Trends

కిమ్ కు ఏమైంది ?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కమ్ నియంత కిమ్ కు ఏమైంది ? ఇపుడిదే అంశం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపడేట్లు చేస్తోంది. కిమ్ అంటే భారీ ఆకారంతో ఉంటారని అందరికీ తెలిసిందే.  కానీ తాజాగా విడుదలైన ఆయన ఫొటోలు చూసిన తర్వాత బాగా సన్నబడిపోయి స్లిమ్ముగా తయారయ్యారంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. కొందరేమో కిమ్ తీవ్ర అనారోగ్యంగా ఉన్నారని అంటున్నారు. మరికొందరేమో తన భారీ కాయాన్ని తగ్గించుకునేందుకు అద్యక్షుడు డైటింగ్ చేస్తున్నారని చెబుతున్నారు.

తాజాగా కొందరు అధికారులు మాత్రం తినటానికి తిండి దొరకని కారణంగానే కిమ్ బాగా సన్నబడిపోయినట్లు తెగ బాధపడిపోతున్నారు. అయితే తాజా కారణాన్ని ఎవరు నమ్మటం లేదులేండి. ఇక్కడ ఒక కారణమైతే అంగీకరించాల్సిందే. అదేమిటంటే ఉత్తరకొరియా తీవ్రమైన ఆర్ధిక, ఆహార సంక్షోభంలో ఉన్నదైతే వాస్తవం. కిమ్ ఒంటెత్తు పోకడల కారణంగా ఉత్తరకొరియాపై చాలా దేశాలు అనేక ఆంక్షలు విధించాయి. దీంతో అనేక రకాలుగా దేశంలో సంక్షోభం పెరిగిపోతోంది.

దీనికితోడు ఇటీవల సంభవించిన భారీ వరదలు, ప్రకృతి విపత్తులు దేశాన్ని అతలాకుతలం చేసేసింది. దీని వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఒక్కసారిగా దెబ్బతినేశాయి. దీని కారణంగా ప్రజలకు మూడుపూటలా కడుపునిండా  తినడానికి తిండి దొరకటం లేదన్నది నిజం. ప్రజలు కడుపునిండా తిండి తినలేకపోతున్నారు కాబట్టి తమ అధ్యక్షుడు సరిగా తిండితినటం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే విదేశాలు దీన్ని పెద్ద జోక్ గా కొట్టిపారేస్తున్నాయి.

కిమ్ మనస్తత్వం ప్రకారం ఎవరికి తిండున్నా లేకపోయినా తన తిండిని మాత్రం తగ్గించరు. కిమ్ వంశంలో ఇప్పటికే అనేకమంది గుండెపోటుతో చనిపోయారట. ఇపుడు కిమ్ కూడా తిండి తగ్గించని కారణంగానే  అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఇప్పటికే డాక్టర్లు అధ్యక్షుడికి చెప్పారట. దాని కారణంగానే కిమ్ డైట్ ను పాటించటం వల్లే బాగా స్లిమ్ గా కనిపిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. కారణాలు ఏవైనా కానీండి కిమ్ కు ఏమైందనే ఆందోళనైతే ప్రపంచదేశాల్లో పెరిగిపోతోంది.

This post was last modified on January 3, 2022 5:21 pm

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

41 minutes ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

2 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

2 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

2 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

3 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

4 hours ago