ఈ రోజు సమావేశమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో మూడో ఘాట్ రోడ్డు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. పదకవితా పితామహుడిగా ఖ్యాతి గడించిన అన్నమయ్య పేరును ఆ మార్గానికి పెట్టాలని నిర్ణయించింది. అన్నమయ్య నడిచి తిరుమలకు చేరుకున్న ఆ మార్గాన్ని అభివృద్ధి చేయాలని టీటీడీ సంకల్పించింది. అన్నమయ్య ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తే తిరుపతికి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా తిరుమలలోని తుంబూరు కోనకు చేరుకోవచ్చు.
రేణిగుంట మండలంలోని కరకంబాడీ-బాలపల్లి నుంచి అన్నమయ్య ఘాట్ రోడ్డు మార్గం మొదలవుతుంది. ఆల్రెడీ ఈ మార్గం ద్వారా కడప జిల్లాకు చెందిన భక్తులు తిరుమల కొండకు వస్తుంటారు. ఈ మార్గంలో ఇప్పటికే శతాబ్దాల క్రితం యాత్రికుల కోసం ఏర్పాటైన సత్రాలు కనిపిస్తుంటాయి. కానీ, ఈ మార్గంలో ఒంటరిగా వెళ్లడం శ్రేయస్కరం కాకపోవడంతో దీనికి అంత గుర్తింపు రాలేదు. అయితే, టీటీడీ ఈ మార్గాన్ని అభివృద్ది చేయడం వల్ల భవిష్యత్తులో భక్తులు పెద్ద సంఖ్యలో ఈ మార్గాన్ని వినియోగించుకునే అవకామశముంది.
దీంతోపాటు, టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 10 రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. కోవిడ్ తీవ్రత తగ్గితే సంక్రాంతి తర్వాత సర్వదర్శనం పెంపు, ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామన్నారు.
చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి విరాళాలు అందించిన భక్తులుకు ఉదయాస్తమాన సేవకు అనుమతిస్తామన్నారు. నాదనీరాజనం మండపం దగ్గర శాశ్వత ప్రాతిపాదికన మండపాన్ని నిర్మిస్తామన్నారు. రూ. 3 కోట్ల రూపాయల వ్యయంతో వసతి గదుల్లో గీజర్లు ఏర్పాటు చేస్తామన్నారు. టీటీడీ ఐటీ వింగ్ కోసం అర్హత కలిగిన ఉద్యోగులతో ప్రత్యేక టీటీడీ ఐటీ వింగ్ ఏర్పాటు చేస్తామని వైవీ చెప్పారు.
This post was last modified on December 11, 2021 10:36 pm
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…
తెలుగు రాజకీయాల్లో కొడాలి నానిది ఓ డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్ధులపై దూకుడుగా మాట్లాడే ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.…
పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గ ధామంగా మారుతుందని.. మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి.. పెట్టుబడి దారులతో…