సెక్స్ ఎడ్యుకేషన్ ఇది చాలా అవసరం. విద్యార్థి దశలో ఉన్నప్పుడే పిల్లలకు దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఇప్పటి వరకు చాలా మంది నిపుణులు పేర్కొన్నారు. అయితే.. దీనిని ఆచరణలో పెట్టేందుకు అమెరికాలోని షికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ తీసుకున్న నిర్ణయం మాత్రం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఐదో తరగతి, ఆ పై తరగతుల విద్యార్థులకు కండోమ్స్ ఉచితంగా ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్కూల్లోనే కండోమ్స్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతుండటం గమనార్హం.
ఈ నిబంధన ఆ బోర్డు పరిధిలోని 600 స్కూళ్లకు ఈ విద్యా సంవత్సరం నుంచే వర్తించనుంది. ఈ విధానం ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాలల్లో 250 వరకు, హైస్కూళ్లలో వెయ్యి వరకు కండోమ్స్ ప్యాకెట్లను నిరంతరం అందుబాటులో ఉంచనున్నారు. ఇవి పూర్తిగా ఉచితం. విద్యార్థుల్లో లైంగిక వ్యాధులు, అవాంఛిత గర్భాలను నిరోధించేందుకే ఈ పాలసీని తీసుకొచ్చినట్లు సీపీఎస్ (చికాగో పబ్లిక్ స్కూల్స్) అధికారులు చెబుతున్నారు.
ఈ సెక్స్ పాలసీపై సీపీఎస్ డాక్టర్ కెన్నెత్ మాట్లాడుతూ, దీనిపై కాస్త వివాదం రేగే అవకాశం ఉన్నప్పటికీ… విద్యార్థుల ఆరోగ్య రీత్యా ఇది అవసరమని తెలిపారు. సమాజం చాలా మార్పులకు గురైందన్నారు. విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచకపోతే… వారికి సరైన జాగ్రత్తలు చెప్పకపోతే… వారికి చెడు జరిగే అవకాశం ఉందన్నారు.
మరోవైపు, సెక్స్ ఎడ్యుకేషన్లో భాగంగా ఐదో తరగతి విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచాలన్న పాలసీని కొంతమంది తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐదో తరగతి అంటే కేవలం 12 ఏళ్ల వయసు ఉంటుందని… అప్పటికీ వారు ఇంకా చిన్నపిల్లలే అని చెబుతున్నారు. పిల్లలకు కండోమ్స్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇది సరైన నిర్ణయం కాదని, దీనిపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు.
This post was last modified on July 13, 2021 11:31 am
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…