విరాట్ కోహ్లి నాలుగు రోజుల ముందే పెద్ద షాక్ ఇచ్చాడు. వచ్చే నెలలో జరిగే టీ20 ప్రపంచకప్ తర్వాత తాను భారత టీ20 జట్టు పగ్గాలు వదిలేయబోతున్నట్లు ప్రకటించాడు. ఐసీసీ ట్రోఫీ సాధించలేదన్న మాటే కానీ.. ఏ ఫార్మాట్లో అయినా సరే కోహ్లి కెప్టెన్గా ఫెయిల్యూర్ అని చెప్పలేం. అతడి కెప్టెన్సీ రికార్డు చాలా బాగుంది కూడా. అతను ఉండాలనుకుంటే ఇంకా కొంత కాలం కెప్టెన్గా కొనసాగవచ్చు. కానీ ఈ మధ్య కొంచెం ఫాం తగ్గిన నేపథ్యంలో మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ భారం అనుకున్నాడో, ఇంకేవైనా ఒత్తిళ్లు పని చేశాయేమో కానీ.. భారత టీ20 పగ్గాలు వదిలేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇది విరాట్ అభిమానులకు అంతగా రుచించలేదు.
ఐతే ఈ నిర్ణయం ప్రకటించి వారం తిరక్కముందే కింగ్ ఇంకో అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు సారథ్యం నుంచి కూడా తాను తప్పుకోనున్నట్లు ప్రకటించాడు.
ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ ఆదివారమే ఆరంభమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ పూర్తవగానే కోహ్లి ఆర్సీబీ పగ్గాలు వదిలేయబోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీనే ఒక వీడియో ద్వారా వెల్లడించాడు. ఫ్రాంఛైజీ ప్రతినిధులతో, జట్టు సభ్యులతో మాట్లాడాకే ఈ నిర్ణయం తీసుకున్నానని.. కెప్టెన్గా ఇదే తన చివరి సీజన్ అని.. ఐతే ఆర్సీబీ సభ్యుడిగా మాత్రం కొనసాగుతానని.. తన చివరి ఐపీఎల్ మ్యాచ్ వరకు ఈ జట్టుతోనే కొనసాగుతానని కోహ్లి ఎమోషనల్గా అన్నాడు.
ఐపీఎల్లో బ్యాట్స్మన్గా కోహ్లి ప్రదర్శన తిరుగులేదు. కానీ తొమ్మిది సీజన్ల నుంచి కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతను ఇప్పటిదాకా ఆర్సీబీని ఒక్కసారి కూడా విజేతగా నిలపలేకపోయాడు. ఒక్కసారి మాత్రమే తన సారథ్యంలో ఆ జట్టు ఫైనల్ చేరింది. గత మూడు సీజన్లలో పేలవ ప్రదర్శన చేసిన ఆ జట్టు.. ఈ సారి బాగానే ఆడుతోంది. మరి కెప్టెన్గా చివరి సీజన్లో అయినా జట్టును కోహ్లి విజేతగా నిలబెడతాడేమో చూడాలి.
This post was last modified on September 20, 2021 7:28 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…