సెల్ ఫోన్లు వచ్చిన మొదట్లో ఒకట్రెండు సిమ్ లకు మించి ఉండేవి కావు. తర్వాతి కాలంలో ఎవరికి వారే కాదు.. ఇంట్లో వారి కోసం.. పెద్ద ఎత్తున సిమ్ లు కొనేసే పరిస్థితి. ఆ మాటకు వస్తే.. చేతిలో ఉండే ఫోన్లో రెండు సిమ్ లు.. చాలామందికి ఉండే మరో ఫోన్ లో మరో రెండు కానీ ఒక సిమ్ కాని ఉండటం ఈ మధ్యన ఎక్కువగా కనిపిస్తుంటుంది. జియో ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. మిగిలిన సిమ్ లు ఎలా ఉన్నా.. జియో సిమ్ ఒకటి ఉంచుకోవటం ఒక అలవాటుగా మారింది.
అయితే.. తమ సొంతానికి.. తమ ఇంట్లో వారి కోసం సిమ్ లు కొనేయటం.. వాటిని అప్పుడప్పుడు వాడే వారు కొంతమంది ఉంటారు. కానీ.. మీ పేరు మీద ఉన్న సిమ్ కార్డుల లెక్కను ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఒకరి పేరు మీద తొమ్మిది సిమ్ కార్డులు ఉంటే.. చర్యలు తీసుకోవడం కోసం తాజాగా డిసైడ్ చేశారు. తాజాగా టెలికాం శాఖ ఆదేశాల్ని చూసినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.
సిమ్ కార్డు కనెక్షన్ ఒక్కరి పేరు మీద తొమ్మిది సిమ్ లు ఉంటే.. వాటిని మళ్లీ ధ్రువీకరించు కోవాల్సి ఉంటుంది. ఒకవేళ ధ్రువీకరణ లేకపోతే.. సదరు సిమ్ లను తొలగించనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని వారికి 9 సిమ్ కార్డుల పరిమితి ఉంటే.. జమ్ముకశ్మీర్.. ఈశాన్య రాష్ట్రాలతో పాటు.. అసోంలో ఉండే వారికి మాత్రం ఈ పరిమితి ఆరుకు మాత్రమే. తమకున్న సిమ్ కార్డుల్లో వేటిని యాక్టివ్ చేసుకోవాలి? వేటిని డీయాక్టివేట్ చేసుకోవాలన్నది ఇప్పుడు తేల్చుకోవాలని చెబుతున్నారు.
ఇదంతా ఎందుకంటే ఆర్థిక నేరాలు.. ఇబ్బంది పెట్టే కాల్స్.. మోసపూరిత చర్యల కోసం సిమ్ లను విరివిరిగా వాడేస్తున్న వారికి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తాజా ఆదేశాల ప్రకారం ఒక వ్యక్తిగత చందాదారు వద్ద తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ లు ఉండి ఉంటే.. వెంటనే వారు వాటిని తిరిగి ధ్రువీకరించేందుకు ప్లాగ్ చేయాలని నిర్ణయించారు. ఇలాంటి వారి కనెక్షన్లకు అవుట్ గోయింగ్ సదుపాయాన్ని 30 రోజుల్లో నిలిపివేయాలని నిర్ణయించారు. ఇన్ కమింగ్ కాల్స్ సదుపాయాన్ని 45 రోజుల్లోపు తొలగించాలని డిసైడ్ చేశారు.
This post was last modified on December 9, 2021 10:40 am
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…