మీరు చదివింది నిజమే. చాలా మందికి ఏ పని చెప్పినా చేసేస్తామంటారు. అలాంటి వాళ్లు సైతం తమ ఇంట్లో టాయిలెట్లను శుభ్రం చేయమని చెబితే మాత్రం ముఖం మరోలా మారిపోతుంది. సొంతింట్లో వారు వాడే టాయిలెట్లను క్లీన్ చేసుకోవటానికి ఆసక్తి చూపని ఎంతోమందికి భిన్నంగా.. తమ ఉద్యోగానికి ఏ మాత్రం సంబంధం లేకున్నా.. ప్రజా శ్రేయస్సు కోసం.. పిల్లల్లో స్ఫూర్తిని నింపటంతో పాటు.. కొత్త అలవాటును నేర్పించేందుకు తామే స్వయంగా టాయిలెట్ బ్రష్ పట్టుకొని.. సర్కారు స్కూల్లో బాత్రూంను క్లీన్ చేయటం అంత సామాన్యమైన విషయం కాదు.
తాజాగాఅలాంటి పని చేసి మనసు దోచేశారు ఏపీకి చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు ఐఏఎస్ లు చేసిన పని ఇప్పుడు అందరిని ఆకర్షించటమే కాదు.. విన్నోళ్లంతా అభినందించేస్తున్నారు. ఏపీకి ఒక కొసన ఉండే ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఐఏఎస్.. మరో కొసన ఉండే నెల్లూరు జిల్లాలకు చెందిన ఐఏఎస్ అధికారి స్కూల్లో టాయిలెట్ ను కడిగి..బాత్రూంలను క్లీన్ గా ఉంచుకోవాల్సిన అవసరాన్ని పిల్లలకు తెలియజేసే పని చేశారు.
విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్ తాజాగా నెల్లిమర్ల లోని రెల్లీ వీధిలో ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ బాత్రూంకు వెళ్లిన ఆయన.. బ్రష్ పట్టుకొని.. బాత్రూం క్లీనర్ ను పోసి టాయిలెట్ ను క్లీన్ చేశారు. అనంతరం ఎవరి మరుగుదొడ్లను వారే శుభ్రం చేసుకోవాలని చెప్పాలి. ఇదిలా ఉంటే.. నెల్లూరు జిల్లా కేంద్రంలోని పొదలకూరు రోడ్డులోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న రాజశేఖర్ సైతం బాత్రూం క్లీన్ చేశారు.
పారిశుద్ధ్య కార్మికులు.. ఆయాలను చిన్నచూపు చూడకూడదన్న ఆయన.. స్కూల్ ఆవరణలో మొక్కలు సైతం నాటారు. ఏమైనా.. ఇద్దరు ఐఏఎస్ అధికారులు చేసిన పని ఫిదా అయ్యేలా చేయటమే కాదు.. సరికొత్త స్ఫూర్తిని నింపిందని చెప్పాలి. నయా గాంధీలుగా వీరి చర్యను పలువురు అభినందిస్తున్నారు.
This post was last modified on November 21, 2021 3:55 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…