Trends

భారత్‌కు షాక్.. పారాలింపిక్స్‌లో పతకం వెనక్కి

పారాలింపిక్స్‌లో మన అథ్లెట్లు పతకాల మీద పతకాలు గెలుస్తున్న వేళ.. ఒక పెద్ద షాక్. భారత్‌కు దక్కిన ఒక కాంస్య పతకాన్ని నిర్వాహకులు వెనక్కి తీసుకున్నారు. ఆదివారం జరిగిన డిస్కస్ త్రో పోటీల్లో మూడో స్థానం సాధించి కాంస్యం గెలిచిన భారత క్రీడాకారుడు వినోద్ కుమార్‌ను నిర్వాహకులు అనర్హుడిగా ప్రకటించారు.

అతను 19.1 మీటర్లు డిస్కస్‌ను విసిరి తాను పోటీ పడ్డ ఎఫ్-52 విభాగంలో మూడో స్థానంలో నిలిచాడు. ఐతే ఈ విభాగంలో పోటీకి వినోద్ కుమార్ అనర్హుడంటూ తోటి క్రీడాకారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సమస్య మొదలైంది. పారాలింపిక్స్‌లో పోటీ పడే వికలాంగ క్రీడాకారులకు ఉన్న వైకల్యం స్థాయిని బట్టి వారిని వివిధ విభాగాల్లో పోటీ పడేందుకు అనుమతులిస్తారు. బలహీన కండరాల శక్తి, అవయవ లోపం.. లేదా కాళ్ల పొడవులో తేడా ఉన్నవాళ్లు ఎఫ్-52 కింద పోటీ పడే అవకాశం ఉంటుంది.

ఐతే పారాలింపిక్స్ పోటీలు ఈ నెల 24న ఆరంభం కాగా.. ఈ నెల 22నే వర్గీకరణ ప్రక్రియను చేపట్టిన నిర్వాహకులు అథ్లెట్ల జాబితాను ప్రకటించారు. అందులో వినోద్ కుమార్‌ను ఎఫ్-52 విభాగానికి అర్హుడిగానే పేర్కొన్నారు. కానీ పోటీల సందర్భంగా వినోద్‌ను పరిశీలించిన తోటి అథ్లెట్లు.. అతడికి ఎఫ్-52 విభాగంలో పోటీ పడే స్థాయి వైకల్యం లేదని అనుమానం వ్యక్తం చేశారు. దీని పై నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు.

దీంతో నిపుణుల కమిటీ అతడికి పరీక్షలు నిర్వహించి.. అతను ఈ విభాగంలో పోటీ పడేందుకు అనర్హుడిగా పేర్కొంది. దీంతో నిర్వాహకులు వినోద్ సాధించిన కాంస్య పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచిన క్రీడాకారుడికి వినోద్ గెలిచిన కాంస్యం దక్కనుంది. ఐతే ముందు వినోద్‌కు పారాలింపిక్ కమిటీనే అనుమతులు మంజూరు చేసి.. ఇప్పుడు అతను ఎఫ్-52 విభాగానికి అనర్హుడిగా పేర్కొనడం, పతకాన్ని వెనక్కి తీసుకోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పారాలింపిక్స్‌లో వినోద్ సాధించిన కాంస్యంతో కలిసి భారత్ సోమవారం నాటికి ఏడు పతకాలు గెలిచింది. అందులో ఇప్పుడు ఒకటి తగ్గింది.
.

This post was last modified on August 31, 2021 7:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago