సెల్ ఫోన్లు వచ్చిన మొదట్లో ఒకట్రెండు సిమ్ లకు మించి ఉండేవి కావు. తర్వాతి కాలంలో ఎవరికి వారే కాదు.. ఇంట్లో వారి కోసం.. పెద్ద ఎత్తున సిమ్ లు కొనేసే పరిస్థితి. ఆ మాటకు వస్తే.. చేతిలో ఉండే ఫోన్లో రెండు సిమ్ లు.. చాలామందికి ఉండే మరో ఫోన్ లో మరో రెండు కానీ ఒక సిమ్ కాని ఉండటం ఈ మధ్యన ఎక్కువగా కనిపిస్తుంటుంది. జియో ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. మిగిలిన సిమ్ లు ఎలా ఉన్నా.. జియో సిమ్ ఒకటి ఉంచుకోవటం ఒక అలవాటుగా మారింది.
అయితే.. తమ సొంతానికి.. తమ ఇంట్లో వారి కోసం సిమ్ లు కొనేయటం.. వాటిని అప్పుడప్పుడు వాడే వారు కొంతమంది ఉంటారు. కానీ.. మీ పేరు మీద ఉన్న సిమ్ కార్డుల లెక్కను ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఒకరి పేరు మీద తొమ్మిది సిమ్ కార్డులు ఉంటే.. చర్యలు తీసుకోవడం కోసం తాజాగా డిసైడ్ చేశారు. తాజాగా టెలికాం శాఖ ఆదేశాల్ని చూసినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.
సిమ్ కార్డు కనెక్షన్ ఒక్కరి పేరు మీద తొమ్మిది సిమ్ లు ఉంటే.. వాటిని మళ్లీ ధ్రువీకరించు కోవాల్సి ఉంటుంది. ఒకవేళ ధ్రువీకరణ లేకపోతే.. సదరు సిమ్ లను తొలగించనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని వారికి 9 సిమ్ కార్డుల పరిమితి ఉంటే.. జమ్ముకశ్మీర్.. ఈశాన్య రాష్ట్రాలతో పాటు.. అసోంలో ఉండే వారికి మాత్రం ఈ పరిమితి ఆరుకు మాత్రమే. తమకున్న సిమ్ కార్డుల్లో వేటిని యాక్టివ్ చేసుకోవాలి? వేటిని డీయాక్టివేట్ చేసుకోవాలన్నది ఇప్పుడు తేల్చుకోవాలని చెబుతున్నారు.
ఇదంతా ఎందుకంటే ఆర్థిక నేరాలు.. ఇబ్బంది పెట్టే కాల్స్.. మోసపూరిత చర్యల కోసం సిమ్ లను విరివిరిగా వాడేస్తున్న వారికి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తాజా ఆదేశాల ప్రకారం ఒక వ్యక్తిగత చందాదారు వద్ద తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ లు ఉండి ఉంటే.. వెంటనే వారు వాటిని తిరిగి ధ్రువీకరించేందుకు ప్లాగ్ చేయాలని నిర్ణయించారు. ఇలాంటి వారి కనెక్షన్లకు అవుట్ గోయింగ్ సదుపాయాన్ని 30 రోజుల్లో నిలిపివేయాలని నిర్ణయించారు. ఇన్ కమింగ్ కాల్స్ సదుపాయాన్ని 45 రోజుల్లోపు తొలగించాలని డిసైడ్ చేశారు.
తమ భాషను, తమ సంస్కృతిని, తమ సామిత్యాన్ని గౌరవించుకోవడంలో మిగతా వాళ్లతో పోలిస్తే తెలుగు వాళ్లది ఎప్పుడూ వెనుకబాటే అన్న…
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…