సెల్ ఫోన్లు వచ్చిన మొదట్లో ఒకట్రెండు సిమ్ లకు మించి ఉండేవి కావు. తర్వాతి కాలంలో ఎవరికి వారే కాదు.. ఇంట్లో వారి కోసం.. పెద్ద ఎత్తున సిమ్ లు కొనేసే పరిస్థితి. ఆ మాటకు వస్తే.. చేతిలో ఉండే ఫోన్లో రెండు సిమ్ లు.. చాలామందికి ఉండే మరో ఫోన్ లో మరో రెండు కానీ ఒక సిమ్ కాని ఉండటం ఈ మధ్యన ఎక్కువగా కనిపిస్తుంటుంది. జియో ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. మిగిలిన సిమ్ లు ఎలా ఉన్నా.. జియో సిమ్ ఒకటి ఉంచుకోవటం ఒక అలవాటుగా మారింది.
అయితే.. తమ సొంతానికి.. తమ ఇంట్లో వారి కోసం సిమ్ లు కొనేయటం.. వాటిని అప్పుడప్పుడు వాడే వారు కొంతమంది ఉంటారు. కానీ.. మీ పేరు మీద ఉన్న సిమ్ కార్డుల లెక్కను ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఒకరి పేరు మీద తొమ్మిది సిమ్ కార్డులు ఉంటే.. చర్యలు తీసుకోవడం కోసం తాజాగా డిసైడ్ చేశారు. తాజాగా టెలికాం శాఖ ఆదేశాల్ని చూసినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.
సిమ్ కార్డు కనెక్షన్ ఒక్కరి పేరు మీద తొమ్మిది సిమ్ లు ఉంటే.. వాటిని మళ్లీ ధ్రువీకరించు కోవాల్సి ఉంటుంది. ఒకవేళ ధ్రువీకరణ లేకపోతే.. సదరు సిమ్ లను తొలగించనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని వారికి 9 సిమ్ కార్డుల పరిమితి ఉంటే.. జమ్ముకశ్మీర్.. ఈశాన్య రాష్ట్రాలతో పాటు.. అసోంలో ఉండే వారికి మాత్రం ఈ పరిమితి ఆరుకు మాత్రమే. తమకున్న సిమ్ కార్డుల్లో వేటిని యాక్టివ్ చేసుకోవాలి? వేటిని డీయాక్టివేట్ చేసుకోవాలన్నది ఇప్పుడు తేల్చుకోవాలని చెబుతున్నారు.
ఇదంతా ఎందుకంటే ఆర్థిక నేరాలు.. ఇబ్బంది పెట్టే కాల్స్.. మోసపూరిత చర్యల కోసం సిమ్ లను విరివిరిగా వాడేస్తున్న వారికి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తాజా ఆదేశాల ప్రకారం ఒక వ్యక్తిగత చందాదారు వద్ద తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ లు ఉండి ఉంటే.. వెంటనే వారు వాటిని తిరిగి ధ్రువీకరించేందుకు ప్లాగ్ చేయాలని నిర్ణయించారు. ఇలాంటి వారి కనెక్షన్లకు అవుట్ గోయింగ్ సదుపాయాన్ని 30 రోజుల్లో నిలిపివేయాలని నిర్ణయించారు. ఇన్ కమింగ్ కాల్స్ సదుపాయాన్ని 45 రోజుల్లోపు తొలగించాలని డిసైడ్ చేశారు.
This post was last modified on December 9, 2021 10:40 am
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…
అనామకుడైన ఒక కుర్రాడు హీరోగా నటించిన తొలి సినిమాతోనే వంద కోట్ల వసూళ్లు రాబట్టడమే అనూహ్యం. అలాంటిది ఆ హీరో తర్వాతి…