లాక్ డౌన్ వేళ సినిమా, స్పోర్ట్స్ సెలబ్రెటీలందరూ సోషల్ మీడియాలో లైవ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ పాత సంగతులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ జాబితాలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కూడా చేరాడు.
తన కెరీర్లో ఒక సందర్భంలో సచిన్ టెండూల్కర్, ఇతర జట్టు సభ్యులు కలిసి తనను ఏప్రిల్ ఫూల్ ఎలా చేశారో.. తాను అప్పుడు విషయం తెలియక ఎంత సీరియస్ అయ్యానో వివరించాడు. పాకిస్థాన్తో ఓ సిరీస్లో తాను వరుస వైఫల్యాలు చవి చూస్తూ మూడ్ ఔట్లో్ ఉన్న సమయంలో ఆ సంఘటన జరిగినట్లు గంగూలీ తెలిపాడు. ఆ ఉదంతం గురించి గంగూలీ ఇంకా ఏమన్నాడంటే..
‘‘ఆ సిరీస్లో నేనే కెప్టెన్. కానీ సరిగా ఆడలేక ఇబ్బంది పడుతున్నా. ఆ బాధతో డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లాను. ఆ రోజు ఏప్రిల్ 1వ తేదీ అని నాకు గుర్తు లేదు. ఆ గదిలోకి వెళ్లగానే సచిన్, హర్భజన్, మరికొందరు నా దగ్గరికి వచ్చారు. మీడియాతో అలా అన్నావేంటి అన్నారు. ఏం అన్నాను అంటే.. జట్టు సరిగా ఆడట్లేదని, ఇలా ఆడితే ఎలా అని నేను మీడియా దగ్గర చెప్పినట్లు వాళ్లన్నారు. ఈ వ్యాఖ్యలతో తామంతా చాలా నిరాశ చెందామని అన్నారు. నేనలా అనలేదని అన్నా వినిపించుకోలేదు. నాకు చాలా కోపం వచ్చింది. నేనేమైనా తప్పు చేశానని మీరనుకుంటే కెప్టెన్సీకి రాజీనామా చేస్తా అని సీరియస్గా చెప్పేసి వెళ్లి కుర్చీలో కూర్చున్నా. వెంటనే సచిన్, హర్భజన్ గట్టిగా నవ్వుతూ ఏప్రిల్ ఫూల్ అన్నారు. అప్పటికి కానీ విషయం బోధపడలేదు. నా సహచరులకు నా పట్ల ఎంత ప్రేమ ఉందో ఆ రోజే అర్థమైంది. నేను మూడీగా ఉంటున్నానని, నన్ను ఉత్సాహపరచాలని వాళ్లు అలా చేశారు. నిజానికి ఆ సంఘటన తర్వాత నేను కుదురుకున్నా. ఫాంలోకి వచ్చి బాగా పరుగులు చేశా’’ అని గంగూలీ గుర్తు చేసుకున్నాడు.
This post was last modified on June 1, 2020 11:56 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…