టోక్యో ఒలంపిక్స్ లో.. భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎక్కువ కాంస్య పతకాలే వచ్చాయి. ఒక రజతం వచ్చింది. ఇన్ని పతకాలు వచ్చినా.. స్వర్ణం కల మాత్రం నెరవేరదేమో అనే నిరాశ ఉండేది. అది కాస్త నేటితో తీరిపోయింది. ఈ ఒలంపిక్స్ లో ఎట్టకేలకు భారత్ ఖాతాలో స్వర్ణం వచ్చి చేరింది.
వందేళ్ల తర్వాత తొలిసారిగా భారత్ కు స్వర్ణ పతకం వచ్చింది. ఒలంపిక్స్ జావెలిన్ త్రో లో భారత్ కు గోల్డ్ మెడల్ వచ్చింది.జావెలిన్ త్రో లో 23 సంవత్సరాల భారత ప్లేయర్ నీరజ్ చోప్రా లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్ మొదటి రౌండులో 87.03 మీటర్ల దూరం జావెలిన్ విసిరి మొదటి స్థానానికి దూసుకు వెళ్ళాడు.
అనంతరం జరిగిన పోటీల్లో 87.58 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు నీరజ్ చోప్రా. ఒలింపిక్స్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించి నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఈ గోల్డ్ మెడల్ తో భారత్ పతకాల సంఖ్య ఏడుకు చేరుకుంది.
ఇదిలా ఉండగా.. గోల్డె మెడల్ విన్నర్ పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత దేశాన్ని ప్రపంచానికి మరోసారి గర్వపడేలా చూపించాడని కొనియా డుతున్నారు. ఈ నేపథ్యంలోనే నీరజ చోప్రాకు హర్యానా సర్కారు భారీ నజరానా ప్రకటించింది. రూ. 6 కోట్ల నగదు మరియు గ్రూప్ -1 క్యాడర్ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించింది హర్యానా సర్కార్. అలాగే 50 శాతం రాయితీతో కూడిన ఇంటిస్థలం కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది.
This post was last modified on August 7, 2021 8:03 pm
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…
దర్శకుడు శంకర్ రెండో సినిమాగా ప్రేమికుడు మీద మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొరియోగ్రాఫర్ గా ఉన్న…
యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు పరశురామ్.…
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…
లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి..…