టోక్యో ఒలంపిక్స్ లో పతకం సాధించి తిరిగి వస్తే.. నీతో కలిసి ఐస్ క్రీమ్ తింటాను అంటూ.. ప్రధాని మోదీ.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధుకి మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ మాటను ఆయన తాజాగా నిలపెట్టుకున్నారు.
టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన అథ్లెట్లతో తాజాగా ప్రధాని తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారికి అల్పాహార విందు ఇచ్చారు. ఇదే సమయంలో టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సాధించిన పీవీ సింధుతో కలిసి ప్రధాని మోదీ ఐస్ క్రీం తిన్నారు. ఆమెతో కాసేపు మాట్లాడారు
టోక్యో బ్యాడ్మింటన్లో గెలుచుకున్న బ్రాంజ్తో పాటు.. గతంలో రియో ఒలింపిక్స్లో సాధించిన పతకాన్ని కూడా ఈ సందర్భంగా సింధు తన వెంట తీసుకెళ్లింది. ఆ రెండింటిని ధరించి.. ప్రధాని మోదీతో కలిసి ఆమె ఫోటో దిగింది.
ఇక జావెలిన్ త్రోలో.. అదరగొట్టి.. దేశానికి స్వర్ణం కల తీర్చిన నీరజ్ చోప్రాతో కొద్దిసేపు మోదీ ముచ్చటించారు. అనంతరం అతనితో కలిసి ఫోటో దిగారు. తనకు చూర్మ వంటకమంటే ఇష్టమని నీరజ్ చెప్పడంతో.. దాన్ని సిద్ధం చేయించారు. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
This post was last modified on August 16, 2021 2:31 pm
నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్నా అదిగో ఇదిగో అనడమే తప్ప హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజనే సంగతి ఎంతకీ తేలక అభిమానులు దాని…
అవును. అల్లరి నరేష్ తో పాటు ఈ శుక్రవారం వస్తున్న పోటీ సినిమాలకు టాలీవుడ్ ఇదే విన్నపం చేస్తోంది. చాలా…
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోరు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య నిప్పులు చెరుగుకునే…
కరోనా వేళ అపర సంజీవిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న వ్యాక్సిన్లలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన…
జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న మల్టీ స్టారర్ వార్ 2 షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తారక్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 ది రూల్ విడుదల కోసం అభిమానులు…