మన దేశంలో మహిళలకు ఎనలేని గౌరవిస్తున్నామని, స్త్రీ అంటే ఆదిశక్తి స్వరూపమని, అబల కాదు సబల అని పొలిటిషన్లు, సెలబ్రిటీలు ఉపన్యాసాలలో ఎమోషన్ గా అంటుంటారు. అమ్మతనం అంటే చాలా గొప్పదని, మరణ వేదనతో సమానమైన ప్రసవవేదనను అనుభవిస్తూ భూదేవంత సహనాన్ని మాతృమూర్తులు కలిగి ఉంటారని గొప్పగా చెబుతుంటారు. గర్భవతులుగా ఉన్న మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే మనసున్న ఆటోవాలాలు కూడా ఉన్నారు.
అయితే, మహిళలను…ప్రత్యేకించి గర్భిణులను ఇంతగా గౌరవించే ఇటువంటి దేశంలో తాజాగా ఎస్ బీఐ జారీ చేసిన ఉత్తర్వులు తీవ్రంగా అవమానించేలా ఉండడం చర్చనీయాంశమైంది. మహిళా ఉద్యోగుల నియామకానికి సంబంధించి ఇటీవల ఎస్బీఐ జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. ఎస్ బీఐలో ఉద్యోగానికి ఎంపికైన వారు అప్పాయింట్ మెంట్ డేట్ నాటికి మూడు నెలల గర్భిణులుగా ఉంటే ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హులు అవుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం చర్చనీయాంశమైంది.
అయితే, ఇది తాత్కాలికంగా మాత్రమేనని, వారు బిడ్డకు జన్మనిచ్చిన నాలుగు నెలల తర్వాత ఉద్యోగంలో చేరేందుకు అనుమతిస్తామని ఎస్ బీఐ పేర్కొంది. గత నెల 31న ఈ ఉత్తర్వులు జారీ చేయగా…తాజాగా ఈ వ్యవహారంపై ఢిల్లీ మహిళా కమిషన్ మండిపడుతోంది. ఎస్బీఐ జారీ చేసిన ఈ వివాదాస్పద ఆదేశాలపై ఢిల్లీ మహిళా కమిషన్ ఫైర్ అయింది. ఈ ఆదేశాలు చట్టవిరుద్ధమని, వివక్షాపూరితంగా ఉన్నాయని పేర్కొంది.
ఈ మహిళా వ్యతిరేక ఉత్తర్వులను ఎస్ బీఐ తక్షణమే వెనక్కి తీసుకోవాల్సిందిగా ఎస్ బీఐను ఆదేశించామని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. దీంతో, ఈ ఉత్తర్వులపై నెటిజన్లు మండిపడుతున్నారు. పక్క దేశాల్లో మెటర్నిటీ లీవ్ లు పెంచుతూ పోతుంటే..మన దేశంలో మాత్రం ఈ రకంగా వివక్షా పూరితంగా వ్యవహరిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వ్యవహారంపై ఎస్ బీఐ ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on January 29, 2022 8:21 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…