మన దేశంలో మహిళలకు ఎనలేని గౌరవిస్తున్నామని, స్త్రీ అంటే ఆదిశక్తి స్వరూపమని, అబల కాదు సబల అని పొలిటిషన్లు, సెలబ్రిటీలు ఉపన్యాసాలలో ఎమోషన్ గా అంటుంటారు. అమ్మతనం అంటే చాలా గొప్పదని, మరణ వేదనతో సమానమైన ప్రసవవేదనను అనుభవిస్తూ భూదేవంత సహనాన్ని మాతృమూర్తులు కలిగి ఉంటారని గొప్పగా చెబుతుంటారు. గర్భవతులుగా ఉన్న మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే మనసున్న ఆటోవాలాలు కూడా ఉన్నారు.
అయితే, మహిళలను…ప్రత్యేకించి గర్భిణులను ఇంతగా గౌరవించే ఇటువంటి దేశంలో తాజాగా ఎస్ బీఐ జారీ చేసిన ఉత్తర్వులు తీవ్రంగా అవమానించేలా ఉండడం చర్చనీయాంశమైంది. మహిళా ఉద్యోగుల నియామకానికి సంబంధించి ఇటీవల ఎస్బీఐ జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. ఎస్ బీఐలో ఉద్యోగానికి ఎంపికైన వారు అప్పాయింట్ మెంట్ డేట్ నాటికి మూడు నెలల గర్భిణులుగా ఉంటే ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హులు అవుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం చర్చనీయాంశమైంది.
అయితే, ఇది తాత్కాలికంగా మాత్రమేనని, వారు బిడ్డకు జన్మనిచ్చిన నాలుగు నెలల తర్వాత ఉద్యోగంలో చేరేందుకు అనుమతిస్తామని ఎస్ బీఐ పేర్కొంది. గత నెల 31న ఈ ఉత్తర్వులు జారీ చేయగా…తాజాగా ఈ వ్యవహారంపై ఢిల్లీ మహిళా కమిషన్ మండిపడుతోంది. ఎస్బీఐ జారీ చేసిన ఈ వివాదాస్పద ఆదేశాలపై ఢిల్లీ మహిళా కమిషన్ ఫైర్ అయింది. ఈ ఆదేశాలు చట్టవిరుద్ధమని, వివక్షాపూరితంగా ఉన్నాయని పేర్కొంది.
ఈ మహిళా వ్యతిరేక ఉత్తర్వులను ఎస్ బీఐ తక్షణమే వెనక్కి తీసుకోవాల్సిందిగా ఎస్ బీఐను ఆదేశించామని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. దీంతో, ఈ ఉత్తర్వులపై నెటిజన్లు మండిపడుతున్నారు. పక్క దేశాల్లో మెటర్నిటీ లీవ్ లు పెంచుతూ పోతుంటే..మన దేశంలో మాత్రం ఈ రకంగా వివక్షా పూరితంగా వ్యవహరిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వ్యవహారంపై ఎస్ బీఐ ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on January 29, 2022 8:21 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…