Trends

హెచ్ 1బీ వీసాలపై ట్రంప్ షాకింగ్ నిర్ణయం

మహమ్మారి వైరస్ బారినపడిన దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమైన సంగతి తెలిసిందే. అమెరికా వంటి అగ్రరాజ్యం కూడా కరోనా బారిన పడి విలవిలలాడుతోంది. దీంతో,అమెరికాలో నిరుద్యోగ స్థాయి పెరిగిపోయింది. మరోవైపు, ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి లోకల్ సెంటిమెంట్ ను అమెరికన్లలో బలంగా రాజేశారు.

దీంతో, భారత్ సహా విదేశాల నుంచి వచ్చి అమెరికాలో పనిచేసేవారిపై కొంత వివక్ష ఉంది. అందుకే, ట్రంప్…వీలు చిక్కినప్పుడల్లా హెచ్ 1 బీ వీసాల సంఖ్య తగ్గించడం…నిబంధనలు కఠినతరం చేయడం…వీలైతే ఆ వీసాలతోపాటు విదేశీయులకు అమెరికాలో ఉద్యోగాలిచ్చే అన్ని రకాల వీసాలు రద్దు చేయాలని కాచుకు కూర్చున్నాడు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు….తాజాగా కరోనా విపత్తు ట్రంప్ లోకల్ పైత్యానికి బలం చేకూర్చింది.

ఈ నేపథ్యంలోనే ట్రంప్ …హెచ్ 1 బీ వీసాలతోపాటు, అమెరికాలో విదేశీయులకు లభించే పలురకాల వీసాలను రద్దు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ పత్రిక ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనం ప్రకారం…ఆ వీసాల రద్దుకు ట్రంప్ మొగ్గుచూపుతున్నారని, అక్టోబర్ నాటికి తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

మహమ్మారి వైరస్ కారణంగా అమెరికాలో లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు. ఈ దశలో విదేశీయులకు ఉద్యోగాలకు అనుమతిస్తే అమెరికన్లలో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందని ట్రంప్ భావిస్తున్నారట. అందులోనూ త్వరలోనే జరగనున్న అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మరోసారి ట్రంప్ లోకల్ సెంటిమెంట్ నే నమ్ముకున్నారట. దీనికి తోడు కరోనాను ట్రంప్ లైట్ తీసుకున్నారని అమెరికన్లలో ట్రంప్ పై కోపం ఉంది.

దీనికి తోడు నల్లజాతీయులపై జాత్యాహంకార దాడుల వ్యవహారం అమెరికాను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ వీసాల రద్దు ప్రతిపాదనను ట్రంప్ తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. వాటి రద్దుతో అమెరికన్లలో సానుభూతి పొందవచ్చని ట్రంప్ యోచిస్తున్నారట. అందుకే, సస్పెన్షన్ ను ఎత్తివేసేంత వరకూ హెచ్-1బీ వీసాలను జారీ చేయరాదని ప్రభుత్వం భావిస్తోందని ఓ అధికారి అనధికారికంగా వెల్లడించారట.

అయితే, ఇప్పటికే వీసాలను పొంది, అమెరికాలో ఉద్యోగం చేస్తున్న విదేశీయులపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదని తెలుస్తోంది. వీసాల రద్దు నిర్ణయం అత్యధికంగా భారత సాఫ్ట్ వేర్ నిపుణులపైనే పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీసాలు రద్దయితే… అమెరికాలో ఉన్న భారతీయ ఉద్యోగులు, తమ ఉద్యోగాలను వదిలేసి స్వదేశానికి రావాల్సి వుంటుందని హెచ్చరిస్తున్నారు.

This post was last modified on June 14, 2020 10:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago