టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కు 2019లో రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ అనంతరం తాను నెలకొల్పిన క్రికెట్ అకాడమీ బాధ్యతలు చూసుకుంటున్న యువీ పేరు క్రీడలపరంగా ఈ మధ్యకాలంలో పెద్దగా వార్తల్లో వినబడలేదు. ఈ క్రమంలోనే తాజాగా యువీ తన ఇన్ స్టా ఖాతాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. అభిమానుల కోరిక ప్రకారం మరో నాలుగు నెలల్లో తాను మైదానంలో అడుగుపెట్టబోతున్నానని యువీ చేసిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది.
భగవంతుడు మన గమ్యాన్ని నిర్దేశిస్తాడన్న యువీ… అభిమానుల కోరిక ప్రకారం తాను వచ్చే ఫిబ్రవరిలో మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉందని పోస్ట్ చేశాడు. టీమిండియాకు అభిమానుల మద్దతు ఇలాగే కొనసాగాలని, నిజమైన అభిమాని.. కఠిన సమయాల్లో కూడా జట్టుకు మద్దతుగా నిలుస్తాడని యువీ అన్నాడు. 2017లో ఇంగ్లండ్ పై సాధించిన సెంచరీ వీడియోను పోస్ట్ కు యాడ్ చేశాడు.
ఈ క్రమంలోనే యువీ పెట్టిన పోస్ట్ పై నెటిజన్లు, యువీ అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. యువీ రాక కోసం ఎదురుచూస్తున్నామని, మళ్లీ ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు కొడితే చూడాలని ఉందని ఓ అభిమాని కామెంట్ చేశాడు. అయితే, ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ లో భారత్ వరుస ఓటముల నేపథ్యంలో అభిమానులు ఆగ్రహంతో ఉన్నారని, ఈ సమయంలో జట్టుకు అండగా నిలవాలన్న పిలుపునివ్వడమే యువీ పోస్ట్ ఉద్దేశ్యమని మరి కొందరంటున్నారు.
ఇక, అసలు విషయం అది కాదని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ జరుగాల్సి ఉందని, ఆ సిరీస్ లో యువీ కూడా పాల్గొనబోతున్నాడని కొందరు అంటున్నారు. ఆ టోర్నీలో ఆడేందుకు మైదానంలోకి అడుగుపెట్టబోతున్నానని చెప్పాడని, కాకపోతే కొంత ట్విస్ట్ చేసి ప్రాంక్ లా చెప్పాడని కొందరు అంటున్నారు. అయితే, యువీ.. రోడ్ సేఫ్టీ సిరీస్ కోసమే ఈ పోస్టు పెట్టాడా..? లేక నిజంగానే రీ ఎంట్రీ ఇస్తాడా..? అన్నది తేలాలంటే మాత్రం ఫిబ్రవరి దాకా వేచి చూడక తప్పదు.
This post was last modified on November 3, 2021 6:36 am
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కలలు గన్న…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, సొంత అన్నపై ఆమె తీవ్రస్థాయిలో యుద్ధం…
పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్డేట్స్…
ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా అగ్రస్థానంలో ఉండే కాపు కులస్థుల కోసం ఉద్యమించిన నాయకుడిగా వంగవీటి మోహనరంగా తర్వాత ఓ మోస్తరు…
ఎన్నికలు జరగబోతున్నపుడు అనుకోకుండా కొన్ని విషయాలు కీలకంగా మారి అధికార పక్షాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అవి ఎన్నికల ఫలితాలనే…
భారీ నమ్మకంతో రోజుల తరబడి ప్రమోషన్లు చేసిన ఆ ఒక్కటి అడక్కుకి మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. మాములుగా ఇలాంటి సినిమాలకు…