Trends

తిరుమలకు మరో ఘాట్ రోడ్డు…టీటీడీ సంచలన నిర్ణయం

ఈ రోజు సమావేశమైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో మూడో ఘాట్ రోడ్డు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. ప‌ద‌క‌వితా పితామ‌హుడిగా ఖ్యాతి గడించిన అన్న‌మ‌య్య పేరును ఆ మార్గానికి పెట్టాలని నిర్ణయించింది. అన్నమయ్య న‌డిచి తిరుమ‌ల‌కు చేరుకున్న ఆ మార్గాన్ని అభివృద్ధి చేయాలని టీటీడీ సంకల్పించింది. అన్నమయ్య ఘాట్ రోడ్డులో ప్ర‌యాణిస్తే తిరుప‌తికి వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా నేరుగా తిరుమ‌ల‌లోని తుంబూరు కోన‌కు చేరుకోవచ్చు.

రేణిగుంట మండ‌లంలోని క‌ర‌కంబాడీ-బాల‌ప‌ల్లి నుంచి అన్నమయ్య ఘాట్ రోడ్డు మార్గం మొదలవుతుంది. ఆల్రెడీ ఈ మార్గం ద్వారా క‌డ‌ప జిల్లాకు చెందిన భ‌క్తులు తిరుమ‌ల కొండ‌కు వస్తుంటారు. ఈ మార్గంలో ఇప్పటికే శ‌తాబ్దాల క్రితం యాత్రికుల కోసం ఏర్పాటైన స‌త్రాలు కనిపిస్తుంటాయి. కానీ, ఈ మార్గంలో ఒంట‌రిగా వెళ్లడం శ్రేయ‌స్కరం కాకపోవడంతో దీనికి అంత గుర్తింపు రాలేదు. అయితే, టీటీడీ ఈ మార్గాన్ని అభివృద్ది చేయడం వల్ల భవిష్యత్తులో భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో ఈ మార్గాన్ని వినియోగించుకునే అవకామశముంది.

దీంతోపాటు, టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 10 రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. కోవిడ్ తీవ్రత తగ్గితే సంక్రాంతి తర్వాత సర్వదర్శనం పెంపు, ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామన్నారు.

చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి విరాళాలు అందించిన భక్తులుకు ఉదయాస్తమాన సేవకు అనుమతిస్తామన్నారు. నాదనీరాజనం మండపం దగ్గర శాశ్వత ప్రాతిపాదికన మండపాన్ని నిర్మిస్తామన్నారు. రూ. 3 కోట్ల రూపాయల వ్యయంతో వసతి గదుల్లో గీజర్లు ఏర్పాటు చేస్తామన్నారు. టీటీడీ ఐటీ వింగ్ కోసం అర్హత కలిగిన ఉద్యోగులతో ప్రత్యేక టీటీడీ ఐటీ వింగ్ ఏర్పాటు చేస్తామని వైవీ చెప్పారు.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

15 minutes ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

25 minutes ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

2 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

2 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

2 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

3 hours ago