ముస్లిం మహిళలను టార్గెట్ చేస్తూ రూపొందించిన బుల్లి బాయ్ యాప్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ముస్లిం మహిళల ఫొటోలను మార్ఫ్ చేసి వారిని వేలంపాట వేస్తున్నామంటూ యాప్ లో ఫొటోలు అప్ లోడ్ చేయడం సంచలనం రేపింది. ఈ వ్యవహారం వెనుక ఉన్న ఓ యువతితో పాటు ముగ్గురిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక, తాజాగా బుల్లి బాయ్ యాప్ సృష్టికర్తను ఢిల్లీ పోలీసులు అస్సాంలో అరెస్టు చేశారు. బుల్లి బాయ్ యాప్ ను రూపొందించిన 21 ఏళ్ల నీరజ్ బిష్ణోయ్ ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అస్పాంలోని దిగంబర్ జొర్హట్కు చెందిన నీరజ్ భోపాల్లోని వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన ఢిల్లీ పోలీసులు అస్సాంలో నీరజ్ ను అరెస్టు చేశారు. నీరజ్ తో పాటు ఓ డివైజ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డివైజ్ సాయంతోనే బుల్లి బాయ్ యాప్ ను నీరజ్ డెవలప్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అరెస్టు తర్వాత నీరజ్ ను ఢిల్లీకి తీసుకువచ్చి విచారణ చేయబోతున్నట్లు తెలుస్తోంది. గిట్ హబ్లో బుల్లి యాప్ తయారీదాచేయడంతో ప్రధాన నిందితుడు నీరజ్ అని పోలీసులు తెలిపారు. అంతకుముందు, ఈ కేసులో ఉత్తరాఖండ్కు చెందిన 19 ఏళ్ల యువతి శ్వేతా సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతోపాటు బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి విశాల్ కుమార్ ఝాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on January 6, 2022 8:56 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…