నిజంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చాలా ధైర్యం చేసిందనే చెప్పాలి. ముంబాయి ని ఏలుతున్న మాఫియా సామ్రాజ్యంలోని కీలక వ్యక్తుల ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు జరిపింది. సంవత్సరాల తరబడి మాఫియా సామ్రాజ్యంలోకి కీలక వ్యక్తులు వందలు, వేల కోట్ల రూపాయల అక్రమార్జన చేస్తున్నారు. ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, వ్యాపార, పారిశ్రామికవేత్తలను బెదిరించి, కిడ్నాప్ చేసి, హత్యలు చేసి తాము అనుకున్నంత డబ్బును యధేచ్చగా సంపాదించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.
పైకి నలుగురికి చెప్పుకోవాటనికి ఏదో వ్యాపారాలు చేస్తున్నట్లు షో చేస్తుంటారు. కానీ జరిగేదంతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలే అని అందరికీ తెలుసు. అయినా ఎవరూ వాళ్ళ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడరు. కేంద్రంలో, మహారాష్ట్రలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరుగుతున్నది మాత్రం దశాబ్దాలుగా ఇదే. ఇందుకనే దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ లాంటి వాళ్ళు కొందరు యువత దృష్టిలో హీరోలైపోయారు. గతంలో వేర్వేరు కేసుల్లో దావూద్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది.
అలా స్వాధీనం చేసుకున్న భూములు, భవనాలను వేలానికి పెడితే కొనటానికి భయపడి ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా దావూద్ పై జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దశాబ్దాలుగా దావూద్ అనేక రకాల నేరాలు చేస్తున్నా మొట్టమొదటిసారిగా ఎఫ్ఐఆర్ నమోదు కావడం గమనార్హం. దావూద్ కు చెందిన లేదా దావూద్ దగ్గరి బంధువులు, మద్దతుదారులవిగా గుర్తించిన ఇబ్రహీం కస్కర్, దివంగత హసీనా పార్కర్, చోటా షకీల్ లాంటి వాళ్ళకి చెందిన 10 చోట్ల ఈడీ ఉన్నతాధికారుల బృందాలు దాడులు చేశాయి.
దొరికిన ఆధారాల ప్రకారం మనీల్యాండరింగ్, హవాలా, ఎక్స్ టార్షన్ లాంటి అనేక కేసులు నమోదు చేశారు. ఇదే విషయమై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ దేశ భద్రత కోసం ఇలాంటి దాడులు చేయాల్సిందే అన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్ళపై దర్యాప్తు సంస్ధలు, విచారణ ఏజెన్సీలు కేసులు పెట్టాల్సిందే, కఠినంగా వ్యవహరించాల్సిందే అని స్పష్టంగా చెప్పారు. వీళ్ళ కార్యకలాపాలు అన్నీ తెలిసినా కేసులు పెట్టడానికే ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇక యాక్షన్ తీసుకోవటానికి ఎంతకాలం పడుతుందో ?
This post was last modified on February 16, 2022 10:51 am
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…