Trends

ఈడీకి అంత ధైర్యం ఎలా వచ్చిందబ్బా ?

నిజంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చాలా ధైర్యం చేసిందనే చెప్పాలి. ముంబాయి ని ఏలుతున్న మాఫియా సామ్రాజ్యంలోని కీలక వ్యక్తుల ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు జరిపింది. సంవత్సరాల తరబడి మాఫియా సామ్రాజ్యంలోకి కీలక వ్యక్తులు వందలు, వేల కోట్ల రూపాయల అక్రమార్జన చేస్తున్నారు. ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, వ్యాపార, పారిశ్రామికవేత్తలను బెదిరించి, కిడ్నాప్ చేసి, హత్యలు చేసి తాము అనుకున్నంత డబ్బును యధేచ్చగా సంపాదించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.

పైకి నలుగురికి చెప్పుకోవాటనికి ఏదో వ్యాపారాలు చేస్తున్నట్లు షో చేస్తుంటారు. కానీ జరిగేదంతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలే అని అందరికీ తెలుసు. అయినా ఎవరూ వాళ్ళ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడరు. కేంద్రంలో, మహారాష్ట్రలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరుగుతున్నది మాత్రం దశాబ్దాలుగా ఇదే. ఇందుకనే దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ లాంటి వాళ్ళు కొందరు యువత దృష్టిలో హీరోలైపోయారు. గతంలో వేర్వేరు కేసుల్లో దావూద్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది.

అలా స్వాధీనం చేసుకున్న భూములు, భవనాలను వేలానికి పెడితే కొనటానికి భయపడి ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా దావూద్ పై జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దశాబ్దాలుగా దావూద్ అనేక రకాల నేరాలు చేస్తున్నా మొట్టమొదటిసారిగా ఎఫ్ఐఆర్ నమోదు కావడం గమనార్హం. దావూద్ కు చెందిన లేదా దావూద్ దగ్గరి బంధువులు, మద్దతుదారులవిగా గుర్తించిన ఇబ్రహీం కస్కర్, దివంగత హసీనా పార్కర్, చోటా షకీల్ లాంటి వాళ్ళకి చెందిన 10 చోట్ల ఈడీ ఉన్నతాధికారుల బృందాలు దాడులు చేశాయి.

దొరికిన ఆధారాల ప్రకారం మనీల్యాండరింగ్, హవాలా, ఎక్స్ టార్షన్ లాంటి అనేక కేసులు నమోదు చేశారు. ఇదే విషయమై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ దేశ భద్రత కోసం ఇలాంటి దాడులు చేయాల్సిందే అన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్ళపై దర్యాప్తు సంస్ధలు, విచారణ ఏజెన్సీలు కేసులు పెట్టాల్సిందే, కఠినంగా వ్యవహరించాల్సిందే అని స్పష్టంగా చెప్పారు. వీళ్ళ కార్యకలాపాలు అన్నీ తెలిసినా కేసులు పెట్టడానికే ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇక యాక్షన్ తీసుకోవటానికి ఎంతకాలం పడుతుందో ?

This post was last modified on February 16, 2022 10:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

1 hour ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

1 hour ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

2 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

5 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

6 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

6 hours ago