సెక్స్ ఎడ్యుకేషన్ ఇది చాలా అవసరం. విద్యార్థి దశలో ఉన్నప్పుడే పిల్లలకు దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఇప్పటి వరకు చాలా మంది నిపుణులు పేర్కొన్నారు. అయితే.. దీనిని ఆచరణలో పెట్టేందుకు అమెరికాలోని షికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ తీసుకున్న నిర్ణయం మాత్రం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఐదో తరగతి, ఆ పై తరగతుల విద్యార్థులకు కండోమ్స్ ఉచితంగా ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్కూల్లోనే కండోమ్స్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతుండటం గమనార్హం.
ఈ నిబంధన ఆ బోర్డు పరిధిలోని 600 స్కూళ్లకు ఈ విద్యా సంవత్సరం నుంచే వర్తించనుంది. ఈ విధానం ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాలల్లో 250 వరకు, హైస్కూళ్లలో వెయ్యి వరకు కండోమ్స్ ప్యాకెట్లను నిరంతరం అందుబాటులో ఉంచనున్నారు. ఇవి పూర్తిగా ఉచితం. విద్యార్థుల్లో లైంగిక వ్యాధులు, అవాంఛిత గర్భాలను నిరోధించేందుకే ఈ పాలసీని తీసుకొచ్చినట్లు సీపీఎస్ (చికాగో పబ్లిక్ స్కూల్స్) అధికారులు చెబుతున్నారు.
ఈ సెక్స్ పాలసీపై సీపీఎస్ డాక్టర్ కెన్నెత్ మాట్లాడుతూ, దీనిపై కాస్త వివాదం రేగే అవకాశం ఉన్నప్పటికీ… విద్యార్థుల ఆరోగ్య రీత్యా ఇది అవసరమని తెలిపారు. సమాజం చాలా మార్పులకు గురైందన్నారు. విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచకపోతే… వారికి సరైన జాగ్రత్తలు చెప్పకపోతే… వారికి చెడు జరిగే అవకాశం ఉందన్నారు.
మరోవైపు, సెక్స్ ఎడ్యుకేషన్లో భాగంగా ఐదో తరగతి విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచాలన్న పాలసీని కొంతమంది తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐదో తరగతి అంటే కేవలం 12 ఏళ్ల వయసు ఉంటుందని… అప్పటికీ వారు ఇంకా చిన్నపిల్లలే అని చెబుతున్నారు. పిల్లలకు కండోమ్స్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇది సరైన నిర్ణయం కాదని, దీనిపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు.
This post was last modified on July 13, 2021 11:31 am
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…
ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…
కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…