ఉత్తర కొరియా అధ్యక్షుడు కమ్ నియంత కిమ్ కు ఏమైంది ? ఇపుడిదే అంశం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపడేట్లు చేస్తోంది. కిమ్ అంటే భారీ ఆకారంతో ఉంటారని అందరికీ తెలిసిందే. కానీ తాజాగా విడుదలైన ఆయన ఫొటోలు చూసిన తర్వాత బాగా సన్నబడిపోయి స్లిమ్ముగా తయారయ్యారంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. కొందరేమో కిమ్ తీవ్ర అనారోగ్యంగా ఉన్నారని అంటున్నారు. మరికొందరేమో తన భారీ కాయాన్ని తగ్గించుకునేందుకు అద్యక్షుడు డైటింగ్ చేస్తున్నారని చెబుతున్నారు.
తాజాగా కొందరు అధికారులు మాత్రం తినటానికి తిండి దొరకని కారణంగానే కిమ్ బాగా సన్నబడిపోయినట్లు తెగ బాధపడిపోతున్నారు. అయితే తాజా కారణాన్ని ఎవరు నమ్మటం లేదులేండి. ఇక్కడ ఒక కారణమైతే అంగీకరించాల్సిందే. అదేమిటంటే ఉత్తరకొరియా తీవ్రమైన ఆర్ధిక, ఆహార సంక్షోభంలో ఉన్నదైతే వాస్తవం. కిమ్ ఒంటెత్తు పోకడల కారణంగా ఉత్తరకొరియాపై చాలా దేశాలు అనేక ఆంక్షలు విధించాయి. దీంతో అనేక రకాలుగా దేశంలో సంక్షోభం పెరిగిపోతోంది.
దీనికితోడు ఇటీవల సంభవించిన భారీ వరదలు, ప్రకృతి విపత్తులు దేశాన్ని అతలాకుతలం చేసేసింది. దీని వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఒక్కసారిగా దెబ్బతినేశాయి. దీని కారణంగా ప్రజలకు మూడుపూటలా కడుపునిండా తినడానికి తిండి దొరకటం లేదన్నది నిజం. ప్రజలు కడుపునిండా తిండి తినలేకపోతున్నారు కాబట్టి తమ అధ్యక్షుడు సరిగా తిండితినటం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే విదేశాలు దీన్ని పెద్ద జోక్ గా కొట్టిపారేస్తున్నాయి.
కిమ్ మనస్తత్వం ప్రకారం ఎవరికి తిండున్నా లేకపోయినా తన తిండిని మాత్రం తగ్గించరు. కిమ్ వంశంలో ఇప్పటికే అనేకమంది గుండెపోటుతో చనిపోయారట. ఇపుడు కిమ్ కూడా తిండి తగ్గించని కారణంగానే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఇప్పటికే డాక్టర్లు అధ్యక్షుడికి చెప్పారట. దాని కారణంగానే కిమ్ డైట్ ను పాటించటం వల్లే బాగా స్లిమ్ గా కనిపిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. కారణాలు ఏవైనా కానీండి కిమ్ కు ఏమైందనే ఆందోళనైతే ప్రపంచదేశాల్లో పెరిగిపోతోంది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…