ఫాల్ చూసింది. 3 శాతానికి పైగా నిఫ్టీ కుప్పకూలడం అసాధారణ విషయం అని చెప్పొచ్చు. చరిత్రలో అతి తక్కువ సార్లు మాత్రమే ఇలా జరిగింది.
This post was last modified on February 24, 2022 11:05 am
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…