సెల్ ఫోన్లు వచ్చిన మొదట్లో ఒకట్రెండు సిమ్ లకు మించి ఉండేవి కావు. తర్వాతి కాలంలో ఎవరికి వారే కాదు.. ఇంట్లో వారి కోసం.. పెద్ద ఎత్తున సిమ్ లు కొనేసే పరిస్థితి. ఆ మాటకు వస్తే.. చేతిలో ఉండే ఫోన్లో రెండు సిమ్ లు.. చాలామందికి ఉండే మరో ఫోన్ లో మరో రెండు కానీ ఒక సిమ్ కాని ఉండటం ఈ మధ్యన ఎక్కువగా కనిపిస్తుంటుంది. జియో ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. మిగిలిన సిమ్ లు ఎలా ఉన్నా.. జియో సిమ్ ఒకటి ఉంచుకోవటం ఒక అలవాటుగా మారింది.
అయితే.. తమ సొంతానికి.. తమ ఇంట్లో వారి కోసం సిమ్ లు కొనేయటం.. వాటిని అప్పుడప్పుడు వాడే వారు కొంతమంది ఉంటారు. కానీ.. మీ పేరు మీద ఉన్న సిమ్ కార్డుల లెక్కను ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఒకరి పేరు మీద తొమ్మిది సిమ్ కార్డులు ఉంటే.. చర్యలు తీసుకోవడం కోసం తాజాగా డిసైడ్ చేశారు. తాజాగా టెలికాం శాఖ ఆదేశాల్ని చూసినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.
సిమ్ కార్డు కనెక్షన్ ఒక్కరి పేరు మీద తొమ్మిది సిమ్ లు ఉంటే.. వాటిని మళ్లీ ధ్రువీకరించు కోవాల్సి ఉంటుంది. ఒకవేళ ధ్రువీకరణ లేకపోతే.. సదరు సిమ్ లను తొలగించనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని వారికి 9 సిమ్ కార్డుల పరిమితి ఉంటే.. జమ్ముకశ్మీర్.. ఈశాన్య రాష్ట్రాలతో పాటు.. అసోంలో ఉండే వారికి మాత్రం ఈ పరిమితి ఆరుకు మాత్రమే. తమకున్న సిమ్ కార్డుల్లో వేటిని యాక్టివ్ చేసుకోవాలి? వేటిని డీయాక్టివేట్ చేసుకోవాలన్నది ఇప్పుడు తేల్చుకోవాలని చెబుతున్నారు.
ఇదంతా ఎందుకంటే ఆర్థిక నేరాలు.. ఇబ్బంది పెట్టే కాల్స్.. మోసపూరిత చర్యల కోసం సిమ్ లను విరివిరిగా వాడేస్తున్న వారికి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తాజా ఆదేశాల ప్రకారం ఒక వ్యక్తిగత చందాదారు వద్ద తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ లు ఉండి ఉంటే.. వెంటనే వారు వాటిని తిరిగి ధ్రువీకరించేందుకు ప్లాగ్ చేయాలని నిర్ణయించారు. ఇలాంటి వారి కనెక్షన్లకు అవుట్ గోయింగ్ సదుపాయాన్ని 30 రోజుల్లో నిలిపివేయాలని నిర్ణయించారు. ఇన్ కమింగ్ కాల్స్ సదుపాయాన్ని 45 రోజుల్లోపు తొలగించాలని డిసైడ్ చేశారు.
This post was last modified on December 9, 2021 10:40 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…