అప్పుడెప్పుడో వచ్చిన ప్రభుదేవా నటించిన ‘ప్రేమికుడు’ సినిమా గుర్తుందా? ప్రియురాలు వాడిపారేసే ప్రతి వస్తువును జాగ్రత్తగా దాచుకోవటమే కాదు.. అపురూపంగా చూసుకోవటం తెలిసిందే. ఇదే సినిమాలో ప్రియురాలి వాడిపారేసే వస్తువులకు ఉండే విలువ ఎంతో కూడా చెప్పేస్తూ పాట కూడా ఉంది. అప్పట్లో అదో పెద్ద హిట్. ఇప్పుడు జరిగిన ఉదంతాన్ని చూస్తే.. అభిమానం ప్రేమించిన ప్రియురాలి విషయంలోనే కాదు.. పిచ్చ పిచ్చగా అభిమానించే క్రీడాకారులు.. సెలబ్రిటీలు.. సినీ నటుల విషయంలోనూ ఉంటుందని చెప్పక తప్పదు.
ఎంత అభిమానం అయితే మాత్రం.. భావోద్వేగంతో కన్నీరు.. ముక్కును తుడుచుకొని పారేసి టిష్యూ పేపర్ కు కోట్లాది రూపాయిలు పలకటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇదంతా విన్నప్పుడు.. తాను ముక్కు తుడుచుకొని పారేసే పేపర్ ముక్కకుకోట్లు పలుకుతుందంటే.. సదరు సెలబ్రిటీ సైతం ఆ పేపర్ ను తన కోటు జేబులో పెట్టుకునే వారేమో కానీ.. కింద పడేసేవారు కాదేమో? ఒక ప్రముఖ క్రీడాకారులు తుడిచి పారేసిన టిష్యూ పేపర్ ను వేలం వేస్తే.. ఏకంగా రూ.7.5కోట్ల ధర పలకటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఎవరా సెలబ్రిటీ క్రీడాకారుడు అంటారా? అక్కడికే వస్తున్నాం.
అర్జెంటీనా స్టార్ ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ తెలుసు కదా? ఇతగాడికి సంబంధించిన వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల కాంటాక్టు పొడిగింపు ఇష్యూలో వచ్చిన ఉదంతంపై ఆయన ప్రాతినిధ్యం వహించే స్పానిష్ ఫుట్ బాల్ క్లబ్ బార్సిలోనాకు గుడ్ బై చెప్పేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో తన అనుభవాల్ని పంచుకునే క్రమంలో కాస్తంత ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా కంటి వెంట కారుతున్న కన్నీళ్లను తుడుచుకున్నాడు. అనంతరం దాన్ని పారేశాడు.
అయితే.. అతడు వాడి పారేసిన టిష్యూ పేపర్ ను.. ఒకడు జాగ్రత్తగా సేకరించి.. ఇంటర్నేషనల్ ఈ-కామర్స్ ఫ్లాట్ ఫాంలో వేలానికి పెట్టాడు. పుట్ బాల్ దిగ్గజం కన్నీళ్లు తుడిచిన ఆ టిష్యూపేపర్ అనూహ్యంగా రూ.7.5కోట్లు పలకటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారి.. మెస్సీ మీద మరీ ఇంత పిచ్చ అభిమానమా? అని నోరెళ్లబెడుతున్నారు. ఈ విషయం కానీ తెలిస్తే.. ఇకపై సెలబ్రిటీలంతా తాము వాడే వస్తువుల్ని ఎందుకైనా మంచిదని జాగ్రత్తలు దాచుకొని థర్డ్ పార్టీ ఏజెన్సీల చేత వేలం పెట్టిస్తారేమో?
This post was last modified on August 18, 2021 5:29 pm
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…