అరుదైన ఘటనగా దీన్ని చెప్పాలి. పుడుతూనే ఈ ఇద్దరు చిట్టి కవలలు రికార్డును క్రియేట్ చేశారు. వార్తల్లో వ్యక్తులయ్యారు. పుట్టింది కవలలుగానే అయినా.. వారిద్దరి బర్త్ డేట్ మాత్రమే కాదు.. బర్త్ ఇయర్ కూడా మారిపోయిన సిత్రం వీరి సొంతం. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. కలిసి పుట్టినప్పటికీ ఈ అన్నాచెల్లెళ్ల పుట్టిన ఏడాది మాత్రం మారిపోయిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకూ ఇదెలా సాధ్యమంటారా? వివరాల్లోకి వెళితే.. మీకే అర్థమవుతుంది.
కాలిఫోర్నియా రాష్ట్రంలోని గ్రీన్ ఫీల్డ్ సిటీకి చెందిన ఫాతిమా మాడ్రిగల్ కు డిసెంబరు 31న పురుటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను స్థానిక నతివిదాడ్ మెడికల్ సెంటర్ కు తరలించారు. అదే రోజు రాత్రి 11.45 గంటలలో తొలి కాన్పు అయ్యింది. పండంటి మగపిల్లాడు జన్మించాడు. కవలల్లో రెండో వారు లోకాన్ని చూసేసరికి అర్ధరాత్రి 12 గంటలైంది. దీంతో.. డేట్ మాత్రమే కాదు ఇయర్ కూడా మారిపోయింది.
కేవలం పదిహేను నిమిషాల తేడాతో పుట్టి నేపథ్యంలో వారిద్దరి పుట్టిన రోజు మాత్రమే కాదు.. సంవత్సరాలు కూడా మారిపోవటం ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని సదరు మెడికల్ సెంటర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకొంది. వారి ఫోటోల్ని అప్ లోడ్ చేయటంతో పాటు.. ఇద్దరు శిశువులు.. వారి తల్లి ఆరోగ్యంగా.. క్షేమంగా ఉన్నట్లు తెలపటంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఇలాంటి ఉదంతాలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయని చెబుతున్నారు.
ఇక.. ఈ చిట్టి కవలల తల్లి చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. తన కవలలు వేర్వేరు డేట్ లో.. అది కూడా వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన వైనం తనకు చాలా క్రేజీగా అనిపిస్తోందని పేర్కొన్నారు. ముందుగా పుట్టిన మగపిల్లాడికి ఆల్ఫ్రెడో.. తర్వాత పుట్టిన పాపకు ఆలీన్ అన్న పేర్లను పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ కవలలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తున్నారు. మొత్తానికి పుడుతూనే అరుదైన రికార్డును క్రియేట్ చేశారని చెప్పాలి.
This post was last modified on January 4, 2022 1:17 pm
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…