ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నీకి ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. పొట్టి ఫార్మాట్ క్రికెట్ లోకి ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల కన్నా లేటుగా అడుగుపెట్టిన భారత్….ఐపీఎల్ తో లేటెస్ట్ క్రేజ్ ను సంపాదించింది.
ముందొచ్చిన చెవులకంటే వెనుకొచ్చిన కొమ్ములువాడి అన్నట్టుగా బిగ్ బాష్ వంటి టీ20 లీగ్ లకు అందనంత ఎత్తుకు ఐపీఎల్ ఎదిగింది. ఐపీఎల్ సక్సెస్ రేట్ , క్రేజ్….మరే టీ20 క్రికెట్ లీగ్ కు లేవంటే అతిశయోక్తి కాదు. అందుకే, ఐపీఎల్ స్పాన్సర్ గా ఉండేందుకు బడా కార్పొరేట్ కంపెనీలు పోటీ పడుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీ స్పాన్సర్ షిప్ ను కార్పొరేట్ దిగ్గజం టాటా సొంతం చేసుకుంది.
తన పాత స్పాన్సర్ వివోకు ఐపీఎల్ టాటా చెప్పేసింది. ఐపీఎల్ 2022 సీజన్ నుంచి టాటా గ్రూప్ స్పాన్సర్ గా వ్యవహరించనుంది. పాత స్పాన్సర్ వివోతో ఐపీఎల్ ఒప్పందం 2021తో ముగిసిపోవడంతో కొత్త స్పాన్సర్ గా టాటా రంగంలోకి దిగింది. లీగ్ కొత్త స్పాన్సర్ గా టాటా గ్రూప్ వ్యవహరించనుందని ఐపీఎల్ చైర్మన్ బ్రజేష్ పటేల్ అధికారికంగా వెల్లడించారు. ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
అంతకుముందు, 2018-2022 వరకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం బీసీసీఐతో చైనీస్ దిగ్గజ కంపెనీ వివో రూ.2,200 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, 2020 సీజన్ సమయంలో భారత్, చైనాల మధ్య సరిహద్దు నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దీంతో, ఆ ఏడాది వివోను స్పాన్సర్ గా తప్పించారు. మరుసటి సీజన్ లో వివో మళ్లీ స్పాన్సర్ గా కొనసాగింది. అయితే, రాబోయే ఐదేళ్లకుగాను స్పాన్సర్ షిప్ కోసం టాటా ఎంత చెల్లించనుందో తెలియాల్సి ఉంది.
This post was last modified on January 11, 2022 10:39 pm
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…