Trends

ఈడీకి అంత ధైర్యం ఎలా వచ్చిందబ్బా ?

నిజంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చాలా ధైర్యం చేసిందనే చెప్పాలి. ముంబాయి ని ఏలుతున్న మాఫియా సామ్రాజ్యంలోని కీలక వ్యక్తుల ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు జరిపింది. సంవత్సరాల తరబడి మాఫియా సామ్రాజ్యంలోకి కీలక వ్యక్తులు వందలు, వేల కోట్ల రూపాయల అక్రమార్జన చేస్తున్నారు. ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, వ్యాపార, పారిశ్రామికవేత్తలను బెదిరించి, కిడ్నాప్ చేసి, హత్యలు చేసి తాము అనుకున్నంత డబ్బును యధేచ్చగా సంపాదించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.

పైకి నలుగురికి చెప్పుకోవాటనికి ఏదో వ్యాపారాలు చేస్తున్నట్లు షో చేస్తుంటారు. కానీ జరిగేదంతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలే అని అందరికీ తెలుసు. అయినా ఎవరూ వాళ్ళ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడరు. కేంద్రంలో, మహారాష్ట్రలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరుగుతున్నది మాత్రం దశాబ్దాలుగా ఇదే. ఇందుకనే దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ లాంటి వాళ్ళు కొందరు యువత దృష్టిలో హీరోలైపోయారు. గతంలో వేర్వేరు కేసుల్లో దావూద్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది.

అలా స్వాధీనం చేసుకున్న భూములు, భవనాలను వేలానికి పెడితే కొనటానికి భయపడి ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా దావూద్ పై జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దశాబ్దాలుగా దావూద్ అనేక రకాల నేరాలు చేస్తున్నా మొట్టమొదటిసారిగా ఎఫ్ఐఆర్ నమోదు కావడం గమనార్హం. దావూద్ కు చెందిన లేదా దావూద్ దగ్గరి బంధువులు, మద్దతుదారులవిగా గుర్తించిన ఇబ్రహీం కస్కర్, దివంగత హసీనా పార్కర్, చోటా షకీల్ లాంటి వాళ్ళకి చెందిన 10 చోట్ల ఈడీ ఉన్నతాధికారుల బృందాలు దాడులు చేశాయి.

దొరికిన ఆధారాల ప్రకారం మనీల్యాండరింగ్, హవాలా, ఎక్స్ టార్షన్ లాంటి అనేక కేసులు నమోదు చేశారు. ఇదే విషయమై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ దేశ భద్రత కోసం ఇలాంటి దాడులు చేయాల్సిందే అన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్ళపై దర్యాప్తు సంస్ధలు, విచారణ ఏజెన్సీలు కేసులు పెట్టాల్సిందే, కఠినంగా వ్యవహరించాల్సిందే అని స్పష్టంగా చెప్పారు. వీళ్ళ కార్యకలాపాలు అన్నీ తెలిసినా కేసులు పెట్టడానికే ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇక యాక్షన్ తీసుకోవటానికి ఎంతకాలం పడుతుందో ?

This post was last modified on February 16, 2022 10:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తండ్రి బాటలోనే పేర్ని కిట్టు

అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…

25 minutes ago

విస్మయపరిచే ‘రామ’ పరిచయం

బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…

4 hours ago

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

5 hours ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

9 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

11 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

14 hours ago