టీమిండియా డేరింగ్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన కెప్టెన్సీ వదులుకుంటున్నాడా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. మిప్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత.. కోహ్లీ ఆ బాధ్యతలను స్వీకరించాడు. అయితే.. ఇప్పుడు.. కోహ్లీ నుంచి ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు చెబుతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.
ఈ వార్త విని.. కోహ్లీ అభిమానులు చాలా కలవరపడుతున్నారు.. త్వరలో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఆ తర్వాత కెప్టెన్సీ మార్పు ఉండబోతున్నట్లుగా ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం టెస్ట్, వన్డే, టీ20లకు కోహ్లీయే కెప్టెన్ కాగా… రోహిత్ శర్మ వైఎస్ కెప్టెన్ గా ఉన్నారు.
వన్డేల్లో మంచి ట్రాక్ రికార్డు కూడా ఉన్న రోహిత్ కు వన్డేలతో పాటు టీ20ల్లో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. కాగా.. ఈ వార్తలు విపరీతంగా వస్తుండటంతో.. దీనిపై ఏకంగా బీసీసీఐ స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.
అన్ని ఫార్మాట్లకు కోహ్లీనే కెప్టెన్ గా ఉంటాడని క్లారిటీ ఇచ్చింది. జాతీయ మీడియాలో ఈ విషయమై వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజంలేదని క్లారిటీ ఇవ్వడం విశేషం. కాగా.. బీసీసీఐ క్లారిటీ తర్వాత.. కోహ్లీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
This post was last modified on September 14, 2021 11:10 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…