ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నీకి ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. పొట్టి ఫార్మాట్ క్రికెట్ లోకి ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల కన్నా లేటుగా అడుగుపెట్టిన భారత్….ఐపీఎల్ తో లేటెస్ట్ క్రేజ్ ను సంపాదించింది.
ముందొచ్చిన చెవులకంటే వెనుకొచ్చిన కొమ్ములువాడి అన్నట్టుగా బిగ్ బాష్ వంటి టీ20 లీగ్ లకు అందనంత ఎత్తుకు ఐపీఎల్ ఎదిగింది. ఐపీఎల్ సక్సెస్ రేట్ , క్రేజ్….మరే టీ20 క్రికెట్ లీగ్ కు లేవంటే అతిశయోక్తి కాదు. అందుకే, ఐపీఎల్ స్పాన్సర్ గా ఉండేందుకు బడా కార్పొరేట్ కంపెనీలు పోటీ పడుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీ స్పాన్సర్ షిప్ ను కార్పొరేట్ దిగ్గజం టాటా సొంతం చేసుకుంది.
తన పాత స్పాన్సర్ వివోకు ఐపీఎల్ టాటా చెప్పేసింది. ఐపీఎల్ 2022 సీజన్ నుంచి టాటా గ్రూప్ స్పాన్సర్ గా వ్యవహరించనుంది. పాత స్పాన్సర్ వివోతో ఐపీఎల్ ఒప్పందం 2021తో ముగిసిపోవడంతో కొత్త స్పాన్సర్ గా టాటా రంగంలోకి దిగింది. లీగ్ కొత్త స్పాన్సర్ గా టాటా గ్రూప్ వ్యవహరించనుందని ఐపీఎల్ చైర్మన్ బ్రజేష్ పటేల్ అధికారికంగా వెల్లడించారు. ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
అంతకుముందు, 2018-2022 వరకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం బీసీసీఐతో చైనీస్ దిగ్గజ కంపెనీ వివో రూ.2,200 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, 2020 సీజన్ సమయంలో భారత్, చైనాల మధ్య సరిహద్దు నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దీంతో, ఆ ఏడాది వివోను స్పాన్సర్ గా తప్పించారు. మరుసటి సీజన్ లో వివో మళ్లీ స్పాన్సర్ గా కొనసాగింది. అయితే, రాబోయే ఐదేళ్లకుగాను స్పాన్సర్ షిప్ కోసం టాటా ఎంత చెల్లించనుందో తెలియాల్సి ఉంది.
This post was last modified on January 11, 2022 10:39 pm
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…
తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…
హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా సింగిల్ థియేటర్ల రెవెన్యూ విషయమై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఎంత గొడవ నడుస్తోందో తెలిసిందే.…
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…