అప్పుడెప్పుడో వచ్చిన ప్రభుదేవా నటించిన ‘ప్రేమికుడు’ సినిమా గుర్తుందా? ప్రియురాలు వాడిపారేసే ప్రతి వస్తువును జాగ్రత్తగా దాచుకోవటమే కాదు.. అపురూపంగా చూసుకోవటం తెలిసిందే. ఇదే సినిమాలో ప్రియురాలి వాడిపారేసే వస్తువులకు ఉండే విలువ ఎంతో కూడా చెప్పేస్తూ పాట కూడా ఉంది. అప్పట్లో అదో పెద్ద హిట్. ఇప్పుడు జరిగిన ఉదంతాన్ని చూస్తే.. అభిమానం ప్రేమించిన ప్రియురాలి విషయంలోనే కాదు.. పిచ్చ పిచ్చగా అభిమానించే క్రీడాకారులు.. సెలబ్రిటీలు.. సినీ నటుల విషయంలోనూ ఉంటుందని చెప్పక తప్పదు.
ఎంత అభిమానం అయితే మాత్రం.. భావోద్వేగంతో కన్నీరు.. ముక్కును తుడుచుకొని పారేసి టిష్యూ పేపర్ కు కోట్లాది రూపాయిలు పలకటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇదంతా విన్నప్పుడు.. తాను ముక్కు తుడుచుకొని పారేసే పేపర్ ముక్కకుకోట్లు పలుకుతుందంటే.. సదరు సెలబ్రిటీ సైతం ఆ పేపర్ ను తన కోటు జేబులో పెట్టుకునే వారేమో కానీ.. కింద పడేసేవారు కాదేమో? ఒక ప్రముఖ క్రీడాకారులు తుడిచి పారేసిన టిష్యూ పేపర్ ను వేలం వేస్తే.. ఏకంగా రూ.7.5కోట్ల ధర పలకటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఎవరా సెలబ్రిటీ క్రీడాకారుడు అంటారా? అక్కడికే వస్తున్నాం.
అర్జెంటీనా స్టార్ ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ తెలుసు కదా? ఇతగాడికి సంబంధించిన వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల కాంటాక్టు పొడిగింపు ఇష్యూలో వచ్చిన ఉదంతంపై ఆయన ప్రాతినిధ్యం వహించే స్పానిష్ ఫుట్ బాల్ క్లబ్ బార్సిలోనాకు గుడ్ బై చెప్పేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో తన అనుభవాల్ని పంచుకునే క్రమంలో కాస్తంత ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా కంటి వెంట కారుతున్న కన్నీళ్లను తుడుచుకున్నాడు. అనంతరం దాన్ని పారేశాడు.
అయితే.. అతడు వాడి పారేసిన టిష్యూ పేపర్ ను.. ఒకడు జాగ్రత్తగా సేకరించి.. ఇంటర్నేషనల్ ఈ-కామర్స్ ఫ్లాట్ ఫాంలో వేలానికి పెట్టాడు. పుట్ బాల్ దిగ్గజం కన్నీళ్లు తుడిచిన ఆ టిష్యూపేపర్ అనూహ్యంగా రూ.7.5కోట్లు పలకటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారి.. మెస్సీ మీద మరీ ఇంత పిచ్చ అభిమానమా? అని నోరెళ్లబెడుతున్నారు. ఈ విషయం కానీ తెలిస్తే.. ఇకపై సెలబ్రిటీలంతా తాము వాడే వస్తువుల్ని ఎందుకైనా మంచిదని జాగ్రత్తలు దాచుకొని థర్డ్ పార్టీ ఏజెన్సీల చేత వేలం పెట్టిస్తారేమో?
This post was last modified on August 18, 2021 5:29 pm
ఎంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో ఒక్కోసారి అవకాశాలు అంత వేగంగా రావు. హిట్టు పడినా సరే కొన్నిసార్లు దురదృష్టం పలకరించి…
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…
తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…
ఇంగ్లండ్పై టీ20, వన్డే సిరీస్లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్…
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా…