ఆయనేమీ స్వీట్ 16 కాదు. నిజంగా 60 ఏళ్ల వయసున్న వాడు. ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా? 14 మందిని. అది కూడా ఏడు రాష్ట్రాల్లో. కేవలం పెళ్లి మాత్రమే కాకుండా వారి నుంచి డబ్బులు వసూలు చేసిన ఈ ఘరానా మోసగాడిని తాజాగా అరెస్టు చేశారు. ఒడిశాలోని కేంద్ర పారా జిల్లా పట్కురాకు చెందిన సదరు వ్యక్తి.. పెళ్లి చేసుకొని ఆ తర్వాత పరారైనట్లు తాజాగా వెళ్లడైంది. అంతేకాకుండా వ్యక్తి నిరుద్యోగ యువకులను, రుణాల మోసం తదితర ఆరోపణలపై హైదరాబాద్, ఎర్నాకులంలో రెండుసార్లు అరెస్టు అయ్యాడట.
నిందితుడు మధ్య వయస్కులైన ఒంటరి మహిళలు, ముఖ్యంగా విడాకులు తీసుకున్న వారి గురించి ఎక్కువగా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో వెతికేవాడని భువనేశ్వర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉమాశంకర్ దాస్ మాట్లాడుతూ.. నిందితుడు 1982లో తొలిసారి పెళ్లి చేసుకున్నాడని, 2002లో రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. రెండు పెళ్లిళ్ల తర్వాత ఐదుగురు పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు.
ఆ తర్వాత 2002-2020 వరకు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా మహిళలో పరిచయం పెంచుకొని.. ఇద్దరు భార్యలకు తెలియకుండా పలువురు మహిళలను పెళ్లి చేసుకున్నట్లు పేర్కొన్నారు. చివరిసారిగా ఢిల్లీలో స్కూల్ టీచర్గా పని చేస్తున్న ఓ మహిళను పెళ్లి చేసుకొని.. భువనేశ్వర్లో నివస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమెకు భర్త గత పెళ్లిళ్ల విషయం తెలియడంతో షాక్ గురైంది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిని అరెస్టు చేశారు.
నిందితుడు పెళ్లి తర్వాత వారి వద్ద నుంచి డబ్బులు తీసుకొని పారిపోయేవాడని పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి 11 ఏటీఎం కార్డులు, నాలుగు ఆధార్కార్డులు, ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్గా చెప్పుకొని లాయర్లను, ఫిజిషియన్లు విద్యావంతులైన మహిళలను పెళ్లాడేవాడు. అరెస్టయిన వ్యక్తి ఢిల్లీ, పంజాబ్, అసోం, జార్ఖండ్, ఒడిశా సహా ఏడు రాష్ట్రాలకు చెందిన మహిళలను మోసగించినట్లు పేర్కొన్నారు. మొదట పెళ్లి చేసుకున్న ఇద్దరిని ఒడిశాకు చెందిన వారని వివరించారు. గతేడాది జూలైలో అతని చివరి భార్య ఫిర్యాదు చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని డీసీపీ తెలిపారు.
This post was last modified on February 15, 2022 1:46 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…