అన్నింటా మాట్లాడే రారాజు మరియు మొనగాడు అయిన బైడెన్ ఇప్పుడు మాత్రం ఏం మాట్లాడితే ఏమౌతుందో అన్న స్ట్రాటజీలో ఉండిపోయారు.ఉండిపోతున్నారు కూడా! ఉక్రెయిన్ విషయమై రష్యాకు చెప్పి చూసిన మాటలేవీ ఫలించకపోవడంతో బైడెన్ నైరాశ్యంలో ఇరుక్కుపోయారు. తాము చెప్పినా కూడా, తాము వెనక్కు తగ్గాలని పదేపదే కోరినా కూడా రష్యా అస్సలు వినని నైజాన్ని బైడెన్ తట్టుకోలేకపోతున్నారు.నిన్న అర్ధరాత్రి దాటి వేళ కొన్ని దాడులు జరిగాయి తూర్పు ఉక్రెయిన్ పై..అయితే ఈ దాడుల్లో పెద్దగా ప్రాణహాని లేదు కానీ కొంత ఆస్తి ధ్వంసం ఉంది. తాము లక్ష మంది సైనికులను వెనక్కు పిలిచామని రష్యా చెబుతున్నా అవేవీ నిజాలు కావని అమెరికా కొట్టి పారేస్తుంది.
ఉక్రెయిన్ ఉదంతాల నేపథ్యంలో అమెరికా మాటకు ఇకపై విలువ ఉండదని తేలిపోయింది.దేశాల మధ్య తగాదాల్లో తలదూర్చి పెద్దన్న పాత్రను అందుకోవాలని తహతహలాడే అగ్ర రాజ్యానికి ఉక్రెయిన్ పరిణామం ఓ పెద్దపాఠం.ఆయుధాల వ్యాపారిగా పేరున్న అగ్ర రాజ్యాధిపతి పై ముందున్నంత గౌరవం కానీ భయం కానీ ఇవాళ అంతర్జాతీయంగా లేదు.
ఓ వైపు ఎదుగుతున్న దేశాల చెంత చేరి,తామూ ఎదిగిపోయాం అని అమెరికా చెప్పుకోవడం మినహా చేసిందేం లేదు.కొన్ని సందర్భాల్లో అస్సలు అమెరికా చెప్పినా కూడా రష్యా ఏ మాటనూ అంగీకరించలేదని పుతిన్ తో బైడెన్ మాట్లాడినా కూడా ఎటువంటి పురోగతీ లేకుండా పోయిందని తెలుస్తోంది.
ఎందుకంటే ఒకనాటి ఆర్థిక బలాలు కానీ మూలాలు కానీ ఇవాళ అమెరికాకు లేవు.ఆశించిన స్థాయిలో దేశం ప్రగతిలో లేదు. అంతర్జాతీయ వివాదాల్లో తలదూర్చి తద్వారా ఆర్థిక లబ్ధి పొందాలనుకోవడం, ఆయుధాల అమ్మకాలకు అదొక సందర్భంగా మలుచుకోవాలనుకోవడం ఓ పెద్ద తప్పిదం.ఈ దశలో అమెరికా ఒకప్పటిలా ప్రపంచంపై పట్టు పెంచుకోవాలన్న ఆలోచనలను విరమించుకునే దిశగా ఇవాళ ఉంది.ఓ విధంగా తిరోగామి దేశంగానే ఇవాళ అమెరికా ఉంది.కనుక తన మాట నెగ్గలేదన్న బాధ ఒక్కటే బైడెన్ కు మిగిలిపోయింది.సీమాంతర ఉగ్రవాదాన్నీ,ఇంకా చెప్పాలంటే వేర్పాటు వాదాన్నీ,దేశాల మధ్య రగిలే కలహాలనూ అడ్డుపెట్టుకుని అంతర్నాటకం నడిపే అమెరికాకు ఇప్పట్లో మరీ అంత సానుకూల ఫలితాలు అయితే వచ్చేలా లేవు.
This post was last modified on February 18, 2022 10:03 am
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…
తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…
ఇంగ్లండ్పై టీ20, వన్డే సిరీస్లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్…
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా…
గత కొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయంటూ పలు మీడియా కథనాలు బాగానే చక్కర్లు కొట్టాయి.…