Trends

థర్డ్ వేవ్ ఎంతకాలం ఉంటుందో తెలుసా?

మన దేశంలో థర్డ్ వేవ్ ఎంతకాలం ఉంటుందో తెలుసా ? నాలుగు నెలలవరకు థర్డ్ వేవ్ ప్రభావం ఉంటుందని కాన్పూర్ ఐఐటి ప్రొఫెసర్ మహేంద్ర అగర్వాల్ చెప్పారు. ఇపుడు జనవరిలో మొదలైన థర్డ్ వేవ్ ప్రభావం ఏప్రిల్ వరకు కంటిన్యు అవుతందని చెప్పిన మాట సంచలనంగా మారింది. పైగా రోజుకు 1.8 లక్షల కేసులు నమోదవుతాయని ప్రొఫెసర్ అంచనా వేశారు. రోజుకు 1.8 లక్షల కేసులు నమోదైనా ఆసుపత్రుల్లో చేరే వారిసంఖ్య తక్కువగానే ఉండచ్చని చెప్పి కాస్త ఊరటకలిగించారు.

తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలే సూపర్ స్ప్రెడర్లుగా మారుతాయని అగర్వాల్ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో బహిరంగసభలు, ర్యాలీలు, రోడ్డుషోలు నిర్వహించటం చాలా ప్రమాదకరమని కూడా చెప్పారు. గతంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికల సమయంలో ఏమి జరిగిందో అందరు గుర్తుంచుకోవాలని ప్రొఫెసర్ చెప్పారు. అప్పట్లో కరోనా వైరస్ తీవ్రతను ఎవరు పట్టించుకోకుండా ర్యాలీలు, రోడ్డుషోలు, బహిరంగసభలకు జనాలను తరలించిన కారణంగానే దేశంలో సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారిందన్నారు.

ఎన్నికల సమయంలో కోవిడ్ నిబందనలు పాటించటం ఎవరికీ సాధ్యం కాదని కూడా అగర్వాల్ చెప్పారు. మార్చి నాటికి దేశం మొత్తంమీద 2 లక్షల పడకలు అవసరమవుతాయని కూడా ప్రొఫెసర్ ముందుగానే హెచ్చరించారు. సెకండ్ వేవ్ లో వచ్చినట్లు ఆక్సిజన్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపైనే ఉందని గట్టిగా చెప్పారు. పనిలో పనిగా అగర్వాల్ ఒక మంచి మాట కూడా చెప్పారు.

అదేమిటంటే మనదేశంలోని జనాభాకు రోగనిరోధక శక్తి చాలా ఎక్కువట. ఆఫ్రికాతో పాటు భారత్ లోని 80 శాతం జనాభా 45 ఏళ్ళలోపు వారేఅని అగర్వాల్ చెప్పారు. దీనివల్లే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉందన్నారు. ఏదేమైనా దేశంలో ఇపుడందరు ఐదు రాష్ట్రాల ఎన్నికల వైపే చూస్తున్నారు. థర్డ్ వేవ్ ఎక్కడ కమ్ముకుంటుందో అనే టెన్షన్ పెరిగిపోతోంది. ఈ భయంలోనే అలహాబాద్ హైకోర్టు కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికలను వాయిదా వేయమని కేంద్ర ఎన్నికల కమీషన్ కు సూచించింది. ఎందుకంటే దేశంలోనే అత్యధిక జనాభా అంటే 24 కోట్లున్నది యూపీలో మాత్రమే. ఇక్కడ గనుక థర్డ్ వేవ్ అంటుకున్నదంటే అంతే సంగతులు.

This post was last modified on January 4, 2022 11:54 am

Share
Show comments

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

47 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago