Trends

టోక్యో ఒలంపిక్స్.. ఎట్టకేలకు భారత్ కి స్వర్ణం

టోక్యో ఒలంపిక్స్ లో.. భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎక్కువ కాంస్య పతకాలే వచ్చాయి. ఒక రజతం వచ్చింది. ఇన్ని పతకాలు వచ్చినా.. స్వర్ణం కల మాత్రం నెరవేరదేమో అనే నిరాశ ఉండేది. అది కాస్త నేటితో తీరిపోయింది. ఈ ఒలంపిక్స్ లో ఎట్టకేలకు భారత్ ఖాతాలో స్వర్ణం వచ్చి చేరింది.

వందేళ్ల తర్వాత తొలిసారిగా భారత్ కు స్వర్ణ పతకం వచ్చింది. ఒలంపిక్స్ జావెలిన్ త్రో లో భారత్ కు గోల్డ్ మెడల్ వచ్చింది.జావెలిన్ త్రో లో 23 సంవత్సరాల భారత ప్లేయర్ నీరజ్ చోప్రా లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్ మొదటి రౌండులో 87.03 మీటర్ల దూరం జావెలిన్ విసిరి మొదటి స్థానానికి దూసుకు వెళ్ళాడు.

అనంతరం జరిగిన పోటీల్లో 87.58 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు నీరజ్ చోప్రా. ఒలింపిక్స్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించి నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఈ గోల్డ్ మెడల్ తో భారత్ పతకాల సంఖ్య ఏడుకు చేరుకుంది.

ఇదిలా ఉండగా.. గోల్డె మెడల్ విన్నర్ పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత దేశాన్ని ప్రపంచానికి మరోసారి గర్వపడేలా చూపించాడని కొనియా డుతున్నారు. ఈ నేపథ్యంలోనే నీరజ చోప్రాకు హర్యానా సర్కారు భారీ నజరానా ప్రకటించింది. రూ. 6 కోట్ల నగదు మరియు గ్రూప్ -1 క్యాడర్ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించింది హర్యానా సర్కార్. అలాగే 50 శాతం రాయితీతో కూడిన ఇంటిస్థలం కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది.

This post was last modified on August 7, 2021 8:03 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

ఈ సారి అమరావతికి మోదీ ఎం తెస్తున్నారు?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…

42 minutes ago

పొట్ట తగ్గటానికి ఈ పండ్లు తింటే చాలు

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…

2 hours ago

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు

ఏపీ మంత్రి వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు గీస్తున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌కు.. ఆయ‌న ఆదేశాల‌కు కూడా.. పెద్ద‌గా రెస్పాన్స్ ఉండ‌డం లేద‌ని…

2 hours ago

గాయకుడి విమర్శ…రెహమాన్ చెంపపెట్టు సమాధానం

సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…

4 hours ago

‘వక్ఫ్’పై విచారణ.. కేంద్రానికి ‘సుప్రీం’ ప్రశ్న

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…

5 hours ago

దర్శకుడి ఆవేదనలో న్యాయముంది కానీ

నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…

5 hours ago