ఉత్తర కొరియా అధ్యక్షుడు కమ్ నియంత కిమ్ కు ఏమైంది ? ఇపుడిదే అంశం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపడేట్లు చేస్తోంది. కిమ్ అంటే భారీ ఆకారంతో ఉంటారని అందరికీ తెలిసిందే. కానీ తాజాగా విడుదలైన ఆయన ఫొటోలు చూసిన తర్వాత బాగా సన్నబడిపోయి స్లిమ్ముగా తయారయ్యారంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. కొందరేమో కిమ్ తీవ్ర అనారోగ్యంగా ఉన్నారని అంటున్నారు. మరికొందరేమో తన భారీ కాయాన్ని తగ్గించుకునేందుకు అద్యక్షుడు డైటింగ్ చేస్తున్నారని చెబుతున్నారు.
తాజాగా కొందరు అధికారులు మాత్రం తినటానికి తిండి దొరకని కారణంగానే కిమ్ బాగా సన్నబడిపోయినట్లు తెగ బాధపడిపోతున్నారు. అయితే తాజా కారణాన్ని ఎవరు నమ్మటం లేదులేండి. ఇక్కడ ఒక కారణమైతే అంగీకరించాల్సిందే. అదేమిటంటే ఉత్తరకొరియా తీవ్రమైన ఆర్ధిక, ఆహార సంక్షోభంలో ఉన్నదైతే వాస్తవం. కిమ్ ఒంటెత్తు పోకడల కారణంగా ఉత్తరకొరియాపై చాలా దేశాలు అనేక ఆంక్షలు విధించాయి. దీంతో అనేక రకాలుగా దేశంలో సంక్షోభం పెరిగిపోతోంది.
దీనికితోడు ఇటీవల సంభవించిన భారీ వరదలు, ప్రకృతి విపత్తులు దేశాన్ని అతలాకుతలం చేసేసింది. దీని వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఒక్కసారిగా దెబ్బతినేశాయి. దీని కారణంగా ప్రజలకు మూడుపూటలా కడుపునిండా తినడానికి తిండి దొరకటం లేదన్నది నిజం. ప్రజలు కడుపునిండా తిండి తినలేకపోతున్నారు కాబట్టి తమ అధ్యక్షుడు సరిగా తిండితినటం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే విదేశాలు దీన్ని పెద్ద జోక్ గా కొట్టిపారేస్తున్నాయి.
కిమ్ మనస్తత్వం ప్రకారం ఎవరికి తిండున్నా లేకపోయినా తన తిండిని మాత్రం తగ్గించరు. కిమ్ వంశంలో ఇప్పటికే అనేకమంది గుండెపోటుతో చనిపోయారట. ఇపుడు కిమ్ కూడా తిండి తగ్గించని కారణంగానే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఇప్పటికే డాక్టర్లు అధ్యక్షుడికి చెప్పారట. దాని కారణంగానే కిమ్ డైట్ ను పాటించటం వల్లే బాగా స్లిమ్ గా కనిపిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. కారణాలు ఏవైనా కానీండి కిమ్ కు ఏమైందనే ఆందోళనైతే ప్రపంచదేశాల్లో పెరిగిపోతోంది.
This post was last modified on January 3, 2022 5:21 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…