నిజంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చాలా ధైర్యం చేసిందనే చెప్పాలి. ముంబాయి ని ఏలుతున్న మాఫియా సామ్రాజ్యంలోని కీలక వ్యక్తుల ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు జరిపింది. సంవత్సరాల తరబడి మాఫియా సామ్రాజ్యంలోకి కీలక వ్యక్తులు వందలు, వేల కోట్ల రూపాయల అక్రమార్జన చేస్తున్నారు. ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, వ్యాపార, పారిశ్రామికవేత్తలను బెదిరించి, కిడ్నాప్ చేసి, హత్యలు చేసి తాము అనుకున్నంత డబ్బును యధేచ్చగా సంపాదించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.
పైకి నలుగురికి చెప్పుకోవాటనికి ఏదో వ్యాపారాలు చేస్తున్నట్లు షో చేస్తుంటారు. కానీ జరిగేదంతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలే అని అందరికీ తెలుసు. అయినా ఎవరూ వాళ్ళ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడరు. కేంద్రంలో, మహారాష్ట్రలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరుగుతున్నది మాత్రం దశాబ్దాలుగా ఇదే. ఇందుకనే దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ లాంటి వాళ్ళు కొందరు యువత దృష్టిలో హీరోలైపోయారు. గతంలో వేర్వేరు కేసుల్లో దావూద్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది.
అలా స్వాధీనం చేసుకున్న భూములు, భవనాలను వేలానికి పెడితే కొనటానికి భయపడి ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా దావూద్ పై జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దశాబ్దాలుగా దావూద్ అనేక రకాల నేరాలు చేస్తున్నా మొట్టమొదటిసారిగా ఎఫ్ఐఆర్ నమోదు కావడం గమనార్హం. దావూద్ కు చెందిన లేదా దావూద్ దగ్గరి బంధువులు, మద్దతుదారులవిగా గుర్తించిన ఇబ్రహీం కస్కర్, దివంగత హసీనా పార్కర్, చోటా షకీల్ లాంటి వాళ్ళకి చెందిన 10 చోట్ల ఈడీ ఉన్నతాధికారుల బృందాలు దాడులు చేశాయి.
దొరికిన ఆధారాల ప్రకారం మనీల్యాండరింగ్, హవాలా, ఎక్స్ టార్షన్ లాంటి అనేక కేసులు నమోదు చేశారు. ఇదే విషయమై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ దేశ భద్రత కోసం ఇలాంటి దాడులు చేయాల్సిందే అన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్ళపై దర్యాప్తు సంస్ధలు, విచారణ ఏజెన్సీలు కేసులు పెట్టాల్సిందే, కఠినంగా వ్యవహరించాల్సిందే అని స్పష్టంగా చెప్పారు. వీళ్ళ కార్యకలాపాలు అన్నీ తెలిసినా కేసులు పెట్టడానికే ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇక యాక్షన్ తీసుకోవటానికి ఎంతకాలం పడుతుందో ?
This post was last modified on February 16, 2022 10:51 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…