అరుదైన ఘటనగా దీన్ని చెప్పాలి. పుడుతూనే ఈ ఇద్దరు చిట్టి కవలలు రికార్డును క్రియేట్ చేశారు. వార్తల్లో వ్యక్తులయ్యారు. పుట్టింది కవలలుగానే అయినా.. వారిద్దరి బర్త్ డేట్ మాత్రమే కాదు.. బర్త్ ఇయర్ కూడా మారిపోయిన సిత్రం వీరి సొంతం. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. కలిసి పుట్టినప్పటికీ ఈ అన్నాచెల్లెళ్ల పుట్టిన ఏడాది మాత్రం మారిపోయిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకూ ఇదెలా సాధ్యమంటారా? వివరాల్లోకి వెళితే.. మీకే అర్థమవుతుంది.
కాలిఫోర్నియా రాష్ట్రంలోని గ్రీన్ ఫీల్డ్ సిటీకి చెందిన ఫాతిమా మాడ్రిగల్ కు డిసెంబరు 31న పురుటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను స్థానిక నతివిదాడ్ మెడికల్ సెంటర్ కు తరలించారు. అదే రోజు రాత్రి 11.45 గంటలలో తొలి కాన్పు అయ్యింది. పండంటి మగపిల్లాడు జన్మించాడు. కవలల్లో రెండో వారు లోకాన్ని చూసేసరికి అర్ధరాత్రి 12 గంటలైంది. దీంతో.. డేట్ మాత్రమే కాదు ఇయర్ కూడా మారిపోయింది.
కేవలం పదిహేను నిమిషాల తేడాతో పుట్టి నేపథ్యంలో వారిద్దరి పుట్టిన రోజు మాత్రమే కాదు.. సంవత్సరాలు కూడా మారిపోవటం ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని సదరు మెడికల్ సెంటర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకొంది. వారి ఫోటోల్ని అప్ లోడ్ చేయటంతో పాటు.. ఇద్దరు శిశువులు.. వారి తల్లి ఆరోగ్యంగా.. క్షేమంగా ఉన్నట్లు తెలపటంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఇలాంటి ఉదంతాలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయని చెబుతున్నారు.
ఇక.. ఈ చిట్టి కవలల తల్లి చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. తన కవలలు వేర్వేరు డేట్ లో.. అది కూడా వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన వైనం తనకు చాలా క్రేజీగా అనిపిస్తోందని పేర్కొన్నారు. ముందుగా పుట్టిన మగపిల్లాడికి ఆల్ఫ్రెడో.. తర్వాత పుట్టిన పాపకు ఆలీన్ అన్న పేర్లను పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ కవలలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తున్నారు. మొత్తానికి పుడుతూనే అరుదైన రికార్డును క్రియేట్ చేశారని చెప్పాలి.
This post was last modified on January 4, 2022 1:17 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…