Trends

సంచలన పతకం.. త్రుటిలో పోయిందే

టోక్యో ఒలింపిక్స్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా ఒక ఆటలో భారత్‌కు పతకం దక్కేలా కనిపించింది. ఆ ఆట గురించి ఎవరికీ పట్టింపు లేదు. అందులో ఓ భారత అథ్లెట్ బరిలో ఉన్నారని కూడా చాలామందికి తెలియదు. అందరూ షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్ లాంటి క్రీడల మీద దృష్టిపెడతే.. ఎవ్వరికీ పట్టని ఆటలో ఓ అమ్మాయి సంచలన ప్రదర్శనతో పతకానికి చేరువ అయింది.

శనివారం ఆ అమ్మాయి పోడియంపై నిలవడం, భారత్ ఖాతాలో మరో పతకం జమ కావడం లాంఛనమే అనుకున్నారు. కానీ పోటీ చివరి రోజు కథ మారిపోయింది. ఆ అమ్మాయి త్రుటిలో పతకానికి దూరం అయింది. సంచలనం సృష్టించే అవకాశాన్ని కోల్పోయింది. ఆ అమ్మాయి పేరు.. అదితి అశోక్. తన ఆట గోల్ఫ్. ఈ ఆటలో భారత్‌కు పతకావకాశాలు ఉన్నాయని ఒలింపిక్స్ ఆరంభానికి ముందు ఎవరిలోనూ అంచనాలు లేవు. అదితి పోటీ గురించి కూడా ఎవరూ పట్టించుకోలేదు.

ఐతే నాలుగు రోజుల పాటు సాగే పోటీలో.. తొలి రోజు తొలి రౌండ్ తర్వాత టాప్-2లో నిలిచి ఆశ్చర్యానికి గురి చేసింది అదితి. వరుసగా తర్వాత రెండు రోజుల్లో జరిగిన రౌండ్లలోనూ ఆమె అదే స్థానాన్ని కొనసాగించింది. నాలుగో రౌండ్లోనూ అదే నిలకడను కొనసాగించి ఉంటే ఆమెకు రజతం సొంతమయ్యేది. కనీసం మూడో స్థానం దక్కించుకున్నా కాంస్యం దక్కేది. శనివారం పోటీల చివరి రోజు ఆమె రాణిస్తుందనే అంతా అనుకున్నారు.

అసలు శనివారం టోక్యోలో వర్ష ప్రభావం ఉండటంతో చివరి రౌండ్ జరగదని.. ముందు రోజు టాప్-3లో ఉన్న వాళ్లకే పతకాలు ఇచ్చేస్తారని వార్తలొచ్చాయి. కానీ వరుణుడు భారత అమ్మాయికి సహకరించలేదు. వర్షం ప్రభావం లేకపోవడంతో శనివారం ఆటను కొనసాగించారు. ఐతే చివరి రౌండ్లో అనుకున్నంతగా రాణించలేకపోయిన అదితి.. రెండు నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. త్రుటిలో పతకాన్ని చేజార్చుకుంది. ఇక శనివారం కాంస్యం కోసం పోటీ పడనున్న రెజ్లర్ బజ్‌రంగ్ పునియా, జావెలిన్ త్రోలో ఫైనల్ ఆడనున్న నీరజ్ చోప్రాల మీదే ఆశలన్నీ. ఇప్పటిదాకా టోక్యో ఒలింపిక్స్‌లో భారత్.. రెండు రజతాలు, మూడు కాంస్యాలు సాధించింది.

This post was last modified on August 7, 2021 8:10 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

5 mins ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

31 mins ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

43 mins ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

3 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

3 hours ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

3 hours ago