టోక్యో ఒలంపిక్స్ లో.. భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎక్కువ కాంస్య పతకాలే వచ్చాయి. ఒక రజతం వచ్చింది. ఇన్ని పతకాలు వచ్చినా.. స్వర్ణం కల మాత్రం నెరవేరదేమో అనే నిరాశ ఉండేది. అది కాస్త నేటితో తీరిపోయింది. ఈ ఒలంపిక్స్ లో ఎట్టకేలకు భారత్ ఖాతాలో స్వర్ణం వచ్చి చేరింది.
వందేళ్ల తర్వాత తొలిసారిగా భారత్ కు స్వర్ణ పతకం వచ్చింది. ఒలంపిక్స్ జావెలిన్ త్రో లో భారత్ కు గోల్డ్ మెడల్ వచ్చింది.జావెలిన్ త్రో లో 23 సంవత్సరాల భారత ప్లేయర్ నీరజ్ చోప్రా లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్ మొదటి రౌండులో 87.03 మీటర్ల దూరం జావెలిన్ విసిరి మొదటి స్థానానికి దూసుకు వెళ్ళాడు.
అనంతరం జరిగిన పోటీల్లో 87.58 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు నీరజ్ చోప్రా. ఒలింపిక్స్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించి నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఈ గోల్డ్ మెడల్ తో భారత్ పతకాల సంఖ్య ఏడుకు చేరుకుంది.
ఇదిలా ఉండగా.. గోల్డె మెడల్ విన్నర్ పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత దేశాన్ని ప్రపంచానికి మరోసారి గర్వపడేలా చూపించాడని కొనియా డుతున్నారు. ఈ నేపథ్యంలోనే నీరజ చోప్రాకు హర్యానా సర్కారు భారీ నజరానా ప్రకటించింది. రూ. 6 కోట్ల నగదు మరియు గ్రూప్ -1 క్యాడర్ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించింది హర్యానా సర్కార్. అలాగే 50 శాతం రాయితీతో కూడిన ఇంటిస్థలం కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది.
This post was last modified on August 7, 2021 8:03 pm
కట్టుకున్న వాడిపైనే భార్య కత్తి దూసింది.. కారణం చిన్నదిగానే కనిపిస్తున్నా దాని వెనక అభిప్రాయ భేదాలు, అపార్థాలు కూడా పెద్ద…
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…