మహేంద్రసింగ్ ధోనీకి ఈ ఏడాది జులై 7న 40 ఏళ్లు నిండాయి. వచ్చే ఏడాది ఐపీఎల్ జరిగే సమయానికి అతను 41వ పడికి దగ్గరగా ఉంటాడు. అతను ఇంతకుముందులా బ్యాటింగ్లో జోరు చూపించలేకపోతున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల కిందటే అంతర్జాతీయ క్రికెట్కు దూరం కావడం వల్ల మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లేకపోతోంది. ఈ నేపథ్యంలో అతను ఐపీఎల్కు కూడా గుడ్బై చెప్పేసే సమయం దగ్గర పడిందనే అనుకుంటున్నారంతా.
గత ఏడాది ఐపీఎల్లో చెన్నై జట్టు పేలవ ప్రదర్శన చేయడం, ధోని ఆటగాడిగా, కెప్టెన్గా విఫలం కావడంతో ఈ ఏడాది ధోని కథ ముగిసిపోతుందని కొందరు అంచనా వేశారు. ఐతే ధోని కెప్టెన్గా తన సత్తా చూపిస్తూ మరోసారి చెన్నైకి టైటిల్ అందించాడు. అందులోనూ ఐపీఎల్ సగం నుంచి యూఏఈలో జరగడంతో చివరి మ్యాచ్ అక్కడ ఆడి ముగించాలని ధోని కోరుకుని ఉండకపోవచ్చు.
మరి 2022దే ధోని చివరి ఐపీఎల్ సీజన్ అవుతుందా.. చెన్నైలోనే అతను రిటైర్ కాబోతున్నాడా అన్న చర్చ జరుగుతోంది. ఈ విషయమై ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ అయ్యాక భారత జట్టు మెంటార్గా టీ20 ప్రపంచకప్ కోసం యూఏఈలోనే ఉన్న ధోని.. కొన్ని రోజుల కిందటే స్వదేశానికి వచ్చాడు. శనివారం అతను చెన్నై చేరుకుని ఐపీఎల్ టైటిల్ విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నాడు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చారు.
ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ.. తాను జీవితంలో ఏదీ ప్లాన్ చేసుకుని చేయలేదని.. తన చివరి టీ20ని చెన్నైలోనే ఆడాలనుకుంటున్నానని.. అది వచ్చే ఏడాదా ఇంకో అయిదేళ్ల తర్వాతా అన్నది చెప్పలేనని వ్యాఖ్యానించాడు. మొత్తానికి ధోని చెన్నైలోనే క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటాడని స్పష్టం. ఇక ఈ కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడుతూ.. తాను ఈ వేడుకకు ముఖ్యమంత్రిలా రాలేదని.. ధోని ఫ్యాన్గా వచ్చానని.. తన కుటుంబ సభ్యులు అందరూ కూడా ధోని అభిమానులే అని.. మహి ఇంకా చాలా ఏళ్ల పాటు చెన్నై జట్టును నడిపించాలని కోరడం విశేషం.
This post was last modified on November 21, 2021 7:27 am
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…