Trends

గర్భిణీలకు SBI షాకింగ్ న్యూస్

మన దేశంలో మహిళలకు ఎనలేని గౌరవిస్తున్నామని, స్త్రీ అంటే ఆదిశక్తి స్వరూపమని, అబల కాదు సబల అని పొలిటిషన్లు, సెలబ్రిటీలు ఉపన్యాసాలలో ఎమోషన్ గా అంటుంటారు. అమ్మతనం అంటే చాలా గొప్పదని, మరణ వేదనతో సమానమైన ప్రసవవేదనను అనుభవిస్తూ భూదేవంత సహనాన్ని మాతృమూర్తులు కలిగి ఉంటారని గొప్పగా చెబుతుంటారు. గర్భవతులుగా ఉన్న మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే మనసున్న ఆటోవాలాలు కూడా ఉన్నారు.  

అయితే, మహిళలను…ప్రత్యేకించి గర్భిణులను ఇంతగా గౌరవించే ఇటువంటి దేశంలో తాజాగా ఎస్ బీఐ జారీ చేసిన ఉత్తర్వులు తీవ్రంగా అవమానించేలా ఉండడం చర్చనీయాంశమైంది. మహిళా ఉద్యోగుల నియామకానికి సంబంధించి  ఇటీవల ఎస్‌బీఐ జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. ఎస్ బీఐలో ఉద్యోగానికి ఎంపికైన వారు అప్పాయింట్ మెంట్ డేట్ నాటికి మూడు నెలల గర్భిణులుగా ఉంటే ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హులు అవుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం చర్చనీయాంశమైంది.

అయితే, ఇది తాత్కాలికంగా మాత్రమేనని, వారు బిడ్డకు జన్మనిచ్చిన నాలుగు నెలల తర్వాత ఉద్యోగంలో చేరేందుకు అనుమతిస్తామని ఎస్ బీఐ పేర్కొంది. గత నెల 31న ఈ ఉత్తర్వులు జారీ చేయగా…తాజాగా ఈ వ్యవహారంపై ఢిల్లీ మహిళా కమిషన్ మండిపడుతోంది. ఎస్‌బీఐ జారీ చేసిన ఈ వివాదాస్పద ఆదేశాలపై ఢిల్లీ మహిళా కమిషన్ ఫైర్ అయింది. ఈ ఆదేశాలు చట్టవిరుద్ధమని, వివక్షాపూరితంగా ఉన్నాయని పేర్కొంది.

ఈ మహిళా వ్యతిరేక ఉత్తర్వులను ఎస్ బీఐ తక్షణమే వెనక్కి తీసుకోవాల్సిందిగా ఎస్ బీఐను ఆదేశించామని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. దీంతో, ఈ ఉత్తర్వులపై నెటిజన్లు మండిపడుతున్నారు. పక్క దేశాల్లో మెటర్నిటీ లీవ్ లు పెంచుతూ పోతుంటే..మన దేశంలో మాత్రం ఈ రకంగా వివక్షా పూరితంగా వ్యవహరిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వ్యవహారంపై ఎస్ బీఐ ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on January 29, 2022 8:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

44 minutes ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

2 hours ago

కామారెడ్డిలో ఏం జరుగుతోంది?

కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…

2 hours ago

19 ఏళ్ల త‌ర్వాత‌.. అయేషా అంత్య‌క్రియ‌లు.. ఏం జరిగింది?

అయేషా మీరా. ఉమ్మ‌డి ఏపీలో 2007లో ఓ వ్య‌క్తి కామ దాహానికి బ‌లి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…

5 hours ago

ప్రభాస్ మాట సాయం… కపుల్ నడకలో వేగం

గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…

5 hours ago

ఆహా… కనులవిందుగా కమల్ & రజిని

గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…

5 hours ago