టోక్యో ఒలంపిక్స్ లో పతకం సాధించి తిరిగి వస్తే.. నీతో కలిసి ఐస్ క్రీమ్ తింటాను అంటూ.. ప్రధాని మోదీ.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధుకి మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ మాటను ఆయన తాజాగా నిలపెట్టుకున్నారు.
టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన అథ్లెట్లతో తాజాగా ప్రధాని తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారికి అల్పాహార విందు ఇచ్చారు. ఇదే సమయంలో టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సాధించిన పీవీ సింధుతో కలిసి ప్రధాని మోదీ ఐస్ క్రీం తిన్నారు. ఆమెతో కాసేపు మాట్లాడారు
టోక్యో బ్యాడ్మింటన్లో గెలుచుకున్న బ్రాంజ్తో పాటు.. గతంలో రియో ఒలింపిక్స్లో సాధించిన పతకాన్ని కూడా ఈ సందర్భంగా సింధు తన వెంట తీసుకెళ్లింది. ఆ రెండింటిని ధరించి.. ప్రధాని మోదీతో కలిసి ఆమె ఫోటో దిగింది.
ఇక జావెలిన్ త్రోలో.. అదరగొట్టి.. దేశానికి స్వర్ణం కల తీర్చిన నీరజ్ చోప్రాతో కొద్దిసేపు మోదీ ముచ్చటించారు. అనంతరం అతనితో కలిసి ఫోటో దిగారు. తనకు చూర్మ వంటకమంటే ఇష్టమని నీరజ్ చెప్పడంతో.. దాన్ని సిద్ధం చేయించారు. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
This post was last modified on August 16, 2021 2:31 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…