Trends

రిటైర్మెంట్‌పై ధోని కొత్త మాట‌

మ‌హేంద్ర‌సింగ్ ధోనీకి ఈ ఏడాది జులై 7న 40 ఏళ్లు నిండాయి. వ‌చ్చే ఏడాది ఐపీఎల్ జ‌రిగే స‌మ‌యానికి అత‌ను 41వ ప‌డికి ద‌గ్గ‌ర‌గా ఉంటాడు. అత‌ను ఇంత‌కుముందులా బ్యాటింగ్‌లో జోరు చూపించ‌లేక‌పోతున్న సంగ‌తి తెలిసిందే. రెండేళ్ల కింద‌టే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు దూరం కావ‌డం వ‌ల్ల మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లేక‌పోతోంది. ఈ నేప‌థ్యంలో అత‌ను ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పేసే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింద‌నే అనుకుంటున్నారంతా.


గ‌త ఏడాది ఐపీఎల్‌లో చెన్నై జ‌ట్టు పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం, ధోని ఆట‌గాడిగా, కెప్టెన్‌గా విఫ‌లం కావ‌డంతో ఈ ఏడాది ధోని క‌థ ముగిసిపోతుంద‌ని కొంద‌రు అంచ‌నా వేశారు. ఐతే ధోని కెప్టెన్‌గా త‌న స‌త్తా చూపిస్తూ మ‌రోసారి చెన్నైకి టైటిల్ అందించాడు. అందులోనూ ఐపీఎల్ స‌గం నుంచి యూఏఈలో జ‌ర‌గ‌డంతో చివ‌రి మ్యాచ్ అక్క‌డ ఆడి ముగించాల‌ని ధోని కోరుకుని ఉండ‌క‌పోవ‌చ్చు.

మ‌రి 2022దే ధోని చివ‌రి ఐపీఎల్ సీజ‌న్ అవుతుందా.. చెన్నైలోనే అత‌ను రిటైర్ కాబోతున్నాడా అన్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ విష‌య‌మై ధోని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఐపీఎల్ అయ్యాక భార‌త జ‌ట్టు మెంటార్‌గా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం యూఏఈలోనే ఉన్న ధోని.. కొన్ని రోజుల కింద‌టే స్వ‌దేశానికి వ‌చ్చాడు. శ‌నివారం అత‌ను చెన్నై చేరుకుని ఐపీఎల్ టైటిల్ విజ‌యోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొన్నాడు. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా ధోని మాట్లాడుతూ.. తాను జీవితంలో ఏదీ ప్లాన్ చేసుకుని చేయ‌లేద‌ని.. త‌న చివ‌రి టీ20ని చెన్నైలోనే ఆడాల‌నుకుంటున్నాన‌ని.. అది వ‌చ్చే ఏడాదా ఇంకో అయిదేళ్ల త‌ర్వాతా అన్న‌ది చెప్ప‌లేన‌ని వ్యాఖ్యానించాడు. మొత్తానికి ధోని చెన్నైలోనే క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటాడ‌ని స్ప‌ష్టం. ఇక ఈ కార్య‌క్ర‌మంలో స్టాలిన్ మాట్లాడుతూ.. తాను ఈ వేడుక‌కు ముఖ్య‌మంత్రిలా రాలేద‌ని.. ధోని ఫ్యాన్‌గా వ‌చ్చాన‌ని.. త‌న కుటుంబ స‌భ్యులు అంద‌రూ కూడా ధోని అభిమానులే అని.. మ‌హి ఇంకా చాలా ఏళ్ల పాటు చెన్నై జ‌ట్టును న‌డిపించాల‌ని కోర‌డం విశేషం.

This post was last modified on November 21, 2021 7:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

5 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

9 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

10 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago